Sakshi News home page

అల్లాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం:ఐదుగురి మృతి

Published Wed, Jul 29 2015 12:03 AM

five killed in road accident

తాండూరు(రంగారెడ్డి జిల్లా): రెండు లారీలు ఎదురెదురుగా వెళ్లి ఢీ కొనడంతో లారీలో పల్లీకొట్టి పెను ప్రమాదం సంభవించిన ఘటన జిల్లాలోని అల్లాపూర్ వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా,  మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని కోటబాసుపల్లి గ్రామానికి చెందిన తొమ్మిది మంది నాపరాతి కూలీలుగా పని చేస్తున్నారు.

 

కాగా, మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం సమీపంలో నాపరాతి లోడ్‌నుదించి తిరిగి ఖాళీ లారీలో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో లారీ ఢీ కొట్టింది. దీంతో లారీలో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అదే సమయంలో ఓ ద్విచక్రవాహనం లారీని ఢీకొని మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement