కామేపల్లి : వేగంగా వచ్చిన లారీ బాలికను ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కొత్తలింగాల సమీపంలోని ఫంక్షన్ హాల్ వద్ద బుధవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలోని లక్ష్మి ఫంక్షన్ హాల్లో పెళ్లి జరుగుతుండటంతో తల్లిదండ్రులతో కలిసి వచ్చిన నల్లగొండ జిల్లా మోతె మండలం సర్వారానికి చెందిన బాలిక మేదరమెట్ల రమ్య.. రోడ్డు పక్కనే ఆగి ఉన్న ఆటోలో బంధువులు ఉండటంతో రోడ్డు దాటుతూ వారి వద్దకు వెళ్తోంది. ఈ క్రమంలో మణుగూరు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ఇసుక లారీ వేగంగా వచ్చి బాలికను ఢీకొట్టి.. రెండు కాళ్లపై నుంచి వెళ్లింది. కాళ్లు నుజ్జునుజ్జయి తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో బంధువులు ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. కోపోద్రిక్తులైన బంధువులు లారీ డ్రైవర్కు దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని లారీని, డ్రైవర్ను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. కాగా.. బాలిక బంధువులు ఎటువంటి ఫిర్యాదు ఇవ్వలేదని పోలీసులు చెప్పారు.
బాలికను ఢీకొట్టిన లారీ
Published Wed, Aug 10 2016 10:59 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement