Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Published Mon, Sep 19 2016 11:29 PM

విద్యుదాఘాతంతో రైతు మృతి - Sakshi

నాంపల్లి: విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని అడవితుమ్మాలపల్లిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రెవళ్లి ధనుంజయ్య(30) రోజు మాదిరిగానే సోమవారం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. సాయంత్రం వ్యవసాయ బావి మోటార్‌ నీరు పోయకపోవడంతో మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. 
 
 

Advertisement

What’s your opinion

Advertisement