Sakshi News home page

విద్యుత్‌ వైర్లు తగిలి రైతు మృతి

Published Wed, Jul 6 2016 10:37 AM

Farmer Died On Electric Shock in guntur district

గుంటూరు: పొలానికి వేసిన విద్యుత్‌ ఫెన్సింగ్‌ వైర్లు తగిలి రైతు దుర్మరణం చెందిన సంఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. జిల్లాలోని బొల్లపల్లి మండలం పేరూరిపాడులో జరిగింది. పేరూరిపాడుకు చెందిన నర్సింహారావు రోజువారి పనుల నిమిత్తం పొలానికి వెళ్లాడు. ఫెన్సింగ్‌కు వేసిన విద్యుత్‌ వైర్లు కాలికి తగిలి విద్యుత్‌ షాక్‌తో మృతి చెందాడు. రైతు మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.

 

Advertisement
Advertisement