–డీసీసీబీ డైరెక్టర్ ముత్తవరపు పాండురంగారావు
నల్లగొండ టౌన్ : రైతుల సంక్షేమమే ధ్యేయమని, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా ప్రస్తుత ఖరీఫ్లో కొత్త రైతులకు రూ.20కోట్ల స్వల్ప కాలిక రుణాలు ఇవ్వనున్నట్లు డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు తెలిపారు. బుధవారం స్థానిక డీసీసీబీలో జరిగిన బ్యాంక్ మహాజన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యోగులకు పే రివిజన్ చెల్లించాలని నిర్ణయించామని, అన్ని రుణాలపై రుణ పథకానికి అనుగుణంగా వ్యక్తిగత లోన్ పరిమితి పెంచనున్నామన్నారు. ఇప్పటి వరకు దీర్ఘకాలిక రుణాలకు వాటా దారుడిగా వున్న రూ.10వేలను రూ.15వేలకు పెంచనున్నట్లు చెప్పారు. బ్యాంకు ద్వారా రైతులకు వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలను ఇస్తున్నట్లు తెలిపారు. రైతుల పిల్లల ఉన్నత విద్యకోసం కూడా రుణాలు మంజూరు చేస్తున్నామన్నారు. సహకార సంఘాల మౌలిక వసతుల కల్పనకు రూ.కోటి 3లక్షల 88 వేలను మంజూరు చేశామన్నారు. రుణమాఫీ ప్రకటించినందున జూన్ 2016 నాటికి స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు 91.55 శాతం వసూలు చేసినట్లు వివరించారు. రైతులకు వ్యక్తిగత బీమా కల్పించడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. సహకార సంఘాల్లోని సభ్యులుగా ఉన్న రైతులు ఎవరైనా చనిపోతే వారి దహన సంస్కారాల కోసం రూ.10వేల చొప్పున అందజేస్తున్నట్లు తెలిపారు. త్వరలో జిల్లా పరిధిలోని అన్ని బ్రాంచీలు, ఎన్నిక చేయబడిన సహకార సంఘాల్లో ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నామన్నారు. అనంతరం ఎజెండాలోని అంశాలను చర్చించి ఆమోదించారు. ఈ కార్యక్రమంలో సీఈఓ కె.మదన్మోహన్, డైరెక్టర్లు ముదిరెడ్డి రమణారెడ్డి, హనుమయ్య, చిన్నపరెడ్డి నరేందర్రెడ్డి, పాశం సంపత్రెడ్డి, కోటేశ్వర్రావు, ఎస్. రవీందర్రెడ్డి, పిల్లలమర్రి శ్రీనివాస్, ముత్యపురావు, ఏర్పుల సుదర్శన్, వీరునాయక్, హర్య, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
రైతుల సంక్షేమమే ధ్యేయం
Published Thu, Sep 29 2016 1:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement