చిత్తూరు : చిత్తూరు జిల్లా కుప్పం మండలం నడుమూరు వద్ద కారును లారీ ఆదివారం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కారును ఢీకొన్న లారీ: నలుగురికి గాయాలు
Published Tue, May 17 2016 2:43 PM
Related news
-
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టినరోజు వేడుక
అనుబంధం తెగిపోయి.. ఆనందం ఆవిరి.. ఆ ఘోర ప్రమాదం.. ఆశలను చిదిమేసింది.. అనుబంధాలను చెరిపేసింది.. జీవితాలను చిన్నాభిన్నం చేసింది.. ఆ కుటుంబాలకు ఆసరా లేకుండా మార్చింది.. చేయి పట్టుకుని నడిచే పిల్లలకు తండ్రి లేకుండా చేసింది.. కట్టుకున్నవాడిని భార్యకు దూరం చేసింది.. తోడుగా ఉంటాడనుకున్న కుటుంబానికి కుమారుడిని లేకుండా చేసింది. అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లిలో ఆదివారం అర్ధరాత్రి ఆటోను లారీ ఢీకొన్న సంఘటనలో మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు మిగిలిన వేదన ఇది.అమలాపురం రూరల్/ మామిడికుదురు: వారంతా స్నేహితులు... హ్యాపీ హ్యాపీగా సహచరుడి ముందస్తు పుట్టినరోజు వేడుకకు బయలు దేరారు.. జోకులు వేసుకుంటూ సరదాగా గడిపారు.. కేక్ కట్ చేసుకుని సందడి చేశారు.. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో దారి కాచిన మృత్యువు లారీ రూపంలో వారి ఆనందాన్ని ఆవిరి చేసింది.. అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లిలోని వనువులమ్మ ఆలయం వద్ద 216 జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు స్నేహితులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. మామిడికుదురు మండలం నగరం శివారు కోటమెరక గ్రామానికి చెందిన కొల్లాబత్తుల జతిన్ (26) పుట్టినరోజు సోమవారం కావడంతో ముందస్తు వేడుకలు జరుపుకొనేందుకు స్నేహితులు నిర్ణయించుకున్నారు. మొత్తం ఎనిమిది మంది పుదుచ్చేరి ప్రాంతం యానాంకు నెల్లి నవీన్కుమార్ ఆటోలో ఆదివారం రాత్రి 8 గంటలకు బయలు దేరారు. యానాంలో విందు ముగిశాక అర్ధరాత్రి సమయంలో తిరుగు పయనమయ్యారు. భట్నవిల్లి వచ్చేసరికి కాకినాడ వైపు ఒడిశాకు చేపల లోడుతో వెళుతున్న లారీ వారి ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో మామిడికుదురు మండలం నగరం శివారు కోటమెరక గ్రామానికి చెందిన సాపే నవీన్ (22), అదే గ్రామానికి చెందిన కొల్లాబత్తుల జతిన్ (26), అదే మండలం పాశర్లపూడికి చెందిన నెల్లి నవీన్కుమార్ (27), పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన వల్లూరి అజయ్ (18) అక్కడికక్కడే చనిపోయారు. మామిడికుదురు మండలం పాశర్లపూడి శివారు కొండాలమ్మ చింతకు చెందిన మల్లవరపు వినయ్బాబు (17), అదే గ్రామానికి చెందిన మార్లపూడి లోకేష్ (17), పెదపటా్ననికి చెందిన జాలెం శ్రీనివాసరెడ్డి (17), నగరం శివారు పితానివారి మెరక గ్రామానికి చెందిన మాదాసి ప్రశాంత్కుమార్ (17)లు తీవ్రంగా గాయపడి అమలాపురం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో జాలెం శ్రీనివాసరెడ్డి, మాదిసి ప్రశాంత్కుమార్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. తరుక్కుపోయిన గుండెలుచేతికందివచ్చిన తమ పిల్లలు మృత్యవాత పడి విగత జీవులుగా పడి ఉండడం చూసి మృతుల తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా విలపించారు. తన కుటుంబానికి దిక్కెవరంటూ జతిన్ భార్య ఆశాదేవి బంధువులను దీనంగా అడుగుతుంటే చూపురుల గుండెలు తరుక్కుపోయాయి. కువైట్లో ఉంటున్న తల్లులకు పిల్లల మృత్యు వార్త ఎలా చెప్పాలంటూ నవీన్, అజయ్ కుటుంబీకులు ఆందోళన చెందారు. ప్రమాద వార్త తెలియగానే మృతుల, క్షతగాత్రుల కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ కుటుంబాలన్నీ రొక్కాడితే డొక్కాడని పరిస్థితి. ఆటో నడుపుకొంటూ, ఎల్రక్టీíÙయన్గా పనిచేస్తూ నవీన్కుమార్, జతిన్ తమ కుటుంబాలను పోషిస్తున్నారు. మిగిలిన వారంతా డిగ్రీ, ఇంటరీ్మడియెట్ చదువుకుంటూ భవిష్యత్ కోసం బాటలు వేసుకుంటున్నారు. అమలాపురం రూరల్ సీఐ పి.వీరబాబు, రూరల్ ఎస్సై శేఖర్బాబు ప్రమాద స్థలిని తక్షణమే సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను తక్షణమే ఆస్పత్రికి తరలించి వేగంగా వైద్యం అందేలా సీఐ, ఎస్సైలు శ్రమించారు.పుట్టిన రోజునే పరలోకానికి.. నగరం గ్రామానికి చెందిన కొల్లాబత్తుల జతిన్ (26) ఎలక్ట్రీయన్గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. సోమవారం అతని పుట్టిన రోజు. పుట్టిన రోజు వేడుకకు అంతా సిద్ధం చేసుకున్నాడు. కొత్త దుస్తులు కొనుక్కున్నాడు. సరదాగా స్నేహితులకు పార్టీ ఇచ్చేందుకు ఆదివారం రాత్రి అంతా కలసి బయటకు వెళ్లారు. ఇంతలోనే ప్రమాదం ముంచుకొచ్చి తనువు చాలించాడు. జతిన్కు ఆరేళ్ల కిందట వివాహమైంది. అతనికి భార్య ఆశాదేవి, ఐదేళ్ల కుమార్తె ఆత్య, ఏడు నెలల కొడుకు ఉన్నారు. జతిన్ మృతితో భార్య ఆశాదేవి, తండ్రి వెంకటేష్, తల్లి దివ్య కన్నీరు మున్నీరవుతున్నారు. అభం, శుభం తెలియని పిల్లలకు నాన్న ఎక్కడంటే ఏం చెప్పాలంటూ వారు విలపిస్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో.. నగరం కోటమెరకకు చెందిన సాపే నవీన్ (22) డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నా డు. తండ్రి శ్రీనివాసు రోజు కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తల్లి రత్న కుమారి కువైట్లో ఉంది. ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడంతో అతని కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచేసింది. నవీన్ అమ్మమ్మ బత్తుల మేరీరత్నం తన మనవడి వద్దే ఉంటూ అతడిని అల్లారు ముద్దుగా చూసుకుంటోంది. చదువుకుని ఎంతో ప్రయోజకుడవుతాడని ఆశించిన నవీన్ దుర్మరణం చెందడాన్ని కుటుంబ సభ్యులు జీరి్ణంచుకోలేకపోతున్నారు. కిరాయికి వెళ్లి.. మృత్యుఒడికి చేరి పాశర్లపూడి నెల్లివారిపేటకు చెందిన నెల్లి నవీన్కుమార్ (27) అవివాహితుడు. ఐదు నెలల కిందట కొత్త ఆటో కొనుక్కున్నాడు. తండ్రి ట్రక్కు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. నవీన్కుమార్ తల్లి మంగాదేవి పదేళ్ల నుంచి మస్కట్లో ఉంటున్నారు. తండ్రి, కొడుకు ఆటో నడుపుతూ వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. స్నేహితుడి పుట్టినరోజు, ఆటో కిరాయికి వెళ్లిన నవీన్కుమార్ రోడ్డు ప్రమాదంలో మ్యత్యువాత పడడం స్థానికులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.సరదాగా వెళ్లి.. పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన వల్లూరి అజయ్ (18) ఇంటర్ పూర్తి చేశాడు. తండ్రి శ్రీనివాసరావు నిరుపేద కుటుంబానికి చెందిన వాడు. అతను గల్ఫ్లో ఉంటున్నాడు. తల్లి కుమారి ఇటీవల గల్ఫ్ నుంచి వచ్చారు. కొడుకును ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అందివచ్చిన కొడుకు స్నేహితుడి బర్త్డే పార్టీకి వెళ్లి ఇలా విగతజీవిగా మారతాడని కలలో కూడా ఊహించలేదని ఆమె విలపిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. -
సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
కొవ్వూరు: వేగంగా వెళ్తున్న లారీ సడన్గా బ్రేక్ వేసి రోడ్డు పక్కకు వెళ్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన ఐషర్ వ్యాన్ బలంగా ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. కాపవరం సమీపంలో నేషనల్ హైవేపై ఫ్లైఓవర్ దిగువన శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించింది. కొవ్వూరు రూరల్ ఎస్సై కె.సుధాకర్, పట్టణ సీఐ వి.జగదీశ్వరరావు కథనం ప్రకారం.. ఏలూరు నగరానికి చెందిన మేడం వినోద్ (32) సభలకు సౌండ్ సిస్టం ఏర్పాటు చేసే పనిచేస్తుంటాడు.వినోద్కు భార్య, కుమారుడు ఉన్నారు. తన వృత్తిలో భాగంగా గుంటూరులో సభకు సౌండ్ సిస్టం అమర్చిన వినోద్ తిరిగి విశాఖపట్నం సమీపంలోని చోడవరంలో కార్యక్రమానికి సౌండ్ సిస్టంను తీసుకెళ్తున్నారు. ఈ సౌండ్ బాక్స్లను తీసుకుని ఏలూరుకు చెందిన మరో ఏడుగురితో చోడవరానికి ఐషర్ వ్యాన్లో బయలు దేరారు. ఈ నేపథ్యంలో కొవ్వూరు మండలం కాపవరం సమీపానికి వచ్చేసరికి హైవేపై ఫ్లైఓవర్ దిగువన జగ్గయ్యపేట నుంచి ఒడిశా రాష్ట్రానికి సిమెంట్ లోడుతో వెళుతున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో పాటు, ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా రోడ్డు మార్జిన్లోకి వెళ్లింది.అప్పటికే వెనుక ఉన్న ఐషస్ వ్యాన్ అదుపు తప్పి వెనుక నుంచి లారీని ఢీకొంది. ఈ ఘటనతో మేడం వినోద్, అతని సహచరుడు దారబోయన ప్రభాకర్ (21) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వ్యాన్లో ఉన్న ఏలూరు పట్టణానికి చెందిన మరో ఆరుగురు గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడు ప్రభాకర్కు ఇంకా వివాహం కాలేదు. అదే కారణం.. ఈ ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని చెబుతున్నారు. సడన్గా బ్రేక్ వేయడం, ఎటువంటి సిగ్నల్ ఇవ్వకపోవడం, రోడ్డు మార్జిన్లోకి లారీని ఒక్కసారిగా తిప్పేయడంతో వెనుక వస్తున్న వ్యాన్ అదుపుతప్పి ప్రమాదం జరిగిందని అంటున్నారు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో హైవేపై ట్రాఫిక్ స్తంభించింది. కొవ్వూరు రూరల్ ఎస్సై కె.సుధాకర్, పట్టణ సీఐ వి.జగదీశ్వరరావులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కొవ్వూరు ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తీయించి ట్రాఫిక్ను క్రమబదీ్ధకరించారు. -
Hyderabad: రోడ్డు ప్రమాదంలో నర్సు మృతి
మూసాపేట: ఆసుపత్రికి స్కూటీపై వెళుతున్న స్టాఫ్ నర్స్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ సంఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. జగద్గిరిగుట్టకు చెందిన ప్రశాంతి (37) భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేపీహెచ్బీ కాలనీలోని రవి హాస్పిటల్స్లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. శనివారం జగద్గిరిగుట్టలోని ఇంటి నుంచి ఆసుపత్రికి సౌత్ ఇండియా షాపింగ్మాల్ నుండి వెళుతోంది. నెక్సాస్ షోరూమ్ వద్ద మలుపు వద్ద కూకట్పల్లి వైపు వేగంగా వెళుతున్న వెనుకనుంచి వచి్చన డీసీఎం వ్యాన్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
విశాఖపట్నం : వారు ప్రయాణిస్తున్న కారు యమదూతలా మారింది.. టైరు రూపంలో యమపాశం విసిరింది.. జాతీయ రహదారిపై వెదుళ్లపాలెం వద్ద జరిగిన ఘోర ప్రమాదం రెప్పపాటులో ముగ్గురి ప్రాణాలు హరించింది. రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. వివరాలివి. జీవీఎంసీ 91వ వార్డు గవరవీధి, ఎన్ఏడీ జంక్షన్, కూర్మనపాలెం ప్రాంతాలకు చెందిన నలుగురు కారులో శనివారం ఉదయం కాకినాడ బయలు దేరారు. శరగడం వెంకటలక్ష్మి (37) తన కొడుకు వికాస్, మేనమామ కొడుకు దాడి గగన్ (15)లతో కలిసి వ్యక్తిగత పనిమీద కారులో ప్రయాణమయ్యారు. వీరితో పాటు వికాస్ స్నేహితుడైన సుంకర మధుకర్(27) బయలుదేరాడు.పాయకరావుపేటలో వెంకటలక్ష్మి తల్లిని చూసి అక్కడ నుంచి కాకినాడ వెళ్లాలనుకున్నారు. కారు వెదుళ్లపాలెం జంక్షన్ వద్దకు చేరుకునే సరికి హఠాత్తుగా టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి అవతల రూట్లోకి దూసుకుపోయింది. తుని నుంచి విశాఖ వైపు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జు నుజ్జయింది. ఈ ఘటనలో కారులో ఉన్న వెంకటలక్ష్మి, దాడి గగన్, సుంకర మధుకర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాద తీవ్రతకు కారు టాప్ పైకి లేచిపోయింది. డోర్లు ఊడిపోయాయి. ప్రమాదంలో వికాస్ ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెండు నెలల్లో జర్మనీ వెళ్లాల్సి ఉండగా.... వికాస్ స్నేహితుడైన మధుకర్ విశాఖ స్టీల్ప్టాంట్లో మెకానికల్ విభాగంలో అప్రెంటీస్ చేస్తున్నట్టు తెలిసింది. తుని ప్రాంతానికి చెందిన అతడు ఎన్ఏడీ జంక్షన్లో ఉంటున్నాడు. అతడు రెండు నెలల్లో ఉన్నత చదువు, ఉద్యోగం కోసం జర్మనీ వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలోనే మృత్యువు రోడ్డు ప్రమాద రూపంలో కబళించి అనంత లోకాలకు తీసుకెళ్లిపోయింది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు హుటాహుటిన నక్కపల్లి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు దుర్మరణం పాలవడంతో విషయం తెలుసుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు సంఘటన స్దలానికి చేరుకుని రోదించారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను స్థానికుల సాయంతో పోలీసులు బయటకు తీసి పోస్టుమార్టం కోసం నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ విజయ్కుమార్ తెలిపారు.గవరవీధిలో విషాదఛాయలు గోపాలపట్నం: వెదుళ్లపాలెం జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదంలో శరగడం వెంకటలక్ష్మి మృతి చెందగా ఆమె కుమారుడు వికాస్ గాయాలపాలవడంతో గవరవీధిలో విషాదఛాయలు అలుముకున్నాయి. గవరవీధిలో ఉంటున్న శరగడం నర్సింగరావు సప్లయర్ దుకాణం నిర్వహిస్తున్నాడు. రోడ్డు ప్రమాదంలో అతడి భార్య వెంకటలక్ష్మి మృతి చెందగా కుమారుడు వికాస్ గాయాలపాలయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు, స్థానికులు పెద్ద ఎత్తున ఇంటికి తరలివచ్చి కన్నీరుమున్నీరయ్యారు. వెంకటలక్ష్మి ఎప్పుడు నవ్వుతూ నవి్వస్తూ అందరితో కలివిడిగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో మృతి చెందిన దాడి గగన్ది కూర్మన్నపాలెం కాగా.. శనివారం ఉదయం టోల్గేట్ వద్ద కారు ఎక్కాడు. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని దుర్మరణం
హైదరాబాద్: అమ్మా.. నేను సెలవులకు పిన్ని వాళ్ల ఇంటికి వెళ్తున్నా.. రేపు స్కూల్లో ప్రోగ్రెస్ కార్డు ఇస్తారు.. నువ్వు, నాన్న వెళ్లి తీసుకోండి.. అని చెప్పి సోదరుడితో కలిసి బైక్పై బయలుదేరిన కొద్దిసేపటికే ఓ బాలికను బస్సు రూపంలో మృత్యువు కాటేసింది. ఈ హృదయవిదారక ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఖమ్మం జిల్లా, భోనకల్లు మండలం, నారాయణపురం గ్రామానికి చెందిన గురవయ్య, తిరుపతమ్మ దంపతులు రహమత్నగర్లో ఉంటున్నారు. గురవయ్య జూబ్లీహిల్స్ చట్నీస్ చౌరస్తాలో కొబ్బరి బొండాల వ్యాపారం చేసేవాడు. ఆయన కుమార్తె దుడ్డు శిరీష(15) ఇటీవలే తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. బుధవారం నుంచి సెలవులు ఇవ్వడంతో సోదరుడు గోపితో కలిసి మంగళవారం రాత్రి ఫిలింనగర్లో ఉంటున్న పిన్ని ఇంటికి బయలుదేరింది. యూసుఫ్గూడ మీదుగా వెళుతుండగా రోడ్డుపై ఆగి ఉన్న ఆర్టీసీ బస్సు పక్క నుంచి వెళ్లే క్రమంలో బస్సు వెనుక డోర్ శిరీష ముఖానికి తగలడంతో కిందడపడింది. ఆమె తలకు, ముఖానికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందింది. గోపీ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనతో గురవయ్య కుటుంబంలో విషాదం నెలకొంది. ఆర్టీసీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. రోడ్డుకు ఒక పక్క బైక్ ఆపి ఉందని, మరో పక్క బస్సు ఆగి ఉండగా, ఈ రెండింటి మధ్య నుంచి గోపీ బైక్ వెళ్లడంతో ప్రమాదవశాత్తు బస్సు వెనుక డోర్ తలకు గీసుకుపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లుగా పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా నిర్ధారించారు. ఒక్కగానొక్క కూతురు కన్నుమూయడంతో గురవయ్య, తిరుపతమ్మ దంపతులు ఠాణా ఆవరణలోనే కుప్పకూలిపోయారు. ప్రోగ్రెస్ కార్డు తీసుకోండంటూ చెప్పిన కొద్దిసేపటికే బిడ్డ మరణవార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని తండ్రి బోరున విలపించాడు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Related News by category
-
‘ఆరణి’ అక్రమాలు..!
చిత్తూరు అర్బన్ : ప్రజలకు చిత్తశుద్ధితో సేవ చేయాల్సిన పదవిని ‘ఆరణి’ తన స్వార్థానికి వినియోగించుకున్నారు. వందల ఎకరాల ప్రభుత్వ భూమిని చెరపట్టారు. ఆయన అడుగు జాడల్లోనే వారి అన్న కుమారుడు సైతం భూ దందాలు చేస్తూ రూ.కోట్లకు పడగెత్తాడు. వీరి ఆగడాలను అడ్డుకోవడం ఎవరి తరం కాలేదు. చిత్తూరు ‘శ్రీనివాసుడి’ అక్రమాలు ఓవైపు .. అబ్బాయ్ క్రిమినల్ ఆలోచనలు చూసి ప్రజలు ‘శివ’ శివా..! అనుకుంటున్నారు. వీళ్లకు ప్రభుత్వ భూములా...? ప్రైవేటు భూములా అనే తేడాలేదు. తమకు నచ్చిదంటే కబ్జాచేసి కంచెలు వేసేస్తారు. చిత్తూరు బాబాయ్ ‘ఆరణి’.. అబ్బాయ్ ‘శివ’ అవినీతి పర్వంలో కొన్ని.. ఫోర్జరీ మాయలు..! ● కరోనా సమయంలో చిత్తూరు మార్కెట్గేటు తన బినామీల పేరిట సొంతం చేసుకున్న ‘ఆరణి’.. చిన్నా,చితకా వ్యాపారుల ముక్కుపిండి రూ.కోట్లు వసూలు చేశారు. అయినప్పటికీ కరోనా సమయంలో తాము ఆశించిన నగదు వసూలు కాలేదని, ఈ మొత్తాన్ని మాఫీ చేయాలని అధికారులను అడ్డుపెట్టుకుని కౌన్సిల్లో తీర్మానం చేయించారు. ఫలితంగా కార్పొరేషన్ ఖజానాకు రూ.52 లక్షల నష్టం వాటిల్లింది. ● బూత్బంగ్లాను తలపించే శ్రీఆరణిశ్రీ ఇంట్లో, తన కంపెనీల్లో పనిచేయడానికి కొత్త స్కెచ్ వేశారు. తమ వద్ద పనిచేసే 27 మందిని మున్సిపల్ కార్పొరేషన్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా చేర్పించారు. సొంత పనులకు వీళ్లను వాడుకుని, కార్పొరేషన్ నుంచి నెలకు రూ.18 వేల చొప్పున వేతనాలు ఇచ్చేలా చక్రం తిప్పారు. ఇలా 27 మందికి 58 నెలల పాటు రూ.2.81 కోట్లను వేతనాల రూపంలో కొల్లగొట్టారు. ● ఇక 2017లో బెంగళూరు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఓ టెండర్లో పాల్గొనేందుకు ‘ఆరణి’ కంపెనీకి ఏదైనా కార్పొరేషన్లో రూ.వంద కోట్లకు పనులు చేసినట్లు ద్రువీకరణ పత్రం కావాల్సి వచ్చింది. దీనికోసం చిత్తూరులోని ఇరువారం నుంచి గంగినేనిచెరువు వరకు కాలువ పనులు, చెరువుకట్టపై అభివృద్ధి పనులను చేసినట్లు ఓ సర్టిఫికెట్ను బెంగళూరు మహానగర పాలక (బీబీఎంపీ) అధికారులకు అందజేశారు. రూ.280 కోట్ల విలువైన ఈ పనుల్లో తాము తొలివిడతగా రూ.19.35 కోట్ల పనులు పూర్తి చేసినట్లు, దీనికి చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ బిల్లులు కూడా ఇచ్చేసిందని అందులో పేర్కొన్నారు. చిత్తూరు మున్సిపల్ కమిషనర్, ఇంజినీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ సంతకాలను ఫోర్జరీ చేసి బీబీఎంపీ టెండర్లలో పాల్గొన్నారు. బెంగళూరు అధికారులకు అనుమానం వచ్చి, దీనిపై చిత్తూరు మున్సిపల్ అధికారులకు లేఖ రాశారు. దీన్ని శ్రీఆరణిశ్రీ తొక్కిపెట్టడంతో ఏకంగా బీబీఎంపీ అధికారులు చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయానికి నేరుగా వచ్చి ఇక్కడి అధికారులను సంప్రదించారు. ధ్రువీకరణ పత్రంలోని సంతకాలు తమవి కాదని, అవి ఫోర్జరీ సంతకాలని తేల్చిచెప్పారు. దీంతో ‘ఆరణి’ కంపెనీపై బీబీఎంపీ అనర్హత వేటువేసింది. అయితే ఇది ఎవరి కంటాపడకుండా ‘ఆరణి’ వాస్తవాలను తొక్కపెట్టేశారు. ఇన్నాళ్లకు పాపం పండడంతో నిజం వెలుగుచూసింది. ● చిత్తూరు మండలంలో ‘ఆరణి’ చేసిన ఇసుక దందా అంతా ఇంతాకాదు. తన కంపెనీకు చెందిన భారీ యంత్రాలతో యథేచ్ఛగా ఇసుకను తవ్వేసి ఇతర ప్రాంతాలకు తరలించి అమ్మేశారు. ఇలా మూడేళ్ల పాటు సుమారు రూ.3.24 కోట్ల విలువైన ఇసుక అక్రమాలకు పాల్పడ్డారు. భూ బకాసురుడు..! చిత్తూరులో ఆరణి చేసిన భూ దందాలనే ఆదర్శంగా తీసుకున్న శివ అక్రమాలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. చిత్తూరు భూ బకాసురుడిగా పేరుతెచ్చుకున్న తన బాబాయ్ ‘ఆరణి’ చేసిన అక్రమాల్లో శివ తనవంతు పాత్రను పోషించాడు. గుడిపాల మండలంలోని పానాటూరు వద్ద 22 ఎకరాల ప్రభుత్వ భూమిని తన బంధువుల పేరిట పట్టా ఇప్పించుకున్నాడు. దీనికి ప్రస్తుతం గేటు ఏర్పాటుచేసి పంటలు పండిస్తున్నారు. చిత్తూరు–బెంగళూరు బైపాస్ రోడ్డులో సీతమ్స్ కళాశాల సమీపంలో 74–తిమ్మసముద్రం రెవెన్యూ భూముల వద్ద ఓ అనామకుడి నుంచి రూ.కోటి విలువ చేసే భూములను బలవంతంగా లాక్కున్నారు. అసలు పట్టాదారులపై దౌర్జన్యం చేసి మరీ 2,800 అడుగుల భూమిని కబ్జా చేశారు. భూమికి సొంతవాళ్లు ఏర్పాటు చేసుకున్న ఫెన్సింగ్ను తొలగించి కొత్తగా కూసాలను నాటించేశారు. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని తన అడ్డాగా మార్చుకున్న ‘ఆరణి’ అన్నకొడుకు.. ఉద్యోగుల సంఘ గౌరవాధ్యక్షుడిగా తనుకు తానే ఓ పదవిని సృష్టించుకున్నాడు. పట్టణ ప్రణాళిక విభాగం నుంచి రూ.5 లక్షలు, రెవెన్యూ విభాగం నుంచి రూ.2 లక్షలు, ప్రజారోగ్య విభాగం నుంచి రూ.50 వేలు చొప్పున ప్రతీ నెలా మున్సిపల్ అధికారుల నుంచి మామూళ్లను ముక్కుపిండి మరీ వసూలు చేశాడు. ఇన్ని అక్రమాలుచేసిన ‘ఆరణి’ తన అన్నకొడుకుతో కలిసి తిరుపతికి మకాం మార్చారు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీచేస్తున్న ‘ఆరణి’ గురించి నిజాలు తెలిసిన తిరుపతి వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇంతటి ఘనుడిని అందలం ఎక్కిస్తే తిరుమల శ్రీనివాసుడికే నామాలు పెట్టడం ఖాయమని భయపడుతున్నట్లు సమాచారం. అవినీతిలో బాబాయ్.. అబ్బాయ్ పోటాపోటీ ఇసుక దందాలో రూ.3 కోట్లకు పైగా స్వాహా తమ సిబ్బందికి సైతం ప్రభుత్వ ఖజానా నుంచి రూ.2.81 కోట్ల వేతనాలు కోవిడ్ కాలంలో మార్కెట్ గేటుకు రూ.52లక్షల ఎగవేత పోర్టరజీ సంతకాలతో టెండర్ల భాగోతం చిత్తూరును సాంతం దిగమింగి.. తిరుపతికి పాకిన అనకొండలు ప్రజాధనానికి జవాబుదారీగా వ్యవహరించాల్సిన ఎమ్మెల్యే అయినప్పటికీ ఎక్కడ అవకాశముంటే అక్కడ అవినీతికి తెరతీసేస్తారు.. కంచే చేను మేసినట్టు ఖాళీ భూమి కనిపిస్తే కబ్జా చేసేస్తారు.. అధికారుల సంతకాలను పోర్జరీ చేసి ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టేస్తారు.. బాబాయ్ పదవిని అడ్డుపెట్టుకుని అబ్బాయ్ అక్రమాలకు పాల్పడతారు.. అన్న కుమారుడి క్రిమినల్ ఆలోచనలను సదరు ప్రజాప్రతినిధి తూచా తప్పకుండా అమలు చేసేస్తారు.. జేబులోని రూపాయి తీయరు.. యథేచ్ఛగా ఊరి మీద పడి దోచుకున్నారు.. ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేశారు.. చివరకు చిత్తూరును సాంతం దిగమింగేశారు.. తమ అక్రమా ర్జనను కొనసాగించేందుకు కొత్తగా తిరుపతిని ఎంచుకున్నారు. దీంతో తిరునగరి వాసులు అప్రమత్తంగా ఉండాలని బాధితులు హెచ్చరిస్తున్నారు. -
సంక్షేమ పాలనను ఆశీర్వదించండి
పెద్దపంజాణి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పాలనను ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని ఎంపీ అభ్యర్థి రెడ్డెప్ప కోరారు. సోమవారం మండలంలోని మాదనపల్లెలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రెడ్డెప్ప మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించిన జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వేకువనే సామాజిక పింఛన్లు అందాలన్నా.. పేద బిడ్డలకు ఉన్నత చదువులు అందుబాటులోకి రావాలన్నా.. పేదలకు ఖరీదైన వైద్యం అందాలన్నా రెండు ఓట్లను ఫ్యాను గుర్తుపై వేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేగా వెంకటేగౌడను, ఎంపీగా తను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డెప్ప, పార్టీ మండల కన్వీనర్ బాగా రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు సుష్మకీర్తి, వైస్ ఎంపీపీలు జీడీ బాబు, ఆంజమ్మ తదితరులు పాల్గొన్నారు. -
Kuppam: బాబుకు ఓటమి భయం!
కుప్పం కోటపై చంద్రబాబుకు నమ్మకం సడలుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి భయం వెంటాడుతోంది. ఇన్నేళ్లుగా మోసిన జనం ఇప్పుడు ముఖం చాటేస్తుండడంపై ఆందోళన పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే టీడీపీ అధినేతకు తెలుగు తమ్ముళ్ల సమర్థతపై అనుమానం మొదలైంది. అందుకే ఇతర ప్రాంతాల నుంచి సొంత మనుషులను కుప్పానికి తరలిస్తున్నారు. ఎలక్షన్ మేనేజర్ల పేరిట నేతల ఇళ్లలో తిష్ట వేయిస్తున్నారు. ప్రచారం నుంచి తాయిలాల పంపిణీ వరకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేలా చర్యలు చేపడుతున్నారు. బాబు వ్యవహారిశైలికపై స్థానిక నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన తమను విశ్వసించకుండా బయటి వారిని తెచ్చిపెట్టడంపై లోలోపల రగిలిపోతున్నారు. శాంతిపురం : కుప్పం నియోజకవర్గంలోని టీడీపీ నాయకులను నమ్మకుండా ప్రకాశం జిల్లా నుంచి తన సామాజికి వర్గానికి చెందిన కంచెర్ల శ్రీకాంత్కు చంద్రబాబు పెద్దపీట వేశారు. నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఎన్నికల వేళ సైతం గ్రామ స్థాయిలోని పార్టీ కార్యకర్తలు, నాయకులపై కూడా అపనమ్మకంతో సొంత మనుషులతో నిఘా ఏర్పాట్లు చేస్తున్నారు. వంద మంది మేనేజర్లు కుప్పంలో ఎన్నికల పర్యవేక్షణకు బయటి ప్రాంతాల నుంచి తన సొంత మనుషులు వందమందిని చంద్రబాబు మోహరిస్తున్నట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ప్రతి 3 పోలింగ్ కేంద్రాలకు ఒకరి చొప్పున ఎలక్షన్ మేనేజర్ల పేరుతో ఇక్కడికి తీసుకువస్తున్నారు. బెంగళూరులోని టీడీపీ ఐటీ ఫోరమ్ ద్వారా బెంగళూరు, హైదరాబాదులో గుర్తించిన దాదాపు వంద మందిని తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం కుప్పానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి దాదాపుగా రోజూ బెంగళూరు–కుప్పం మద్య చక్కర్లు కొడుతున్నారు. ఆయా మేనేజర్లు తమ పోలింగ్ కేంద్రాల పరిధిలోని టీడీపీ నాయకుల బంధువులుగా చెప్పుకుని వారి ఇళ్లలోనే బస చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా వచ్చే వారి బసకు ఇబ్బంది లేకుండా వసతులు ఉన్న నాయకుల ఇళ్లను ఇప్పటికే గుర్తించారు. ఈ నెల 26 నుంచి మే 12వ తేదీ రాత్రి వరకూ బయటి వ్యక్తులు స్థానికంగా మకాం వేసి పార్టీ వ్యవహారాలను నడపనున్నారు. ప్రచారం సాగాల్సిన తీరును పర్యవేక్షిస్తూ కింది స్థాయి నాయకులు, కార్యకర్తలను వారు సమన్వయం చేయనున్నారు. తమపై పరిశీలకుల కన్ను ఉంటే పార్టీ క్యాడర్ రాజీ పడకుండా పనిచేస్తారని ఈ ఏర్పాటుకు చంద్రబాబు ఆలోచన చేసినట్లు తెలిసింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు జరిపే పంపకాలు కూడా వీరి ద్వారానే నిర్వహించి, పోలింగ్ ముందు రోజు రాత్రి వారంతా స్వస్థలాలకు వెళ్లి ఓటు వేసేలా వ్యూహరచన చేసుకున్నారు. కానీ ఇంత కాలం పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసిన తమను ఎన్నికల వేళ నమ్మకుండా అవమానిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు కుమిలిపోతున్నారు. అలవి కాని హామీలు ఇచ్చి, వాటిని అమలు చేయకపోగా కాలకేయుల్లాంటి నాయకులను ప్రోత్సహించిన తమ అధినేత, ఇప్పుడు తమను చేతకాని వాళ్లుగా నిలబెడుతున్నారని ఓ సీనియర్ కార్యకర్త వాపోయారు. చివరకు ఎన్నికలకు ముందే చంద్రబాబు ఓటమి భయం రుచిచూస్తున్నారని వెల్లడించారు. తగ్గిన జనాదరణ కుప్పం నుంచి తొలుత 1989 ఎన్నికల్లో చంద్రబాబు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పుడు 52.65 శాతం ఓట్లు సాధించారు. తర్వాత ప్రత్యర్థి పార్టీల నాయకులను ప్రలోభ పెట్టి తన దారికి తెచుకోవడం ద్వారా నియోజకవర్గంపై క్రమంగా పట్టు బిగించారు. 1994లో గరిష్టంగా 75.49 శాతం ఓట్లు సాధించారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రస్థానం ప్రారంభమైన తర్వాత కుప్పంలో కూడా బాబు ప్రభ తగ్గడం మొదలైంది. 2014లో 62.59 శాతం ఓట్లు రాగా, 2019లో 55.18 శాతం ఓట్లు మాత్రమే సాధించారు. అనంతరం వివక్ష లేని సుపరిపాలనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అశేష ప్రజాదరణ సొంతం చేసుకున్నారు. కుప్పం ప్రజల మనసును గెలుచుకున్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం ప్రజలు సైతం వైఎస్సార్సీపీకే జైకొట్టారు. దీంతో అసలు సంగతి చంద్రబాబుకు బోధపడింది. ఇక కల్లబొల్లి కబుర్లును కుప్పం వాసులు నమ్మరని అర్థమైంది. అందుకే తరచూ కుప్పంలో పర్యటనలు ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో సైతం తన సతీమణి నారా భువనేశ్వరి చేతులమీదుగా నామినేషన్ వేయించారు. ఆమె కూడా కుప్పంలోనే మూడు రోజులపాటు తిష్ట వేసి నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. -
పుంగనూరులో నల్లారి ప్లాప్ షో
● కూటమి అభ్యర్థుల సభకు జనం కరువు ● తెలుగుదేశం నేతల కోడ్ ఉల్లంఘన ● బాణసంచా హోరు ● జనాలకు మద్యంగంటల కొద్దీ జనం కోసం.. టీడీపీ అభ్యర్థి చల్లాబాబు బాలాజీ థియేటర్ వద్ద నుంచి పట్టణంలోని ప్రధాన రహదారి ఎంబీటీ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు నానాతంటాలు పడ్డారు. పలువురు శాపనార్థాలు పెట్టడం కనిపించింది. ర్యాలీకి జనం రాకపోవడంతో ముందుగా బాణసంచా భారీ ఎత్తున కాల్చారు. అలాగే డీజే పాటలు, డ్యాన్స్లతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగించారు. ర్యాలీకి వచ్చిన అద్దె జనానికి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద షామియానాలు వేసి భోజనాలు ఏర్పాటు చేశారు. మండుటెండలో తాగునీరు లేక, భోజనం రుచిగా లేకపోవడంతో ప్రజలు తినకుండా అక్కడే పడేసి వెళ్లడం కనిపించింది.పుంగనూరు: కూటమి అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారు. సోమవారం రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి, పుంగనూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లారామచంద్రారెడ్డి పట్టణంలోని గోకుల్ సర్కిల్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. బాణసంచా పెద్ద ఎత్తున కాల్చా రు. డీజేపాటలు పెట్టి డ్యాన్సులు చేశారు. మద్యాన్ని విచ్చలవిడిగా తాగించారు. ఆపై భోజనం రుచిగా లేదంటూ అద్దెజనం అక్కడి నుంచి వెళ్లిపోయారు. కట్టుకథల కిరణ్ కూటమి అభ్యర్థుల సభ జనం లేక వెలవెలబోయింది. తొలుత చల్లా రామచంద్రారెడ్డి ప్రసంగిస్తుండగా జనం వెళ్లి పోతుండడంతో కిరణ్కుమార్రెడ్డి మైకు అందుకుని మాట్లాడారు. మంత్రి పెద్దిరెడ్డిపై ఆయన పలు విమర్శలు చేశారు. పాల దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై పలువురు విస్మయం వ్యక్తం చేశారు. ఇదేంటి కిరణ్ ఇలా మాట్లాడుతున్నారంటూ గుసగుసలాడడం కనిపించింది. రూ.300, క్వార్టర్ అద్దె జనానికి భారీగా నగదు, మద్యం పంపిణీ చేసినట్టు ఆయా పార్టీల కార్యకర్తలే చెబుతున్నారు. ఒక్కొక్కరికి రూ.300, క్వార్టర్ బాటిల్, బిరియానీ అందజేశారు. మద్యం షాపుల వద్ద టీడీపీ జెండాలు చేతబట్టిన కార్యకర్తలు కిక్కిరిసిపోయారు. -
వైఎస్సార్సీపీలోకి వలసల వెల్లువ
జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి పెద్దసంఖ్యలో నేతలు, కార్యకర్తలు చేరారు.వైఎస్సార్సీపీ గెలుపు తథ్యం పెనుమూరు మండలంలో ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మితో కలిసి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం ప్రచారం చేపట్టారు.మంగళవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2024ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలు ఉత్తమ ఫలితాలను అందించాయి.. విద్యావ్యవస్థలో తీసుకువచ్చిన మార్పులు పిల్లల భవిష్యత్కు బంగారు బాటలు వేశాయి.. సర్కారు బడుల్లో కల్పించిన సౌకర్యాలు విద్యార్థులు ప్రశాంతంగా చదువుకునే వెసులుబాటు కల్పించాయి.. ప్రభుత్వ చిత్తశుద్ధిని పదో తరగతి ఫలితాలు రుజువు చేశాయి. సరైన ప్రోత్సాహం అందిస్తే పేద బిడ్డలు సైతం కార్పొరేట్కు ధీటుగా మార్కులు సాధించగలరని చాటి చెప్పారు. జిల్లాను రాష్ట్రంలోనే ఆరో స్థానంలో నిలబెట్టారు. ప్రైవేటు స్కూళ్ల కంటే అత్యుత్తమంగా రాణించి సత్తా చూపించారు.జిల్లాలో పదో తరగతి ఫలితాలు విడుదల చేస్తున్న డీఈఓ దేవరాజుప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించినవారు● బైరెడ్డిపల్లె మండలంలోని ఏపీరెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థి సి.తన్మయి 592 మార్కులు సాధించి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ● సదుం మండలంలోని బీసీ వెల్ఫేర్ పాఠశాలలో చదివిన మణి, రామకుప్పం మండలం విజలాపురం జెడ్పీ హైస్కూల్లో చదివిన అఫ్షాన్ 589 మార్కులు సాధించి రెండో స్థానం దక్కించుకున్నారు. ● చిత్తూరులోని కణ్ణన్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని సంతోషి, కార్వేటినగరంలోని ప్రభుత్వ పాఠశాలకు చెంది న యశ్వంత్, బైరెడ్డిపల్లె మండలం కమ్మనపల్లె మోడ ల్ స్కూల్ విద్యార్థిని మంజుల, గుడుపల్లె మండలం సోదిగానిపల్లె జెడ్పీ పాఠశాల విద్యార్థిని కావ్యశ్రీ, ఐరా ల మండలం ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థిని బిందుసా యి, బైరెడ్డిపల్లి మండలం కడపనత్తం జెడ్పీ హైస్కూల్ విద్యార్థి కిరణ్కుమార్ 587 మార్కులు సాధించారు.మెరుగైన ఫలితాలు ప్రైవేట్, కార్పొరేట్ బడులకు ధీటుగా జిల్లాలో సర్కారు బడుల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఎవ్వరికీ తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారు. ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నారు. ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, డీవైఈఓలు, ఎంఈఓల సమష్టి కృషితోనే ఇది సాధ్యమైంది. – దేవరాజు, డీఈఓ, చిత్తూరు మెరుగైన విద్య మాది నగరి మున్సి పాలిటీ సత్రవాడ, మా ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన మెరుగు పడింది. నేతపై ఆధారపడి జీవించే కుటుంబం మాది. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనే మా కుమార్తె కార్తీకను చదివించాం. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఈ బడిలో వసతులను కల్పించారు. నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. పాఠ్యపుస్తకాలు, బ్యాగు, విద్యా సామగ్రి అంతా ప్రభుత్వమే ఇస్తోంది. పదోతరగతికి ప్రత్యేక తరగతులు తీసుకొని బోధించారు. దీంతో మా కుమార్తె అత్యుత్తమ ప్రతిభను కనబరచింది. 580 మార్కులు సాధించి మండలంలో మొదటి స్థానంలో నిలిచింది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. – జగన్నాథన్, సుమిత సత్తా చాటిన కవలలు మా నాన్న సుధాకర్ బంగారు షాపులో పని చేస్తూంటారు. అమ్మ స్వప్న గృహిణి. మాది మధ్య తరగతి కుటుంబం. మేము కవల పిల్లలం. ఐరాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివాం. బీణసాయికి 565 మార్కులు వచ్చాయి. మా ఇద్దరి కల సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావాలనుంది. 587 మార్కులతో ప్రభుత్వ పాఠశాలల విభాగంలో మండల టాపర్గా నిలిచా. మా స్కూల్ ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు ప్రభుత్వం కల్పించిన వసతులను ఉపయోగించుకుని ఈ మార్కులు సాధించాం. అమ్మ ఒడి పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించడంతో బాగా చదువుకున్నాం. – బిందు సాయి, బీణ సాయి, ఐరాల వందశాతం ఉత్తీర్ణత పదోతరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడం గర్వంగా ఉందని స్థానిక ఏంజేపీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందని, వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ఎప్పటికప్పుడు వారి సామర్థ్యాలు మెరుగు పరి చేలా చర్యలు తీసుకోవడమే ఉత్తమ ఫలితాలకు కారణమైందని వివరించారు. – శ్రీనివాసులురెడ్డి నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణపుంగనూరు : జిల్లాలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్పీ మణికంఠ తెలిపారు. సోమవారం పట్టణంలో నామినేషన్ల కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. ఆర్ఓ కేంద్రాన్ని తనిఖీ చేశారు. టీడీపీ ర్యాలీ సందర్భంగా ట్రాఫిక్ ఇక్కట్లను స్వయంగా తొలగించి, రాకపోకలను క్రమబద్ధీకరించారు. అనంతరం విలేకర్లతో ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పుంగనూరులో ప్రత్యేక దళాల బందోబస్తు నడుమ పోలింగ్ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. అనుమానితులు, రౌడీ షీటర్లు, తీవ్రమైన నేర చరిత్ర గలవారిని బైండోవర్ చేశామన్నారు. ఎన్నికలలో సామాన్యులు ధైర్యంగా ఓటు వేసేలా అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. సమావేశంలో ఏఆర్ఓ నరసింహప్రసాద్ పాల్గొన్నారు. ఎన్నికలకు వేతనంతో కూడిన సెలవుచిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో కార్మికులుగా పనిచేస్తున్న కర్ణాటక ఓటర్లకు ఈ నెల 26 , మే 7వ తేదీన సెలవు ఇవ్వాలని జిల్లా కార్మికశాఖాధికారి ఓంకార్రావు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ కర్ణాటకలో రెండు దశలుగా లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నందున ఆయా రోజుల్లో కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలన్నారు. ఈ మేరకు కార్మిక కమిషనర్ శేషగిరిబాబు, జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే మే 13వ తేదీన రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా దుకాణాలు, వివిధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు సైతం వేతనం కూడిన సెలవు మంజూరు చేయాలని ఆదేశించారు. సంబంధిత యజమానులు ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాతోపాటు శిక్షార్హులవుతారని స్పష్టం చేశారు. ఏనుగుల దాడిలో పంటల ధ్వంసం రామకుప్పం: మండలంలోని ఎస్.గొల్లపల్లె సమీపంలో పంటపొలాలపై ఏనుగుల గుంపు ఆదివారం రాత్రి దాడి చేసింది. పలువరు రైతులకు చెందిన వేరుశనగ, బీన్స్, రాగి, అరటి పంటలతోపాటు గంట్లప్ప అనే రైతుకు చెందిన డ్రిప్ పరికరాలను నాశనం చేసింది. ఇప్పటికై నా అటవీ అధికారులు స్పందించి ఏనుగులను కట్టడి చేయాలని బాధితులు కోరారు.చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సర్కారు బడులు ఉత్తమ ఫలితాలు సాధించాయి. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా రాష్ట్ర స్థాయిలో 6వ స్థానంలో నిలిచింది. ప్రైవేట్ యాజమాన్యాలను అధిగమించి ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు ఉత్తమంగా రాణించారు. గత టీడీపీ పాలనలో కార్పొరేట్ వ్యవస్థకు రెడ్ కార్పెట్ వేయడంతో ప్రైవేట్ స్కూళ్లతే ఆధిపత్యం ఉండేది. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మారులు తీసుకువచ్చింది. సర్కారు ప్రోత్సాహాన్ని విద్యార్థులు అందిపుచ్చుకుని అద్భుతంగా ఫలితాలు సాధించారు. ప్రైవేట్ వెనుక ‘బడి’..! జిల్లా వ్యాప్తంగా ఈ విద్యాసంవత్సరంలో అన్ని యాజమాన్యాల నుంచి 20,399 మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 19,113 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పది ఫలితాల్లో ప్రైవేట్ బడులు వెనుకబడ్డాయి. జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ బడులలో 4,756 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే జిల్లా వ్యాప్తంగా వివిధ యాజమాన్యాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాల నుంచి పది పరీక్షలు రాసిన విద్యార్థుల్లో 14,357 మంది ఉత్తీర్ణత సాధించారు 17 నుంచి ఆరోస్థానంలోకి పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో చిత్తూరు జిల్లా ఆరో స్థానంలో నిలిచింది. సోమవారం రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ పది ఫలితాలను విడుదల చేశారు. అనంతరం జిల్లా ఫలితాలను డీఈఓ కార్యాలయంలో డీఈఓ దేవరాజు విడుదల చేసి వివరాలు వెల్లడించారు. గత ఏడాది జిల్లా రాష్ట్రంలో 17వ స్థానంలో నిలవగా, ప్రస్తుతం 6 స్థానం దక్కించుకున్నట్లు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే 20.27 శాతం ఫలితాలు పెరగడం విశేషం. బాలికలదే హవా పది పరీక్షలకు 10,793 మంది బాలురు హాజరుకాగా 9596 మంది ఉత్తీర్ణత చెందారు. అలాగే 10,146 మంది బాలికలు పరీక్షలు రాయగా 9517 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 88.91 శాతం, బాలికలు 93.8 మొత్తం 91.28 ఉత్తీర్ణత శాతం నమోదైంది. మొదటి డివిజన్లో 15,463 మంది జిల్లావ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో 15,463 మంది మొదటి డివిజన్లో ఉత్తీర్ణత సాధించారు. రెండో డివిజన్లో 2593 మంది, మూడో డివిజన్లో 1057 మంది మొత్తం 19,113 మంది ఉత్తమ ఫలితాలు సాధించారు. కేజీబీవీ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు జిల్లా వ్యాప్తంగా కేజీబీవీ పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం అధునాతనంగా తీర్చిదిద్దింది. ఈ పాఠశాలల్లో చదువుతున్న బాలికల చదువుకు పేదరికం ఏ మాత్రం అడ్డుకాకుడదని సకల సౌకర్యాలనుకల్పించింది. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకున్న బాలికలు పది ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత శాతం సాధించారు. జిల్లాలోని 8 కేజీబీవీ పాఠశాలల్లో 5 బడులు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. రామకుప్పం కేజీబీవీలో చదివిన నేత్ర 600 మార్కులకు 569, గుడుపల్లె కేజీబీవీలో పుష్పలత 565, బైరెడ్డిపల్లి, శాంతిపురం కేజీబీవీల్లోని మాధవి, మహేశ్వరి 552 మార్కులను సాధించి శభాష్ అనిపించుకున్నారు. – 8లో– 8లో– 8లోన్యూస్రీల్ పదోతరగతి ఉత్తీర్ణతలో జిల్లాకు 6వ స్థానం 20,939 మందికి గాను 19,113 మంది పాస్ సత్తా చాటిన సర్కారు బడుల విద్యార్థులు 93.80శాతంతో పైచేయి సాధించిన బాలికలు ప్రైవేట్ స్కూళ్లలో 4,756 మంది.. ప్రభుత్వ పాఠశాలల్లో 14,357 మంది ఉత్తీర్ణులు కేటగిరీ ఫస్ట్క్లాస్లో ఉత్తీర్ణులు పాస్ అయినవారు ఉత్తీర్ణత శాతం ఎయిడెడ్ 139 194 95.57 బీసీ వెల్ఫేర్ 116 121 100.00 ప్రభుత్వ 708 1078 79.38 కేజీబీవీ 258 290 95.71 మున్సిపల్ 423 630 78.36 ఆదర్శ పాఠశాలలు 430 458 98.49 ప్రైవేట్ స్కూళ్లు 4,439 4,756 97.40 ఏపీ రెసిడెన్షియల్ 111 112 100.00 ఏపీ సోషల్వెల్ఫేర్ 442 472 98.74 ఏపీ ట్రైబల్వెల్ఫేర్ 61 82 91.11 జిల్లా పరిషత్ 8,336 10,920 88.39 మొత్తం 15,463 19,113 90.28 మే 24 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పదోవ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి జూన్ 3 వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 23 నుంచి 30 వ తేదీ లోగా అపరాధ రుసుం లేకుండా సంబంధిత పాఠశాలల హెచ్ఎంలకు పరీక్ష ఫీజు చెల్లించాలి. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ అప్లికేషన్లను www.bse. ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రీ కౌంటింగ్ కు దరఖాస్తు చేసుకునే వారు ఒక్కో సబ్జెక్టుకు రూ.500, రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకునే వారు సబ్జెక్టుకు రూ.1000 చొప్పున సీఎఫ్ఎంఎస్ చలానా ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు నేతపై ఆధారపడి జీవించే కుటుంబం కావడంతో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనే మా కుమారుడు సంతోష్ను చదివించాం. అయితే విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాఠశాల మెరుగుపడింది. టాయిలెట్లు, తాగునీటి సౌకర్యం, ప్రతి గదికి వెలుతురు, గాలి బాగా ఉందేలా లైట్లు, ఫ్యాన్లు అమర్చారు. గ్రీన్ బోర్డు పెట్టారు. ప్రైవేటు పాఠశాల కంటే ప్రభుత్వ బడి మెరుగుపడింది. మా కుమారుడు మంచి పాఠశాలలో చదువుతున్నాడన్న ఆనందం మాకూ కలిగింది. ప్రస్తుతం పదవ తరగతి పరీక్షల్లో 600 మార్కులకు 577 మార్కులు సాధించి మండలంలో రెండవ స్థానంలో నిలిచాడు. మాకు ఎంతో ఆనందంగా ఉంది. – బాలాజీ, హేమావతి అందరూ శభాష్ అంటున్నారు ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలంటే అందరికీ చులకనగా ఉండేది. నేడు ఆ పరిస్థితి లేదు. పాఠశాలలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద పెట్టడంతో అవి కూడా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మారిపోయాయి. ఇక్కడే మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారు. ఇంగ్లిషు మీడియం అందుబాటులో ఉంది. ఇంగ్లిష్ ల్యాబ్ ఉంది. చదువుతో పాటు ఆడుకునేందుకు కూడా పరికరాలు అందిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఆరోగ్యంగా చదువుకుంటున్నారు. ఇలాగే మా కుమారుడు తమిళ్సెల్వన్ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే బాగా చదువుకుని 577 మార్కులు సాధించి మండలంలో రెండో స్థానంలో నిలిచాడు. అందరూ శబాష్ అంటున్నారు. మాకు గర్వంగా ఉంది. – విశ్వనాథన్, తేన్మొళివసతి గృహాల్లో 88.41 శాతం జిల్లా వ్యాప్తంగా 37 సాంఘిక సంక్షేమ వసతి గృహాలున్నాయి. ఇక్కడి విద్యార్థులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించింది. ఈ వసతి గృహాల నుంచి 302 మంది విద్యార్థులు పది పరీక్షలు రాశారు. ఇందులో 267 మంది పరీక్షలు ఉత్తీర్ణత పొందారు. 88.41 శాతం ఉత్తీర్ణతతో సత్తీ చాటారు.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
ఆ సినిమా చూశాకే అలా చేయడం మానేశా: తమన్నా
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement