రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

Published Fri, Apr 8 2016 9:26 PM

four people dead in road accident

పెద్దదోర్నాల(ప్రకాశం): ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం చెంచుకుంట వద్ద శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదంలో నలుగురు మృత్యువాతపడ్డారు. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న నలుగురు అక్కడికక్కడే చనిపోగా మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పెద్దదోర్నాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement