రైతు బలవన్మరణం | Sakshi
Sakshi News home page

రైతు బలవన్మరణం

Published Wed, Feb 8 2017 9:45 PM

farmer suicides in chaparlapalli

మడకశిర రూరల్‌ : మండలంలోని చాపార్లపల్లికి చెందిని అంజినరెడ్డి(50) అనే రైతు బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ మగ్బుల్‌బాషా తెలిపారు. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో కడుపునొప్పి తీవ్రం కావడంతో భరించలేక వరి పంటకు తెచ్చిన ముందు గుళికలు మింగి పక్కనే ఉన్న గడ్డివామి వద్దకు వెళ్లి అపస్మారకస్థితిలో పడిపోయాడు.

అక్కడే గుళికల ప్యాకేట్‌ కూడా పడి ఉంది. మృతుడి భార్య గోవిందమ్మ గమనించి వెంటనే 108లో హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మరణించినట్లు నిర్ధరించారు. ఘటనపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌: తెలిపారు. 

Advertisement
Advertisement