♦ టెన్త్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వర్తించని మినహాయింపు
♦ అడ్డగోలు నిబంధన.. గత్యంతరం లేక చెల్లిస్తున్న విద్యార్థులు
♦ రూ. 20 వేల వార్షికాదాయం ఎవరికైనా ఉందా?
♦ 4 లక్షల మంది విద్యార్థులకు అంద ని ప్రయోజనం
సాక్షి, హైదరాబాద్: టెన్త్ పరీక్షల ఫీజు మినహాయింపు అందని ద్రాక్షగా మారుతోంది. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రభుత్వాలు ఏటా పేరుకే ఫీజు మినహాయింపును ప్రకటిస్తున్నాయి. అమలు చేయలేని నిబంధన విధిస్తూ విద్యార్థులెవరికీ మినహాయింపు వర్తించకుండా చేస్తున్నాయి. టెన్త్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఫీజు మినహాయింపు వర్తిస్తుందని ఏటా ప్రకటించడం, అడ్డగోలు నిబంధన విధించి అమలుకు నోచుకోకుండా చేయడం రివాజుగా మారింది. దీంతో దాదాపు 4 లక్షల మంది నిరుపేదలకు ప్రయోజనం చేకూరడం లేదు.
రాష్ట్రంలో ఏ పథకాన్నైనా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి ప్రభుత్వం వర్తింపజేస్తోంది. ఇందుకు గ్రామీణ ప్రాంతాల్లో గరిష్టంగా రూ.లక్ష, పట్టణాల్లో రూ.లక్షన్నర వార్షికాదాయం ఉన్న వారు అర్హులని చెబుతోంది. కానీ టెన్త్ పరీక్ష ఫీజు మినహాయింపు పొందాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ. 20 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 24 వేలకు మించకూడదని చెబుతోంది. అనేక సంవత్సరాలుగా ఇదే తంతు కొనసాగుతోంది. ఈసారీ అదే జరిగింది.
2016 మార్చిలో జరిగే పరీక్షలకు హాజరయ్యే వారు ఈనెల 26 నుంచి ఫీజు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటించింది. ఇందులోనూ అదే నిబంధనను విధించి అమలుచేయాలని ఆదేశించింది. దీంతో పరీక్షలకు హాజరుకానున్న 6 లక్షల మంది విద్యార్థుల్లో దాదాపు 4 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఈ మినహాయింపు వర్తించే అవకాశం లేకుండాపోయింది. అయితే రాష్ట్రంలో రూ. 24 వేలలోపు మాత్రమే వార్షికాదాయం కలిగిన కుటుం బాలు ఉన్నాయా? గ్రామాల్లో రోజువారీ కూలీ పని చేసే వారి వార్షికాదాయం కూడా (రోజుకు సగటున రూ. 100 చొప్పున లెక్కిం చినా) అధమంగా రూ. 30 వేల పైనే ఉంటోంది.
అలాంటప్పుడు రూ. 20 వేలు, 24 వేల వార్షికాదాయం నిబంధన విధించడం ఎంత మేరకు సబబు. అశాస్త్రీయమైన ఈ నిబంధనను మార్చకుండా ఎందుకు కొనసాగిస్తున్నారో అంతుచిక్కని ప్రశ్నగానే మిగులుతోంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోనైనా ఈ నిబంధనను మార్చి రూ.లక్షలోపు వార్షికాదాయం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు పరీక్ష ఫీజు మినహాయించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
పేరుకే పరీక్ష ఫీజు మినహాయింపు
Published Tue, Oct 20 2015 3:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement