►కాలువలో కొట్టుకొచ్చిన మృతదేహం యువతిదే
►ఉరేసుకుని చనిపోయాకతీసుకొచ్చి పడేశాడు
►అంత్యక్రియల ఖర్చులు భరించలేకనే..!
రాజేంద్రనగర్: లక్షీగూడ ప్రాంతంలోని కాలువలో లభ్యమైన మృతదేహం కేసును మైలార్దేవ్పల్లి పోలీసులు ఛేదించారు. ఎస్సై నాగాచారి తెలిపిన వివరాల ప్రకారం... లక్షీగూడ ప్రాంతానికి చెందిన పెంటయ్య తన కుటుంబ సభ్యులతో నివసిస్తున్నాడు. స్థానిక కంపెనీలో పని చేస్తున్నారు. గత 18 నెలల క్రితం కుమారుడు తులసీరామ్ ఆత్మహత్య చేసుకోవడంతో కూతురైన భవాని(16)తో కలిసి ఉంటున్నాడు. 7వ తరగతి చదివిన భవాని ఇంటి వద్దే ఉంటుంది. స్థానికంగా ఉన్న కొందరితో స్నేహం చేసి చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడుతోంది. గత 20 రోజుల కిత్రం కూడా భవాని ఒక సెల్ఫోన్ దొంగతనం చేసినట్టు తెలియడంతో అప్పట్నుంచి పెంటయ్య ఆమెను ఇంటి నుంచి బయటకు రాకుండా కట్టడి చేశారు. గత నెల 10న రాత్రి సమయంలో బయటకు వెళ్లి వచ్చింది.
దీంతో స్థానికులు మీ కూతురు అర్ధరాత్రి వేళ బయట తిరుగుతుందని పెంటయ్యతో చెప్పారు. అర్ధరాత్రి కావడంతో కూతుర్ని ఏమీ అనకుండా ఉదయమే లేచి డ్యూటీకి వెళ్లాడు. తండ్రి మందలిస్తాడనే భయంతో 11న బాత్రూమ్లో ఉరేసుకోని ఆత్మహత్య చేసుకుంది. ఉద్యోగం నుంచి వచ్చిన పెంటయ్య చూసి మృతదేహాన్ని స్థానికంగా ఉన్న నాలాలో పడవేశాడు. ఇప్పటికే లక్ష రూపాయల అప్పు ఉండడం.. మృతదేహానికి ఖననం ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తే మరింత అప్పు పెరుగుతుదని భావించి కాలువలో వేసినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు. గత నెల 11న కాలువలో వేస్తే 31న ఉదయం కాలువ నుంచి పైపులైన్ ద్వారా భవానీ మృతదేహం బయటకు వచ్చింది.
కేసులో ఎలాంటి క్లూ లేకపోవడంతో పోలీసులు స్థానికంగా మిస్సింగ్ వివరాలను సేకరించారు. ఇందులో భాగంగా భవానీ కనిపించడం లేదని తెలపడంతో పెంటయ్యను పిలిపించి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కన్నతండ్రే కాలువలో పడేశాడు
Published Sat, Jun 3 2017 12:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement