– అధికారులకు డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవి ఆదేశం
- నేటి నుంచి రెండు కేంద్రాల్లో నిర్వహణ
- 17 నుంచి 28వ తేదీ వరకు పరీక్షలు
అనంతపురం అర్బన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో గ్రూప్–1 మెయిన్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్ఓ సి. మల్లీశ్వరిదేవి అధికారులను ఆదేశించారు. గురువారం నుంచి ఈ నెల 28వ తేదీ వరకు రోజుమార్చి రోజు జరుగుతాయన్నారు. పరీక్ష నిర్వహణపై కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఏపీపీఎస్సీ అధికారులు, జిల్లా అధికారులతో డీఆర్ఓ బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ రెండు కేంద్రాల్లో జరగనున్న పరీక్షకు 688 మంది అభ్యర్థులు హాజరవుతున్నారన్నారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒక గంట వరకు జరుగుతుందన్నారు. పరీక్ష నిర్వహణకు ఒక లైజన్ అధికారి, ఇద్దరు అసిస్టెంట్ లైజన్ అధికారులను నియమించామన్నారు.
కేంద్రాల ప్రిన్సిపాళ్లు చీఫ్ సూపరింటెండెంట్లుగా వ్యవహరిస్తారన్నారు. ప్రశ్నాపత్రాలను జిల్లా ఖజానాలోని స్ట్రాంగ్ రూం నుంచి కేంద్రాలకు పోలీసు బందోబస్తుతో లైజన్ అధికారి తీసుకెళ్లాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రం వద్ద బందోబస్తు నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పరీక్ష సమయంలో కేంద్రం పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లను బంద్ చేయించాలని ఆదేశించారు. ఎలక్ట్రానిక్ వస్తువులను కేంద్రంలోకి అనుమతించరాదన్నారు. అభ్యర్థులు పరీక్ష సమయానికంటే కేంద్రానికి గంట ముందు చేరుకోవాలని సూచించారు. సమావేశలో ఖజానా శాఖ డీడీ శర్మ, పర్యవేక్షకులు వరదరాజులు, నాగభూషణం, ఏపీపీఎస్సీ మానిటరింగ్ అధికారి బి.సి.హెచ్.ఎన్.కుమార్రాజ్, కోఆర్డినేటింగ్ అధికారులు జి.వసంతకుమార్, వి.సురేశ్బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పరీక్ష కేంద్రాలు
కేంద్రం కోడ్ అభ్యర్థులు పరీక్ష కేంద్రం
4001 400 ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాల
4002 288 ఎస్ఎస్బీఎన్ జూనియన్ కళాశాల
పరీక్ష తేదీలు
పరీక్ష తేదీ పేపర్
17.08.17 జనరల్ ఇంగ్లిష్
19.08.17 పేపర్–1
21.08.17 పేపర్–2
23.08.17 పేపర్–3
26.08.17 పేపర్–4
28.08.17 పేపర్–5
గ్రూప్-1 మెయిన్ పకడ్బందీగా నిర్వహించాలి
Published Wed, Aug 16 2017 10:19 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో మహిళతో రొమాన్స్.. చాలా ఎగ్జైట్ అయ్యానన్న సోనాక్షి
‘రైతుల భూ డాక్యుమెంట్లను బుగ్గిపాలు చేసింది బాబేగా!’
ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్
తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వరంగల్ను BRS, కాంగ్రెస్ బారి నుంచి కాపాడాలి: ప్రధాని మోదీ
కొవిషీల్డ్ వ్యాక్సిన్ను రద్దు చేసిన ఆస్ట్రాజెనెకా.. కారణం తెలుసా..
పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు
పవన్ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు?: పోసాని
ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఓటేయవచ్చు!
తప్పక చదవండి
- ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
- ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఓటేయవచ్చు!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ఎయిరిండియా సిబ్బంది సిక్ లీవ్.. 70కి పైగా విమానాలు రద్దు
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
- రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం
Advertisement