పాణ్యం: తొమ్మిది రోజులుగా కుమారుడు కనిపించక పోవడంతో మనస్తాపానికి గురైన ఓ తండ్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన చెందిన గద్దల పెద్ద సుబ్బరాయుడికి నలుగురు కుమారులు. చిన్న కుమారుడు బాల సుదరం పాణ్యం ప్రభుత్వ జూనియర్ కళాశాలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల పరీక్షలు ప్రారంభం కాగా మొదటి రెండు రాశాడు. అనంతరం కనిపిచండ లేదు. తొమ్మిది రోజులైనా ఇంటికి రాకపోవడంతో మనస్తాపానికి గురై నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబీకులు 108లో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కోలుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.