– ఇంటి చుట్టూ రాళ్లు అడ్డుపెట్టిన ప్రత్యర్థులు
– ఆపై మారణాయుధాలతో బెదిరింపులు
ఆత్మకూరు : ఆత్మకూరు మండలం దొడ్డే కొట్టాల గ్రామంలో రెండు కుటుంబాల మధ్య దాయాది పోరు రగులుతోంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. భూ వివాదమే దీనికంతటికీ కారణమైంది. రెండ్రోజుల నుంచి తమను ఇంట్లోకి వెళ్లనీయకుండా ప్రత్యర్థులు అడుగడుగునా అడ్డుపడుతున్నారంటూ బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఇంట్లోకి వెళ్లకుండా చుట్టూ రాళ్లు అడ్డుపెట్టి, ఆపై మారణాయుధాలతో బెదిరిస్తున్నారంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుల కథనం ప్రకారం...
అసలు కథలోకి వెళ్తే...
గ్రామంలో కృష్ణా అనే వ్యక్తి తమ తాత ముత్తాతల నుంచి సంక్రమించిన 13.80 ఎకరాలను అనుభవిస్తున్నాడు. ఇటీవల కృష్ణా పెదనాన్న కుమారులైన రాజశేఖర్, ఎర్రన్న, సాయినాథ్, శ్రీనివాసులు, రవికుమార్ అనే వ్యక్తులు బెదిరించి బలవంతంగా ఏడెకరాలను తమ పేరిట రాయించుకున్నారు. ఈ వివాదం కొనసాగుతుండగానే శుక్రవారం సాయంత్రం తన పొలంలోకి ప్రత్యర్థుల గొర్రెల మంద రావడాన్ని కృష్ణా ప్రశ్నించారు. దీన్ని జీర్ణించుకోలేని ప్రత్యర్థులు అదే రాత్రి.. మీరు ఇంట్లోకి ఎలా వస్తారో చూస్తామంటూ బెదిరించారు. ఇంట్లోకి వెళ్లకుండా చుట్టూ రాళ్లు అడ్డుపెట్టారు. ఆపై ఐదుగురు మారణాయుధాలతో తిరుగుతూ తమను భయభ్రాంతులకు గురి చేశారని కృష్ణా కుటుంబ సభ్యులు తెలిపారు. రెండ్రోజులుగా ఇంట్లోకి వెళ్లలేక, బయటే ఉంటున్నామని కన్నీటిపర్యంతమయ్యారు. మిగిలిన పొలంతో పాటు ఇళ్లను సైతం తమకు రాసిచ్చేయాలని హుకుం జారీ చేశారని తెలిపారు. మర్రెమ్మ అనే వృద్ధ అంధురాలిపై సైతం కనికరం లేకుండా ఇంట్లోకి రానీయకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు.
పోలీసులు చెప్పినా...
ప్రత్యర్థుల దుర్మార్గంపై తాము ఆత్మకూరు పోలీసుల దృష్టికి తీసుకెళ్లామని కృష్ణ కుటుంబ సభ్యులు తెలిపారు. వారొచ్చి చెప్పినా తమ ప్రత్యర్థులు వినలేదని తెలిపారు. చివరకు తామే ప్రాణాలకు తెగించి రాళ్లను తొలగించామన్నారు.
మంత్రి అండ చూసుకునే...
తమ ప్రత్యర్థులు ఇంతగా బరితెగించడానికి కారణంగా జిల్లాకు చెందిన ఓ మంత్రి అండదండలు చూసుకునేనని కృష్ణ కుటుంబ ఆరోపించింది. పొలం, ఇళ్ల విషయమై సదరు మంత్రి ఇంటి వద్ద పంచాయితీ సైతం జరిగిందని తెలుస్తోంది.
ఇంట్లోకెళ్తే చంపేస్తామంటున్నారు!
Published Sat, Nov 26 2016 11:42 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వ్యక్తిపై అకారణంగా ఎస్ఐ దాడి
వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించండి
వైభవంగా శ్రీనివాసుడి కల్యాణోత్సవం
సీఎం జగన్తోనే బడుగుల అభ్యున్నతి
ముమ్మరంగా పోస్టల్ బ్యాలెట్
No Headline
నా మంచితనాన్ని.. చేతగానితనంగా తీసుకోవద్దు
టీడీపీ ప్రచారంలో యానిమేటర్
బాల్యవివాహాలను నియంత్రించాలి
ఆదివాసీల హక్కుల జోలికొస్తే ఊరుకోం
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement