క్వింటాల్కు రూ.5,350 నాలుగేళ్ల గరిష్ట ధరకు చేరువ
పక్క రాష్ట్రాల్లో ధరను చూసి.. పెంచుతున్న జిల్లా వ్యాపారులు
ఇప్పటికే 60 శాతం అమ్ముకున్న రైతులు
మంచిర్యాల అగ్రికల్చర్ : పత్తి ధరలు రైతులను మరోసారి ఆందోళనలో పడేశాయి. అదునుదాటాక.. ఉన్నది అమ్ముకున్నాక వ్యాపారులు పెద్దఎత్తున ధరలు పెంచుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తి బేళ్లు, గింజలకు డిమాండు పెరగడంతోపాటు పక్క మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాల్లో ధరలు పెరుగుతుండటంతో ఆ ప్రభావం జిల్లాపై చూపుతోంది. దీంతో తప్పని పరిస్థితిలో వ్యాపారులు ధరలు పెంచుతున్నారు. బుధవారం జిల్లాలోని జిన్నింగ్ వ్యాపారులు క్వింటాలకు రూ.5,350 ధరతో కొనుగోలు చేశారు. జిల్లాలో నాలుగేళ్ల క్రితం గరిష్టంగా రూ.5,500 చేరుకున్న ధరలు ఇప్పుడు చేరువులో ఉన్నాయి. జిల్లాలోని రైతులు ఇప్పటికే 60 శాతం పత్తిని అమ్ముకున్నారు. పెరుగుతున్న ధరలు రైతుల కన్న వ్యాపారులకే ఎక్కువగా మేలు చేస్తున్నాయి.
ఈసారి 47 వేల హెక్టార్లలో సాగు..
జిల్లాలో ఈ ఏడాది 47 వేల హెక్టార్లలో పత్తి సాగైంది. ఈ ఏడాది ఆశించిన వర్షాలు కురవడంతో మంచి దిగుబడి వచ్చింది. సెప్టెంబర్ నుంచి దిగుబడి వస్తున్న పంటను ఇప్పటికే రైతులు 60 శాతం అమ్ముకున్నారు. రెండేళ్లు అప్పుల పాలైన రైతులు ఈ ఏడాది కురిసిన వర్షాలు కొంత ఊరటనిచ్చాయి. ఇతర రాష్ట్రాల్లో ధరలు పెరుగుతుండటంతో రెండు నెలలుగా దళారులు గ్రామాల్లో తి రుగుతూ మద్దతు ధర రూ.4,160 కంటే ఎక్కువగా రూ. 4,600 నుంచి రూ.4,900 వరకు చెల్లించి కొనుగోలు చేశారు. రెండేళ్లు నష్టాలు ఎదుర్కొన్న రైతులు ప్రభుత్వ మద్దతు ధర కంటే రూ.450 నుంచి రూ.800 అధికంగా వస్తుండటంతో దళారులకే పత్తిని ముట్టజెప్పారు.
పెరుగుతున్న డిమాండ్..
రెండేళ్ల కాలంలో పత్తి క్వింటాల్కు కనిష్టంగా రూ. 3,600, గరిష్టంగా రూ.4,500 ధరలు పలుకాయి. ఈ ఏ డాది ఆరంభంలో వ్యాపారులు గరిష్ట ధర రూ.4,450తో కొనుగోలు ప్రారంభించారు. రెండు నెలల్లో వంద రెండు వందలు పెంచుతూ తగ్గిస్తూ వస్తున్నారు. దీనికి కారణం గత సీజన్ «అంతర్జాతీయ మార్కెట్లో పత్తి బేళ్ల ధర పెరుగుతుండడమే. అందుకే.. ఇతర రాష్ట్రాల వ్యాపారులు జిల్లాలోకి ప్రవేశించి గ్రామాల్లో జీరో కొనుగోళ్లు చేపడుతున్నట్లు తెలిసింది. డిసెంబర్ 2 నుంచి క్వింటాల్కు గరిష్టంగా రూ.5 వేలకు పైగా చెల్లిస్తున్నారు. అమ్మిన రైతులు ఆవేదనకు గురువుతుంటే ఇన్ని రోజులు నిల్వచేసిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సీసీఐ కొనుగోళ్లు సున్నా..
రైతులు పండించిన పంటలు నష్టపోకుండా ఉండేందు కు ఏర్పాటైన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తెల్లబోతోంది. ఒక్కరంటే ఒక్క పత్తి రైతు కూడా ఈ ఏడాది సీసీఐ కొనుగోలు కేంద్రాలకు వెళ్లలేదు. జిల్లాలో ఆరు సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు ఒక్క క్వింటాల్ పత్తిని కూడా అమ్మలేదు. కనీస మద్దతు ధర క్వింటాల్కు రూ.4,160 నిర్ణయించడం, తేమ, పింజ పొడువు, తదితర నిబంధనలు దగ్గరకు రానివ్వకుండ చేశాయి. దీంతో రైతులంతా ప్రైవేటుగానే విక్రయించా రు. గతేడాది ఇదే సమయానికి లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసిన సీసీఐ.. ఈసారి మాత్రం ఒక్క క్వింటా పత్తిని కూడా కొనుగోలు చేయకపోవడం గమనార్హం. ‘పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరుగుతోం ది. దీంతో జిల్లాలో జిన్నింగ్ వ్యాపారులు ధరలు పెంచుతున్నారు. సీసీఐ ఒక్క క్వింటాల్ కూడా కొనలేదు’ అని మార్కెటింగ్ శాఖ అధికారి గజానంద్ తెలిపారు.
పత్తి ధర పైపైకి
Published Thu, Jan 5 2017 10:38 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
చెస్ గ్రాండ్మాస్టర్ల కర్మాగారంలా మారిన భారత్.. 1987లో ఒక్కరే.. ఇప్పుడు..!
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
Advertisement