మామిడి తోటకు నిప్పు | Sakshi
Sakshi News home page

మామిడి తోటకు నిప్పు

Published Fri, Mar 24 2017 11:13 PM

మామిడి తోటకు నిప్పు - Sakshi

శింగనమల : శింగనమల సమీపంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌ వద్దనున్న బెస్త సుంకన్నకు చెందిన మామిడి తోటకు శుక్రవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఘటనలో 150 మామాడి మొక్కలు కాలిబూడిదయ్యాయి. ఐదేళ్ల కిందట 250 మామిడి మొక్కలు పెంచగా, ప్రసుత్తం అవి కాపు దశకు వచ్చాయని బాధితుడు తెలిపారు. ఈ నేపథ్యంలో దుండగులు నిప్పు పెట్టడంతో మొక్కలన్నీ కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం తెలిసిన వెంటనే ఆర్‌ఐ శివారెడ్డి, వీఆర్‌ఓ వెంకట్రామిరెడ్డి తోట వద్దకు వెళ్లి కాలిపోయిన చెట్లను పరిశీలించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు.

Advertisement
Advertisement