కేయూ క్యాంపస్ : ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులు వీసా కోసం దరఖాస్తు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్ ప్రతినిధి ఆడం ఫర్సూనస్ సూచించారు. వీసా దరఖాస్తు, యూనివర్సిటీల ఎంపికలో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు గురువారం కేయూ సెనేట్ హాల్లో సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆడం ఫర్సూనస్ పవర్ పాయింట్ ప్రజెంటే షన్ ద్వారా పలు అంశాలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ అమెరికాలోని యూనివర్సిటీల్లో చదువు ఖ ర్చుతో కూడుకున్నదని తెలిపారు. దీన్ని గుర్తించి స్థోమతకు తగినవి ఎంపిక చేసుకోవాలని సూ చించారు. నకిలీ సర్టిఫికెట్లు సమర్పిస్తే వీసా నిరాకరించడంతో పాటు భవిష్యత్లో దారులు మూసుకుపోతాయన్నారు. కాగా, ఆడం ఫర్సూనస్ తొలుత కేయూ వీసీ ప్రొఫెసర్ ఆర్.సాయన్న, ఇన్చార్జి రిజిస్ట్రార్ జి.బెనర్జీ, ప్రిన్సిపాల్ రవీందర్రెడ్డి, ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి కె.పురుషోత్తం, ఇన్ఫార్మటిక్స్ విభాగం డాక్టర్ మంజులతో భేటీ అయ్యా రు. కేయూ సర్టిఫికెట్ల ముద్రణలో తీసుకుంటు న్న జాగ్రత్తలను తెలుసుకున్నారు. అమెరికన్ కాన్సులేట్ ప్రతినిధులు సునీత, తన్నీరు, కిషోర్ పాల్గొన్నారు.
నకిలీ సర్టిఫికెట్లు సమర్పిస్తే వీసా నిరాకరణ
Published Fri, Sep 2 2016 12:07 AM
Related news
-
టీడీపీ మునస్వామి.. థామస్ ఎలా అయ్యాడు?
‘డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరావుగారంటారు ధనముంటే అప్పలమ్మనే అప్సరసని పొగిడేస్తారు కాషే ఉంటే ఫేస్కు విలువస్తుంది నోటే ఉంటే మాటకు బలమొస్తుంది..’ ఇది ఓ తెలుగు సినిమాలో ఫేమస్ పాట. అచ్చం ఇలాంటిదే జీడీనెల్లూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. టీడీపీ తురఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న వీ.ఎం.థామస్ కులం, మతం, చదవులపై పలు అనునాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్మీడియెట్ టీసీలో వీ.మునస్వామిగా ఉన్న ఆయన పేరు ఆ తర్వాత కొంత కాలానికి వీ.ఎం.థామస్గా మారిపోవడం వెనుక ఆంతర్యమేమిటో అంతుపట్టడంలేదు. ఇక ప్రపంచ ప్రఖ్యాత సంతాన సాఫల్య వైద్యునిగా పేరుగడిస్తున్న ఆయన చదువుపైనా హిందూ ధర్మ పరిరక్షణ సమితి నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు నిజనిజాలు నిగ్గు తేల్చాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలోని గంగాధరనెల్లూరు నియోజకవర్గం టీడీపీ తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి మునస్వామి (థామస్) 1990–91లో కార్వేటినగరం మండల కేంద్రంలోని ఆర్కేఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ పూర్తిచేశారు. ఆ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీచేయబోతున్న ఆయనపై పలు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మునస్వామి మతం, విద్యార్హతలు, నేరచరిత్ర పైన సమగ్ర విచారణ చేయాలని హిందూ ధర్మ పరిరక్షణ సమితి కన్వీనర్ మిట్టపల్లి సతీష్రెడ్డి జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఇంటర్మీడియెట్ కోర్సు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ (టీసీ)లో వీ.మునస్వామిగా ఉన్న వ్యక్తి ప్రస్తుతం ఉన్న పాస్పోర్టు, కులధ్రువీకరణ పత్రంలో వీ.మునస్వామి థామస్గా ఎలా అయ్యారనే విషయాన్ని సమగ్ర విచారణ చేయించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంబీబీఎస్ చేయకున్నప్పటికీ డాక్టర్గా చెలామణి అవుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం థామస్ అనే క్రిస్టియన్ పేరు మీద చెలామణి అవుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. థామస్ పేరులోనే క్రిస్టియానిటీ ఉందని, కావున అతని ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసి, థామస్ నామినేషన్ను తిరస్కరించి, ఎన్నికల్లో అనర్హత వేటు వేయాలని ఫిర్యాదులో డిమాండ్ చేశారు. తప్పుడు పత్రంతో ఎన్నికల్లో పోటీ క్రైస్తవ మతం స్వీకరించిన థామస్కు ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని ఫిర్యాదులో పేర్కొన్నారు. మతం మారిన ఎస్సీలను బీసీలుగా గుర్తించాలని చట్టం చెబుతోందన్నారు. అయినప్పటికీ ఆయన తప్పుడు కులధ్రువీకరణ పత్రం సమర్పించి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారన్నారు. ఆయన ఎంబీబీఎస్ చదవక పోయినా పీహెచ్డీని అడ్డుపెట్టుకుని డాక్టర్గా చలామణి అవుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తను ప్రపంచ ప్రఖ్యాత సంతాన సాఫల్య వైద్యునిగా ప్రచారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. అలాగే ఆయన నేర చరిత్ర కలిగిన వ్యక్తి అని, 2017లో తన వద్ద డాక్టర్గా పనిచేసి మానేసిన డాక్టర్ ఎస్.రమ్యను హత్య చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలున్నాయన్నారు. ఆ కేసులో ఆయనతో పాటు ఆరుగురు అరెస్టు కాగా, తరువాత ఆ కేసు ఏమైందో తెలియడం లేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా కులధ్రువీకరణపత్రం 2022లో కార్వేటినగరం మండలంలో పనిచేసిన తహసీల్దార్ క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండానే నిబంధనలకు వ్యతిరేకంగా థామస్కు కులధ్రువీకరణ పత్రం జారీచేశారని తెలిసింది. 2022లో కార్వేటినగరం తహసీల్దార్గా పనిచేసిన షబ్బర్బాషా 26–04–2022న వీ.మునస్వామికి వీ.మునస్వామి థామస్ అని కులధ్రువీకరణ పత్రం ఎలా ఇచ్చారు?.. కులంపై వివాదం వచ్చినపుడు సంబంధిత గ్రామంలో నలుగురిని అడిగి పంచనాయా చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా కులధ్రువీకరణ పత్రం ఎలా జారీచేశారని ఫిర్యాదుదారులు ప్రశ్నిస్తున్నారు. థామస్ మత మార్పిడి విషయాన్ని సమగ్రంగా విచారణ చేయాలని జై హిందుస్థాన్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అక్కిలిగుంట మధు ఈనెల మార్చి 15న జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్కు వినతి పత్రం అందజేశారు. ఆయన అందజేసిన వినతిలో సహజంగా పాస్ పోర్టు మంజూరు సమయంలో ఒక అక్షరం తప్పు ఉన్నా అధికారులు ఆమోదించరన్నారు. అలాంటిది మునస్వామి థామస్ అని పాస్పోర్టులో పొందారన్నారు. పేరు మార్చుకోవాలంటే గెజిట్ నోటిఫికేషన్ ఉండాలని, మతం మార్చుకుని ఉంటే సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. కాబట్టి పాస్పోర్టు సమయంలో మత మార్పిడి ధ్రువీకరణ పత్రం, గెజిట్ నోటిఫికేషన్ సమర్పించి ఉంటారని, సంబంధిత కార్యాలయం నుంచి నివేదిక తెప్పించుకుని విచారణ చేయాలని ఆ ఫిర్యాదులో కోరారు. వీటిపై సమగ్ర విచారణ 1.ఇంటర్ సర్టిఫికేట్లో వీ.మునస్వామి అని ఉన్న పేరు, పాస్పోర్టులో వీ.ఎం.థామస్గా ఎలా మారింది? 2.ఆయన జన్మస్థలం అల్లాగుంటని టీసీలోనూ, చైన్నె అని పాస్పోర్టులోనూ పేర్కొన్నారు. ఇందులో ఏది నిజం? 3. ఆయన వైద్యశాస్త్రం చదివారా..? లేక డాక్టరేట్ పొందిన వ్యక్తా? 4. ఆయనపై ఉన్న హత్యా ప్రయత్నం కేసు ఏమైంది. విచారణ కొనసాగుతోందా..? లేక కేసు కొట్టి వేశారా? పకడ్బందీగా విచారణ ఆధార్ కార్డులో వీ.ఎం, థామస్ అని ఉంది. ఏప్రిల్ 2022లో పనిచేసిన తహసీల్దార్ జారీచేసిన కులధ్రువీకరణ పత్రంలో వీ.మునస్వామి థామస్ అని జారీచేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నుంచి అందిన ఫిర్యాదులను సమగ్రంగా విచారిస్తున్నాం. ఆ ఫిర్యాదులకు సంబంధించిన రుజువులను పంపుతాం. ఈ ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేసి వాస్తవాలు తెలుసుకుంటాను. – పుష్పకుమారి, తహసీల్దార్, కార్వేటినగరం మండలం -
Ministry of Telecom: తప్పుడు సిమ్లు 21 లక్షలు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తప్పుడు ధృవీకరణ పత్రాలతో 21 లక్షల సిమ్ కార్డులు జారీ అయినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(డీఓటీ) అనుమానం వ్యక్తంచేసింది. రీ–వెరిఫికేషన్ చేసి బోగస్ సిమ్లుగా తేలిన వాటిని వెంటనే రద్దుచేయాలని భారతీ ఎయిర్టెల్, ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ టెలికం సంస్థలకు డీఓటీ హెచ్చరికలు జారీచేసింది. సంచార్ సాతీ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 114 కోట్ల మొబైల్ కనెక్షన్లను డీవోటీకి చెందిన ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఏఐ, డీఐయూ) విశ్లేíÙంచింది. దీంతో దేశవ్యాప్తంగా తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో 21 లక్షల సిమ్ కార్డులు యాక్టివేట్ అయి ఉన్నట్లు డీఓటీ విశ్లేషణలో తేలింది. మనుగడలో లేని, తప్పుడు, ఫోర్జరీ, నకిలీ ధృవీకరణ పత్రాలతో ఈ సిమ్కార్డులను సంపాదించి యాక్టివేట్ చేసి ఉంటారని ఏఐ, డీఐయూ విశ్లేషణలో వెల్లడైంది. దేశంలో తొమ్మిది సిమ్ కార్డుల కంటే ఎక్కువ తీసుకున్న వారు ఏకంగా 1.92 కోట్ల మంది ఉన్నట్లు ఈ విశ్లేషణలో వెల్లడైంది. 21 లక్షల సిమ్ కార్డుల్లో కొన్ని అనుమానాస్పద ఫోన్ నంబర్ల జాబితాను విడుదల ఆయా టెలికం కంపెనీలకు డీఓటీ పంపించింది. వాటి ధృవీకరణ పత్రాలను సరిచూసి రీవెరిఫికేషన్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రీవెరిఫికేషన్లో ఆ సిమ్లు తప్పుడు పత్రాల ద్వారా తీసుకున్నట్లు గుర్తిస్తే ఆ నంబర్లను తక్షణం రద్దు చేయాలని సూచించింది. ఇప్పటి వరకు 1.8 లక్షల మొబైల్ హ్యాండ్సెట్లను పనిచేయకుండా చేశామని డీఓటీ అధికారులు చెప్పారు. అనుమానాస్పద నంబర్లపై దర్యాప్తును సరీ్వసు ప్రొవైడర్లు వేగవంతం చేయాలని డీవోటీ తుది గడువు విధించింది. సైబర్ నేరాలకు దుర్వినియోగం! తప్పుడు పత్రాలతో పొందిన సిమ్లను ఆయా వ్యక్తులు సైబర్ నేరాలకు వాడుతున్నట్లు డీఓటీ అనుమానం వ్యక్తంచేసింది. ఒక ప్రాంతంలో తీసుకున్న బోగస్ సిమ్ను సుదూర ప్రాంతాల్లో వాడున్నట్లు గుర్తించారు. తప్పుడు పత్రాలతో సేకరించిన సిమ్ల ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతూ కోట్లు కొల్లగొట్టే ప్రమాదముంది. సిమ్లను సైబర్ నేరాలకు వాడుతున్నట్లు తేలితే వాటిని రద్దు చేయడంతో పాటు ఫోన్నూ పనికిరాకుండా చేస్తామని హెచ్చరించింది. -
నకిలీ ధ్రువ పత్రాల నియంత్రణకు పటిష్ట చర్యలు
సాక్షి, అమరావతి: జనన, మరణ నమోదు (సవరణ చట్టం–2023)పై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో జరిగే జనన, మరణ రిజిస్ట్రేన్ల ప్రక్రియ సకాలంలో జరిగేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. నకిలీ పత్రాలను నియంత్రించేందుకు పాత రికార్డులను డిజిటలైజేషన్ చేయాలన్నారు. ఈ చట్టానికి సంబంధించి పూర్తి స్థాయి నిబంధనలు, మార్గదర్శకాల నోటిఫికేషన్ వచ్చేలోగా క్షేత్రస్థాయి అధికారులందరికీ ఈ చట్టంపై పూర్తి అవగాహన కోసం తగిన సమాచారాన్ని అందించాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. జననాలతో పాటు మరణాలు కూడా గ్రామ, మున్సిపాలిటీల స్థాయిలోను ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల సహా ప్రతి చోటా సకాలంలో సక్రమంగా రిజిస్టర్ అయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యమిత్రల ద్వారా జనన, మరణ రిజిస్ట్రేన్ల నమోదు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కొత్త చట్టంలోని ముఖ్యాంశాలను వివరించారు. ఈ నూతన చట్టం ప్రకారం విద్యా సంస్థల్లో ప్రవేశానికి, డ్రైవింగ్ లైసెన్సు, ఓటరు జాబితా సవరణ, వివాహ రిజిస్ట్రేషన్, పాస్పోర్టు జారీ, ఆధార్, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం తప్పనిసరని తెలిపారు. ఇంకా పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, గ్రామ, వార్డు సచివాలయాల అదనపు డైరెక్టర్ అభిషేక్ గౌడ, న్యాయశాఖ కార్యదర్శి జి.సత్యప్రభాకరరావు తదితర అధికారులు పాల్గొన్నారు. -
నకిలీ పాస్పోర్ట్ల ముఠా గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్, సాక్షిప్రతినిధి, కరీంనగర్: నివాస ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు ఇలా అన్నింటినీ నకిలీవి సృష్టించి విదేశీయులకు స్థానికంగా పాస్పోర్టులు జారీ చేయిస్తున్న ఓ ముఠా గుట్టురట్టు చేశారు తెలంగాణ సీఐడీ పోలీసులు. ఈ మొత్తం ముఠాలో కీలక నిందితుడు అబ్దుస్ సత్తార్ ఉస్మాన్ అల్ జహ్వరీతో పాటు నకిలీ పాస్ పోర్టుల జారీకి పనిచేస్తున్న తొమ్మిది మంది ముఠా సభ్యులు, వీరికి సహకరిస్తున్న ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ అధికారులు.. మొత్తం 12మందిని శుక్రవారం అరెస్టు చేశారు. విదేశాల నుంచి వచ్చిన శరణార్థులు, అక్రమ చొరబాటు దారులకు నిబంధనలకు విరుద్ధంగా పాస్పోర్టులు జారీ అవుతున్నట్టు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు తెలంగాణ సీఐడీ రంగంలోకి దిగింది. హైదరాబాద్, జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్, కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో సీఐడీ అధికారుల 12 ప్రత్యేక బృందాలు ఈనెల 18న ఏక కాలంలో సోదాలు జరిపాయి. ఈ సోదాల్లో 108 పాస్పోర్టులు, 15 మొబైల్ ఫోన్లు, ఐదు ల్యాప్టాప్లు, మూడు ప్రింటర్లు, 11 పెన్డ్రైవ్లు, ఒక స్కానర్, పాస్పోర్టు దరఖాస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐడీ ఎకనమిక్ అఫెన్స్ వింగ్ ఎస్పీ కే వెంకట లక్ష్మి నేతృత్వంలో చేపట్టిన ఈ ఆపరేషన్ వివరాలను సీఐడీ అడిషనల్ డీజీ శిఖాగోయల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. నకిలీ పత్రాల తయారీ నుంచి పాస్పోర్టుల వరకు హైదరాబాద్కు చెందిన అబ్దుస్ సత్తార్ స్థానికంగా గ్రాఫిక్ డిజైనింగ్, ప్రింటింగ్ వర్క్లో పనిచేసేవాడు. 2011నుంచి ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్, డిగ్రీ సర్టిఫికెట్లు, జనన ధ్రువీకరణ పత్రాలు సృష్టించడం ప్రారంభించాడు. చెన్నైకి చెందిన ఓ పాస్పోర్టు బ్రోకర్తో టచ్లోకి వెళ్లిన సత్తార్..రూ.75 వేల కమీషన్కు ఒక్కో పాస్పోర్టు జారీ చేసేలా.. ఇందుకు అవసరమైన నకిలీ పత్రాలు కూడా సృష్టించేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ముందుగా నకిలీ ఓటర్ ఐడీ, ఆధార్కార్డులు, జనన ధ్రువీకరణ పత్రాలు సృష్టించిన తర్వాత సత్తార్ హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లోని పాస్పోర్టు కార్యాలయాల్లో స్లాట్లు బుక్ చేయించి ఇక్కడి నుంచి పాస్పోర్టులు జారీ చేయించేవాడు. పోలీస్ వెరిఫికేషన్కు వచ్చే స్పెషల్ బ్రాంచ్ అధికారులకు సైతం లంచాలు ఇస్తూ ఈ దందా కొనసాగిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు కీలక నిందితులతోపాటు ఈ ముఠాలో చెన్నై ఏజెంట్ను సైతం బెంగళూరులో అరెస్టు చేసి అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఈ ముఠా నుంచి పాస్పోర్టులు పొందిన వారిలో 92 మంది విదేశీ ప్రయాణాలు చేసినట్టు సీఐడీ అధికారుల దర్యాప్తులో తెలిసింది. మొత్తం 12 మంది నిందితులను జ్యుడీషియల్ రిమాండ్కు తరలించినట్టు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్టు వారు పేర్కొన్నారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు లంచాల ఎర! నకిలీ పాస్పోర్టుల కుంభకోణంలో సీఐడీ అధికారులు తవ్విన కొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన ఈ ముఠా.. కేవలం నకిలీ పత్రాలతో పాస్పోర్టులను సంపాదించడమే కాకుండా.. విదేశీయులు, దేశంలోకి అక్రమంగా చొరబడిన బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు కూడా భారతీయత ఉండేలా తప్పుడు ఐడీలు సృష్టించి, పాస్పోర్టులు, వీసాలు ఇప్పించి సాగనంపారని తెలుస్తోంది. స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు సైతం లంచాలిచ్చి భారతీయులు కాని వారికి సైతం ఇక్కడి జనన, విద్యార్హత, ఇతర ధ్రువీకరణ పత్రాలు ఇప్పించి విదేశాలకు విమానాలెక్కించారని విచారణలో తెలిసింది. చాలా పాస్పోర్టులకు ఒకే ఆధార్ కార్డు ఉండటం, కస్టమర్లందరికీ ఏజెంట్లు తమ ఫోన్నెంబరునే అటాచ్ చేసి ఉంచడంతో అనుమానం వచ్చిన పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా సోదాలు చేపట్టడంతో ముఠా గుట్టు బయటపడింది. అరెస్టు అయింది వీరే! అబ్దుస్ సత్తార్ ఉస్మాన్ అల్ జవహరీ నాంపల్లి.. హైదరాబాద్, మహ్మద్ ఖమ్రుద్దీన్ కోరుట్ల, చాంద్ ఖాన్ కోరుట్ల, దేశోపంతుల అశోక్ రావు కోరుట్ల, పెద్దూరి శ్రీనివాస్ తిమ్మాపూర్.. కరీంనగర్, గుండేటి ప్రభాకర్ జగిత్యాల, పోచంపల్లి దేవరాజ్ వేములవాడ, చెప్పాల సుభాష్ భీంగల్.. నిజామాబాద్, అబ్దుల్ షుకూర్ రాయికల్.. జగిత్యాల, సయ్యద్ హాజీ (కాలాపత్తర్) తోపాటు వీరికి సహకరించిన మరో ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ అధికారులు అరెస్టయ్యారు. -
నకిలీ దందా.. దామచర్ల చుట్టూనే..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో సంచలనం సృష్టించిన నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ రబ్బరు స్టాంపుల కుంభకోణం టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే సాగాయి. సిట్ దర్యాప్తులో వెలుగుచూస్తున్న విషయాలను పరిశీలిస్తే టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ దందా సాగినట్లు తెలుస్తోంది. ప్రధానంగా 2014 నుంచి 2019 వరకు పచ్చ పార్టీ నేతల కనుసన్నల్లోనే మూడు డాక్యుమెంట్లు...ఆరు రబ్బరు స్టాంపుల చందంగా విరాజిల్లింది. ఈ దందా అంతా టీడీపీ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ అండదండలతోనే ఒంగోలు నగరంతో పాటు జిల్లాలో వేళ్లూనుకుపోయింది. దామచర్ల నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపుల కుంభకోణానికి రింగ్ లీడర్గా అవతారమెత్తాడు. ఈ కేసులో ఇప్పటికే కీలక వ్యక్తిగా ఉన్న టీడీపీకి చెందిన మహిళా నాయకురాలు, దామచర్ల ప్రధాన అనుచరురాలు పెరంమూరు వరలక్ష్మి అలియాస్ పెద్దిశెట్టి వరలక్ష్మికి 2012లో స్టాంప్ వెండర్ లైసెన్స్ను ఇప్పించాడు. అప్పటి నుంచే ఆమె దస్తావేజులను కేవలం నకిలీ డాక్యుమెంట్ల తయారీకి విక్రయిస్తూ ఈ రాకెట్కు తెరతీసింది. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత దామచర్ల తన అనుచరులను శాఖకు బదిలీ చేయించుకోవడంతో నకిలీ డాక్యుమెంట్ల కుంభకోణానికి అడ్డే లేకుండా పోయింది. నకిలీల చేతిలో 1100 దస్తావేజులు జిల్లా కోర్టు ప్రాంగణానికి సమీపంలో దస్తావేజులు విక్రయించేందుకు వరలక్ష్మికి ఒక దుకాణం కూడా ఏర్పాటు చేయించి దాన్ని దామచర్ల ప్రారంభించాడు. అప్పటి నుంచి దస్తావేజులను నకిలీ దందాలు చేసే ముఠాలకు మాత్రమే విక్రయిస్తూ భారీగా ఆర్జించింది. నకిలీ డాక్యుమెంట్లు, రబ్బరు స్టాంపుల కుంభకోణం వెలుగు చూడటంతో ఎస్పీ మలికాగర్గ్ సిట్ను ఏర్పాటు చేసింది. రంగంలోకి దిగిన సిట్ బృందం లోతైన దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తులో స్టాంప్ వెండర్ వరలక్ష్మి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. రిజిస్ట్రేషన్ శాఖ నిబంధనలను ఉల్లంఘించిన ఆమె నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసే వారికి, సంతకాలు ఫోర్జరీ చేసే వాళ్లకు మాత్రమే విక్రయించి సొమ్ము చేసుకుంది. సిట్ దర్యాప్తులో ఇప్పటి వరకు దాదాపు 1100 దస్తావేజులు నిబంధనలకు విరుద్ధంగా విక్రయించినట్లు తేలింది. వరలక్ష్మికి పార్టీ పదవులెన్నో... నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపుల కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన వరలక్ష్మికి రాష్ట్ర స్థాయిలో అంగన్వాడీ విభాగం అసోసియేషన్కు కార్యదర్శి పదవిని కూడా ఇప్పించాడు. ఆ తరువాత ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో 29వ డివిజన్ పార్టీ అభ్యర్థిగా పార్టీ కోసం పనిచేసిన ముఖ్యులు నలుగురిని కాదని వరలక్ష్మికి టిక్కెట్ ఇప్పించాడు. టిక్కెట్ ఇప్పించటంతో పాటు ఎన్నికల ఖర్చు కూడా దామచర్లే పెట్టుకున్నాడన్న ప్రచారమూ అప్పట్లో జరిగింది. ఇవన్నీ పరిశీలిస్తే దామచర్ల ఆమెను ఎంతగా ప్రోత్సహించారో అర్థం చేసుకోవచ్చు. ఎల్లో మీడియాను అడ్డంపెట్టుకుని.. సిట్ దర్యాప్తులో టీడీపీ నాయకుల పాత్రలు వెలుగుచూస్తుడడంతో అధికార పార్టీపై నెపం వేసేందుకు దామచర్ల ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకున్నారు. నిత్యం అధికార పార్టీపై బురద జల్లుతూ వాస్తవాలను వక్రీకరిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. అసలు ఈ దర్యాప్తును కోరిందే ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. దోషులు ఎవరున్నా వదిలిపెట్టవద్దని సీఎంఓలో ఉన్న కీలక అధికారులను సైతం ఆయన కోరిన విషయం తెలిసిందే. ఇవన్నీ పక్కన పెట్టి ఎల్లో మీడియా ప్రతి రోజూ ఒక కథనాన్ని వండి వారుస్తోంది. రూ.100 దస్తావేజు రూ.10 వేలకు విక్రయం... ఒంగోలు కేంద్రంగా దస్తావేజులు అక్రమ విక్రయాలకు పెద్దిశెట్టి వరలక్ష్మి కేంద్ర బిందువుగా మారింది. సాధారణంగా రూ.100 విలువైన దస్తావేజును అదే ధరకు అమ్మాలి. అయితే ఒక్కో చోట స్టాంపు వెండర్లు రూ.100 విలువ చేసే దస్తావేజుకు అదనంగా రూ.20 నుంచి రూ.40 వరకు వసూలు చేసుకుంటారు. ఈ విషయం రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు తెలిసినా పెద్దగా పట్టించుకునే వారు కాదు. అయితే వరలక్ష్మి మాత్రం రూ.100 దస్తావేజును రూ.10 వేలకు విక్రయించి భారీ స్థాయిలో సొమ్ము చేసుకుంది. దానికి ప్రధాన కారణం అప్పటి ఎమ్మెల్యేగా దామచర్ల అండదండలే. టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే.. నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారం మొత్తం టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే సాగినట్లు ఇప్పటి వరకు సిట్ దర్యాప్తులో తేటతెల్లమైంది.. ఇప్పటి వరకు 18 కేసులు నమోదు చేసి దాదాపు 25 మంది వరకు అరెస్టు చేశారు. వారిలో టీడీపీ నాయకులు దాదాపు ఏడెనిమిది మంది ఉన్నారు. మిగతా వాళ్లలో టీడీపీ సానుభూతి పరులే అధికం. టీడీపీ నాయకుడు బాపట్ల వెంకటేశ్వర్లు, అసదుల్లా, రాయపాటి ఏలియా, రాయపాటి అచ్యుత్, కారాని దుర్గాతో పాటు పలువురు ఉన్నారు. రాజాపానగాలరోడ్డుకు చెందిన డాక్యుమెంట్ రైటర్ సురేష్ కూడా 10 రోజుల నుంచి పరారీలో ఉన్నాడు. ఈ కేసులో డాక్యుమెంట్ల రైటర్ల పాత్ర సైతం ఉన్నట్లు సిట్ దర్యాప్తులో తేలినట్లు సమాచారం. దీంతో నగరానికి చెందిన పలువురు డాక్యుమెంట్లు రైటర్లు పరారీలో ఉండగా పోలీసులు గాలిస్తున్నారు. వరలక్ష్మి కోసం పోలీసుల ముమ్మర గాలింపు... దస్తావేజుల కుంభకోణంలో వరలక్ష్మి పాత్ర వెలుగుచూడడంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. రాజాపానగాలరోడ్డులో నివాసం ఉంటే వరలక్ష్మి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఎస్పీ మలికాగర్గ్ నేతృత్వంలోని సిట్ బృందం ఆమె కదలికలపై నిఘా పెట్టింది. అయితే టీడీపీలోని ప్రధాన నాయకులు ఆమెను తమ సంరక్షణలో ఉంచుకొని కాపాడుతున్నట్లు సమాచారం. సెల్ఫోన్లు, ఫోన్ నంబర్లు మారుస్తూ ఇతర ప్రాంతాలకు వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వరలక్ష్మితో పాటు ఆమెకు ఆశ్రయం కల్పించిన వారి కదలికలపై కూడా సిట్ నిఘా ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం. వరలక్ష్మి విక్రయించిన దస్తావేజులు కోర్టుల్లో కేసుల రూపంలో కొనసాగుతున్నట్లు కూడా సిట్ బృందానికి సమాచారం వచ్చింది. అనేక సమస్యలకు, ఆస్తులు వివాదాల్లోకి వెళ్లటానికి కూడా వరలక్ష్మి విక్రయించిన దస్తావేజులు ప్రధానంగా ఉన్నటు దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నాయి. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో రికార్డుల పరిశీలనలో 1100 దస్తావేజులను నిబంధనలకు విరుద్ధంగా విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఇంకా వేల సంఖ్యలో దస్తావేజులను అక్రమార్కులకు విక్రయించినట్లు తెలుస్తోంది.
Related News by category
-
No Headline
వరంగల్ అర్బన్: ‘కారు కడిగితే రూ.5 వేలు జరిమానా. స్విమ్మింగ్ పూల్స్ వాడితే కఠిన చర్యలు. మోటార్లు పెట్టి నీటిని లాగితే జైలు శిక్ష’ ఇది కర్ణాటకలో పరిస్థితి. అక్కడ తాగునీటి క్యాన్ (20 లీటర్లు) రూ.200 ధర పలుకుతోందట! అలాంటి పరిస్థితి మనకు రావొద్దంటే నీటిని సరిగ్గా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని పర్యావరణవేత్తలు అంటున్నారు. గ్రేటర్ వరంగల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. మూడేళ్ల తర్వాత మళ్లీ రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తున్నారు. అదీ గంట కూడా పైపులైన్ల చివరి నల్లాల వరకు అందడం లేదు. జూన్లో వర్షాలు కురవకపోతే దేవాదుల నుంచి నీటిని పంపింగ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే నగరానికి నీటి కష్టాలు తప్పకపోవచ్చు. ప్రత్యామ్నాయ జలాశయాలు లేక నీటి ఎద్దడి సమస్య మరింత జఠిలమయ్యే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయమేది? వరంగల్ మహానగర ప్రజలకు ధర్మసాగర్ చెరువు మాత్రమే శరణ్యమైంది. ధర్మసాగర్ జలాశయం సామర్థ్యం 1,500 ఎంసీఎఫ్టీ. ప్రస్తుతం ధర్మసాగర్లో ఉన్న నీరు మరో 80 రోజుల వరకు సరిపోతు ందని ఇంజనీర్లు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు, డెడ్ స్టోరేజీ, నీటి వాడకం తదితర కారణాలతో 60 రో జులే నీరందవచ్చని నిపుణుల అంచనా. లీకేజీలు.. అక్రమ నల్లాలు ప్రస్తుతం మహా నగరానికి రోజూ 6 ఎంసీఎఫ్టీల నీరు అవసరం కాగా.. 5 ఎంసీఎఫ్టీల రా వాటర్ సరఫరా అవుతోంది. ఫిల్టర్బెడ్ల ద్వారా శుద్ధి చేసిన నీరు 35 శాతం నీటికి లెక్కలు దొరకడం లేదు. లీకేజీలు, అక్రమ కనెక్షన్లతో నీరు పక్కదారి పడుతోంది. కొన్ని చోట్ల మోటార్లతో నీటిని లాగుతున్నారు. ఇంత జరుగుతున్నా.. ఇంజనీర్లు వైఫల్యం చెందుతున్నారనే విమర్శలున్నాయి. దేశాయిపేట ఫిల్టర్బెడ్ -
నీటి ఎద్దడి రాకుండా చూడాలి
దుగ్గొండి : వేసవి పూర్తయ్యే వరకు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రత్యేక అఽధికారి, జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని చాపలబండ, గిర్నిబావి, అడవిరంగాపురం గ్రామాల్లో గురువారం ఆయన తాగునీటి వనరులను పరిశీలించారు. ఆయా గ్రామాల్లోని బావుల్లో నీటి లభ్యత, గ్రామానికి కావాల్సిన నీటి అంచనాలను బేరీజు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే వ్యవసాయ బావులను అద్దెకు తీసుకుని పైపులైన్ ద్వారా నీటిని బావిలోకి పోయించాలన్నారు. చేతి పంపులను వెంటనే మరమ్మతులు చేయించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. కార్యదర్శులు నిరంతరం గ్రామాల్లో ఉంటూ ప్రజలకు సేవలందించాలని సూచించారు. ఆయన వెంట మండల పంచాయతీ అధికారి మోడెం శ్రీధర్గౌడ్, పంచాయతీ కార్యదర్శులు వైనాల రాజు, మాడిశెట్టి స్రవంతి, సునీత పాల్గొన్నారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలి నల్లబెల్లి : గ్రామ పంచాయతీ రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి కటకం కల్పన అన్నారు. మండలంలోని నందిగామ గ్రామాన్ని గురువారం ఆమె గురువారం సందర్శించారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించారు. మంచినీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. డీపీఓ వెంట మండల పంచాయతీ అధికారి కూచన ప్రకాశ్, పంచాయతీ కార్యదర్శి వద్ది రాజు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ ఎంపీ స్థానం బీజేపీదే.. గీసుకొండ : దేశ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, ఈసారి వరంగల్ ఎంపీ స్థానం బీజేపీకే అని పార్టీ పరకాల నియోజకవర్గ ఇన్చార్జ్, ఎంపీ ఎన్నికల మండల కోఆర్డినేటర్ డాక్టర్ పెసరు విజయ్చందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం అనంతరం గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో మరోమారు మోదీ అధికారంలోకి వస్తే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు అవసరమైన నిధులు మంజూరు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలను నెరవేర్చలేదన్నారు. బీఆర్ఎస్ అవినీతి, అక్రమాలతో కూరుకుపోయిందన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ గెలుపు కోసం కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని కోరారు. సమావేశంలో బీజేపీ పరకాల నియోజకవర్గ ఇన్చార్జ్ ముల్క ప్రసాద్, మండల అధ్యక్షుడు జాన్విక్రం, నాయకులు కత్తి వెంకన్న, ఆకుల వెంకన్న, మర్రి రాజు, సంతోష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. మొక్కజొన్న చేను దగ్ధం ● మూడు గొర్రెలు సజీవ దహనం ● రూ.2 లక్షల ఆస్తినష్టం నర్సంపేట రూరల్ : అగ్ని ప్రమాదంలో మొక్కజొన్న చేను దగ్ధమైన సంఘటన మహేశ్వరం గ్రామ శివారులో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. నర్సంపేట మండలంలోని రాజపల్లి గ్రామానికి చెందిన నామాల పరమేశ్వర్కు మహేశ్వరం గ్రామ శివారులోని 1.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిలో మొక్కజొన్న పంట సాగు చేశాడు. పంట కోత దశకు వచ్చింది. ప్రమాదవశాత్తు గాలికి మంటలు చెలరేగడంతో పంట పూర్తిగా దగ్ధమైంది. మొక్కజొన్న చేనులో మేత మేస్తున్న మూడు గొర్రెలు సైతం సజీవ దహనమయ్యాయి. మొత్తం రూ.2 లక్షల ఆస్తినష్టం వాటిల్లిందని బాధితుడు రోదిస్తూ తెలిపాడు. ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరాడు. -
ఎల్ఈడీ వెలుగులేవి?
నల్లబెల్లి : గ్రామాల్లో ఉపయోగిస్తున్న వీధిలైట్లతో విద్యుత్ బిల్లులు భారీగా రావడం.. నిర్వహణ కష్టమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విద్యుత్ పొదుపు, నిర్వహణ వ్యయం తగ్గేలా వీధిలైట్లను నిర్వహిస్తామని ముందుకొచ్చిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) గుర్తింపు సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు గ్రామ పంచాయతీల్లో ఏడేళ్లపాటు ఎల్ఈడీ లైట్ల సరఫరా, ఏర్పాటు, నిర్వహణ వ్యవహారాలను ఈ సంస్థ చూడాల్సి ఉంది. ప్రజాప్రతినిధుల పట్టింపు, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పంచాయతీల్లో ఎల్ఈడీ లైట్ల నిర్వహణను సంస్థ గాలికొదిలేసింది. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి బిగించిన లైట్లను మరమ్మతు చేయడం లేదు. పనిచేయని లైట్ స్థానంలో మరో లైట్ ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఇవేమీ పట్టనట్లుగానే వ్యవహరిస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒప్పందాన్ని విస్మరించిన ఈఈఎస్ఎల్ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) సంస్థ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు ఏడాదిన్నర క్రితం గ్రామ పంచాయతీలకు ఎల్ఈడీ లైట్ల వెలుగులు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. జిల్లాలో 323 గ్రామ పంచాయతీలు ఉండగా.. 319 గ్రామ పంచాయతీల్లో 56 వేల ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసింది. లైట్ల బిగింపుతోపాటు నిర్వహణ, ఇంధన పొదుపు సాంకేతికతలో భాగంగా టైమర్ల ఏర్పాటు వ్యవస్థను సంస్థ ఏడేళ్లపాటు చూసుకోవాల్సి ఉంది. కానీ, నిర్వహణ బాధ్యతలను ఈఈఎస్ఎల్ విస్మరించింది. ఫలితంగా సుమారు ఐదు నెలలుగా పలు గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. ఇక గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ కాంతులు వెదజల్లుతాయని అనుకున్న ప్రజల ఆశలు అడియాసలయ్యాయి. లైట్ల నిర్వహణ చేపట్టాలని మండలస్థాయి అధికారులు ఆ సంస్థ ప్రతినిధులను ఎన్నిమార్లు అడిగినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే చెబుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత ఉన్నతాధికారులు సంస్థపై తగు చర్యలు తీసుకొని గ్రామాల్లో ఎల్ఈడీ లైట్లు వెలిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. పల్లెల్లో నిర్వహణ బాధ్యతలను విస్మరించిన ఈఈఎస్ఎల్ ఐదు నెలలుగా అంధకారం.. కొరవడిన అధికారుల పర్యవేక్షణ జిల్లాలో 323 గ్రామాలు.. 319 జీపీల్లో 56 వేల లైట్లుసంస్థ పట్టించుకోవడం లేదు.. నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో గ్రామాల్లో కొన్ని నెలలుగా ఎల్ఈడీ లైట్లు వెలగడంలేదు. మరమ్మతులు చేయాలని పలుమార్లు సంబంధిత సంస్థ ప్రతినిధులకు చెప్పినా పట్టించుకోవడంలేదు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాం. గ్రామాల్లో రాత్రి వేళ ఎల్ఈడీ వీధిలైట్లు వెలుగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా మరమ్మతులు చేపట్టి ఎల్ఈడీ వెలుగులు అందించాలి. – కూచన ప్రకాశ్, మండల పంచాయతీ అధికారి, నల్లబెల్లిచర్యలు తీసుకుంటాం..గ్రామాల్లో ఎల్ఈడీ వీధిలైట్లు వెలగడం లేదని మా దృష్టికి వచ్చింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. నిర్వహణ పనులు సక్రమంగా జరిగేలా పర్యవేక్షిస్తాం. గ్రామాల్లో రాత్రి సమయాల్లో నిరంతరాయంగా ఎల్ఈడీ వీధి లైట్లు వెలిగేలా చూస్తాం. – కటకం కల్పన, జిల్లా పంచాయతీ అధికారి -
సాధారణానికి మించి..!
సాక్షి, వరంగల్ : జిల్లాలో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. నాలుగు రోజుల నుంచి సాధారణానికి మించి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతుండడంతో జనాలు బెంబేలెత్తుతున్నారు. దీనికితోడు ఉక్కపోత కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తుండడంతో హైరానా పడుతున్నారు. వారం క్రితం కాస్త చల్లబడిన వాతావరణం గత ఆదివారం నుంచి మళ్లీ వేడెక్కుతోంది. 40.4 డిగ్రీ సెల్సియస్ నుంచి ఇప్పుడు ఏకంగా 45.1 డిగ్రీ సెల్సియస్ వరకు చేరుకుంది. అంటే సాధారణ ఉష్ణోగ్రతను మించి 8 డిగ్రీ సెల్సియస్ అత్యధికంగా గురువారం నమోదైంది. 2022 మేలో వరంగల్లో రికార్డు స్థాయిలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో నెలరోజులు మిగిలి ఉండగానే ఆ స్థాయిలో ఏప్రిల్లోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదుకావడం గమనార్హం. రానున్న రోజుల్లో ఈ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చాలా మంది వడదెబ్బ తగిలి చికిత్స పొందుతున్నారు. కాగా, రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లా మాడ్గులపల్లిలో గురువారం ఉష్ణోగ్రత 45.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రాజకీయ పార్టీలకు గండం.. ఎండ వేడిమి ధాటికి జనాలు ఉదయం 8 దాటిందంటేనే బయటకు రావాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఇక మధ్యాహ్నం వేళ అవసరమైతేనే తప్ప ఎవరూ రోడ్ల పైకి రావడం లేదు. జిల్లాలో ఖిలా వరంగల్, గీసుకొండ, దుగ్గొండి, పర్వతగిరి, నెక్కొండ, సంగెం మండలాల్లో 45 డిగ్రీ సెల్సియస్ వరకు ఉండగా.. మిగలిన మండలాల్లో 40 నుంచి 42 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒంటిపూట బడులకు వెళ్లి వచ్చే విద్యార్థులకు తిప్పలు తప్పలేదు. పిల్లలను తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంకోవైపు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ సభలకు బదులు ఫంక్షన్హాళ్లలోనే సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఎండతో పాటు వడగాలుల ధాటికి ఏసీ ఫంక్షన్హాళ్లలోనే తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలంటూ ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎండలకు భయపడి వీటికి కూడా చాలా మంది రాకపోవడం గమనార్హం. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకోని రావాలని, నీరు, పండ్ల రసాలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారులు సూచిస్తున్నారు. గంటలకొద్దీ ప్రయాణం చేయవద్దని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రత ల వివరాలు.. నాలుగు రోజులుగా జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గీసుకొండ మండలం గొర్రెకుంటలో 45.1 డిగ్రీల నమోదు భానుడి ప్రతాపంతో ప్రజల బెంబేలు.. సభలకు బదులు ఫంక్షన్హాళ్లలో రాజకీయ పార్టీల సమావేశాలు అవసరమైతేనే బయటకు రావాలని వైద్యాధికారుల సూచనరోజు ప్రాంతం డిగ్రీ సెల్సియస్లలో ఆదివారం ఉర్సుగుట్ట 40.4 సోమవారం ఖిలా వరంగల్ 42.4 మంగళవారం కల్లెడ (పర్వతగిరి) 43.4 బుధవారం రెడ్లవాడ (నెక్కొండ) 43.7 గురువారం గొర్రెకుంట (గీసుకొండ) 45.1 -
అరూరి చిన్న మెదడు చిట్లింది
హసన్పర్తి: అరూరి రమేశ్ చిన్న మెదడు చిట్లిందని, అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ వర్ధన్నపేట నియోజకవర్గ సన్నాహక సమావేశం హనుమకొండ హంటర్రోడ్డులోని డీ–కన్వెన్షన్ హాల్లో గురువారం జరిగింది. సమావేశానికి కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కొంతమంది ఇతర పార్టీ నాయకులు కావ్యను నాన్లోకల్ అంటున్నారని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మార్చే అవకాశం ఉందన్నారు. బీజేపీకి ఓటు వేస్తే దేశంలో లౌకికవాదం లేకుండా పోతుందని తెలిపారు. పదేళ్ల కాలంలో బీజేపీ చేసిన అభివృద్ది ఏమీ లేదని, కేవలం దేవుళ్ల పేర్లు చెప్పుకుని పబ్బం గడుపుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య మాట్లాడుతూ పదేళ్ల కాలంలో వర్ధన్నపేట నియోజకవర్గంలో అరూరి రమేశ్ చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన ఓ భూ బకాసురుడని ఆరోపించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, యశస్వినిరెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, ఎంపీ దయాకర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ రియాజ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ నమిండ్ల శ్రీనివాస్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు పింగిళి వెంకట్రాంనర్సింహారెడ్డి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
ఆ సినిమా చూశాకే అలా చేయడం మానేశా: తమన్నా
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement