బేతంచెర్ల(డోన్): స్థానిక పాత తహసీల్దార్ కార్యాలయం వద్ద ఓ గృహంలో గ్యాస్ లీకై మంటలు చెలరేగి ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం ఉదయం.. మారం వేంకటేశ్వర్లు ఇంటి నుంచి బయటకు వెళ్లి పాల ప్యాకెట్ తీసుకొని వచ్చాడు. అప్పటికే గ్యాస్లీకై ఉంది. అతడు గమనించకుండా గ్యాస్ స్టౌ వెలిగించడంతో మంటలు చెలరేగి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు బాధితున్ని 108 ద్వారా బేతంచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కర్నూలుకు తీసుకెళ్లారు.