వైఎస్ఆర్సీపీ మద్దతుతో జోరందుకున్న పీడీఎఫ్
దూసుకెళుతున్న యండపల్లి, విఠపు
టీడీపీ అభ్యర్థుల్లో కలవరపాటు
ప్రచారానికి రెండు రోజులే గడువు
రాయలసీమ తూర్పు విభాగం చిత్తూరు, పొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల నియోజకవర్గ పట్టభద్రుల, ఉపాధ్యాయుల శాసనమండలి ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికల్లో పీడీఎఫ్ (ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్)కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలకడంతో మరో మారు బరిలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్సీలు కొత్త ఉత్సాహంతో దూసుకెళుతుంటే.. తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది.
చిత్తూరు (కలెక్టరేట్): ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార పార్టీని కలవరపెడుతున్నాయి. సొంత పార్టీలోనే అసమ్మతి వర్గం ఓవైపు, అధికారంలో ఉన్నా పట్టభద్రులకు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదనే భయం మరోవైపు పీడిస్తోంది. సాధారణ ఎన్నికలకు భిన్నంగా విద్యావంతులు మాత్రమే ఓటువేసే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి 7వ తేదీ సాయంత్రానికి తెరపడనుంది. దీంతో ఇటు సిట్టింగ్ ఎమ్మెల్సీలు, అటు అధికార పార్టీ అభ్యర్థులు గెలుపుకోసం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
ఈనెల 9వ తేదీ జరుగనున్న శాసనమండలి పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎన్నికల బరిలో మొత్తం 23 మంది అభ్యర్థులు ఉన్నా రు. అందులో పట్టభద్రుల స్థానానికి 14 మంది, ఉపాధ్యాయుల స్థానానికి 9మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. అయితే బరిలో అధిక సంఖ్య లో అభ్యర్థులు ఉన్నా ప్రధానంగా పీడీఎఫ్కు చెందిన సిట్టింగ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు రెడ్డి, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం, అధికార పార్టీకి చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వేమిరెడ్డి పట్టాభిరామి రెడ్డి, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థి వాసుదేవనాయుడుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.
వైఎస్సార్సీపీ మద్దతుతో..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో ఉన్న పీడీఎఫ్కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్సీలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు పలికింది. ఇప్పటికే ఉపాధ్యాయుల ఎమ్మెల్సీగా రెండు దఫాలు వరుసగా కొనసాగుతున్న విఠపు బాలసుబ్రమణ్యం మూడోసారి ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీగా కొనసాగుతున్న యండపల్లి శ్రీనివాసులు రెండో దఫా మరోమారు ఈ ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. దీంతో ఈ ఇద్దరు ఎమ్మెల్సీలు ఇటు ఉపాధ్యాయులకు, అటు పట్టభద్రులకు సుపరిచితులే. వారిరువురికీ సమస్యలపట్ల పోరాట యోధులుగా, సౌమ్యులుగా మంచి పేరుంది. నియోజకవర్గ పరిధిలోని మూడు జిల్లాల్లోనూ వీరిద్దరికి క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే అనుచర గణంతోపాటు, మంచి పరిచయాలూ ఉన్నాయి. కాబట్టే వీరు వరుస విజయాలతో ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. ఎన్నికలకు రెండు నెలలకు ముందు నుంచే పీడీఎఫ్ తిరిగి వీరిని అభ్యర్థులుగా ప్రకటించడంతో అప్పటి నుంచే ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. దీనికితోడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా పీడీఎఫ్కు మద్దతు పలకడంతో సిట్టింగ్ ఎమ్మెల్సీలకు కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెట్టింది.
టీడీపీలో కలవరపాటు
గడచిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అపజయాలను చవిచూసిన అధికార టీడీపీ పార్టీ మరో మారు ఈ ఎన్నికల్లో కూడా అభ్యర్థులను బరిలోకి దింపి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మంత్రి నారాయణ అనుచరుడు పట్టాభిరామిరెడ్డిని పట్టభద్రుల స్థానానికి బరిలోకి దింపారు. పార్టీ పరంగా క్షేత్రస్థాయిలో అనుచరగణం ఉన్నా, పట్టభద్రులకు నిరుద్యోగ భృతి అందించడం, ఉద్యోగాల కల్పన లాంటి హామీలను ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిని నెరవేర్చడంలో విఫలమయ్యారు. దీంతో అధికార పార్టీ వర్గాల్లో ఓటమి భయం వెంటాడుతోంది. ఉపాధ్యాయుల స్థానానికి చిత్తూరు జిల్లాకు చెందిన వాసుదేవనాయుడును బరిలోకి దింపింది. అయితే ఆది నుంచి ఈ స్థానానికి టికెట్ ఆశించిన తిరుపతికి చెందిన ప్రముఖ విద్యాసంస్థల చైర్మన్ చదలవాడ సుచరితకు ఆఖరుకు ఆశ ఫలించక స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంతవరకు మహిళకు చోటు కల్పించిన దాఖలాలు లేకపోగా, మొదటగా మహిళా అభ్యర్థి అధికార పార్టీకి అసమ్మతి వర్గంగా బరిలో ఉండడం కలవరపెడుతోంది. అదేగాక ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో అధికార పార్టీ విఫలమవడం కూడా ఒక కారణంగా నిలిచింది.
అయితే పీడీఎఫ్కు చెందిన ఉపాధ్యాయుల స్థానం అభ్యర్థి విఠపు బాలసుబ్రమణ్యంకు గత ఎన్నికల్లో అతిపెద్ద ఉపాధ్యాయ సంఘమయిన యూటీఎఫ్ మద్దతుతోనే రెండు దఫాలు గెలుపొందారు. అయితే ఈ ఎన్నికల్లో యూటీఎఫ్కు మరో ఉపాధ్యాయ సంఘం ఎస్టీయూ కూడా మద్దతు పలికి తోడవడం, దీనికితోడు వైఎస్సార్సీపీ మద్దతు పలకడంతో విఠపు బాలసుబ్రమణ్యం విజయానికి మరింత బలాన్ని ఇచ్చింది. పట్టభద్రుల స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన రామచంద్రారెడ్డి కూడా జాతీయ స్థాయి పెద్ద పార్టీ పేరుతో ఒకింత శాయశక్తులా కృషి చేస్తున్నారు. అదేస్థాయిలో పట్టభద్రుల, ఉపాధ్యాయుల స్థానానికి పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేస్తున్నారు.
మండలి పోరు రసవత్తరం
Published Mon, Mar 6 2017 10:19 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement