చిలమత్తూరు : మండలంలోని వితంతు, వృద్ధాప్య, చేనేత, వికలాంగ పింఛన్ల పంపిణీలో భారీ స్థాయిలో గోల్మాల్ జరిగింది. ఈ విషయం బయటకు పొక్కకుండా డీఆర్డీఏ అధికారులు రహస్యంగా విచారిస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండల వ్యాప్తంగా 11 పంచాయతీల్లో 5,900 మంది పింఛన్దారులకు రూ.63,40,500 నెలకు పంపిణీ చేస్తున్నారు. అయితే కార్యాలయంలో పింఛన్లు పంపిణీ చేసే ఉద్యోగి అధికారులను, కార్యదర్శులను బురిడీ కొట్టించి మిగిలిన సొమ్మును వెనక్కి పంపుతున్నట్టు నమ్మిస్తూ వచ్చాడు. ఇలా మూడు నెలలుగా సుమారు రూ.7.50 లక్షలు స్వాహా చేసినట్లు సమాచారం. ఉదాహరణకు గత నెల రూ.4,70,200 మిగిలి ఉంటే జమ చేసే స్లిప్లో రూ.200 రాసి స్టాంప్ పడిన తర్వాత మిగిలిన మొత్తాన్ని రాసుకునే విధానం పాటించినట్టు తెలుస్తోంది.
బయట పడిందిలా
సదరు ఉద్యోగి కుంభకోణం మండలంలోని దేమకేతేపల్లి పంచాయతీలో పింఛన్లు పంపిణీలో బయట పడింది. పింఛన్లు పంపిణీ చేసే కార్యదర్శి, అసిస్టెంట్ వద్ద నుంచి రూ.2 లక్షల మొత్తాన్ని పంపిణీ 10వ తేదీ వరకు జరుగుతుందని అంతలోపు ఇస్తానని బదులు తీసుకున్నాడు. పంపిణీ తేదీ ముగుస్తున్నా చెల్లించకపోతే బండారం బయట పడింది. దీంతో గత నెలల నుంచి బ్యాంకుకు సరిగా చెల్లించాడా లేదా అని రసీదు, స్టేట్మెంట్లు తీసుకుని ఆరా తీస్తే అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఐదు రోజులుగా సదరు ఉద్యోగి కార్యాలయానికి రావడం లేదు. దీనిపై డీఆర్డీఏ అధికారులు రహస్యంగా కార్యాలయానికి వచ్చి వారం రోజుల క్రితం విచారణ చేపట్టినట్లు తెలిసింది.
కొసమెరుపు
సదురు ఉద్యోగి స్థానిక ఎంపీపీ ప్రాథమిక పాఠశాలలో పనిచేసి పదవీ విరమణ చేసిన పొందిన ప్రధానోపాధ్యాయుడికి సంబంధించిన రెండు నెలల జీతం కూడా డ్రా చేయడం విడ్డూరం. అధికారులు విచారణలో ఉద్యోగి రూ.లక్ష కట్టినట్లు సమాచారం.
పింఛన్ల పంపిణీలో ‘గోల్మాల్’
Published Tue, Mar 28 2017 11:13 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!
మేఘాలయలో హిట్లర్ను అరెస్టు చేసిన కెన్నెడీ?
మీ ఆశీర్వాదంతో విజయం సాధిస్తాం
పేదింట విషాదం
నూకాంబిక అమ్మవారి బాలాలయానికి పోటెత్తిన భక్తులు
రమేష్ రౌడీయిజంతో జల్లా ప్రజల్లో భయభ్రాంతులు
ఎన్. గజపతినగరంలో టీడీపీకి గట్టి షాక్
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు
జగన్ మళ్లీ సీఎం కావడం తథ్యం
‘చేనేత’ను ఆదుకున్నది జగన్ ప్రభుత్వమే
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement