ఒకరికొకరం | Sakshi
Sakshi News home page

ఒకరికొకరం

Published Sun, Aug 28 2016 11:42 PM

ఒకరికొకరం

హిందూపురంలోని కంసల పేటలో ఉన్న వివేకానంద మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు విద్యార్థులకు ఐదుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ ఏడాది 1వ తరగతిలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. 2వ తరగతిలో ఒకరు, 3లో ఇద్దరు, 4లో ఒకరు, 5లో ఒకరు ఉన్నారు.

గత విద్యాసంవత్సరంలో ఈ పాఠశాలలో 21 మంది విద్యార్థులు ఉండేవారు. వీరికి ఇద్దరు మాత్రమే ఉపాధ్యాయులు అప్పట్లో పాఠ్యాంశాలు బోధించారు. ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య తగ్గింది... ఉపాధ్యాయుల సంఖ్య పెరిగింది. మున్సిపల్‌ పరిధిలోని ఇతర పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్నప్పటికీ అటుగా అధికారులు దృష్టి సారించకపోవడం గమనార్హం.

Advertisement
Advertisement