బావిలోపడిన అడవి పందులు | Sakshi
Sakshi News home page

బావిలోపడిన అడవి పందులు

Published Sat, Jul 25 2015 1:29 PM

బావిలోపడిన అడవి పందులు - Sakshi

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట మండలం బలరావ్పేటలో ప్రమాదవశాత్తు అడవి పందులు బావిలోపడ్డాయి. ఆ విషయాన్ని శనివారం తెల్లవారుజామున స్థానికులు గుర్తించారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అడవి పందులకు బయటకు తీసేందుకు స్థానికుల సహాయంతో అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. మొత్తం 13 అడవి పందులు బావిలో పడ్డాయని తెలిపారు.
 

Advertisement
Advertisement