ఉధృతంగా గోదావరి | Sakshi
Sakshi News home page

ఉధృతంగా గోదావరి

Published Tue, Aug 9 2016 1:58 AM

godavari floting level increase

కొవ్వూరు: గోదావరిలో వరద ఉధృతి భారీగా పెరిగింది. పుష్కర ఘాట్ల వద్ద ఉధృతంగా ప్రవహించడంతో ధవళేశ్వరం ఆనకట్టకు ఉన్న 175 గేట్లను రెండు మీటర్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. సోమవారం సాయంత్రం 6 గం టలకు 8.70 అడుగుల నీటమట్టం నమోదైంది. ఉభయగోదావరి జిల్లాల్లో మూడు డెల్టాలకు 13,100 క్కూసెక్కుల నీరు వి డుదల చేస్తున్నారు. ఆనకట్ట నుంచి 4,90,601 క్యూసెక్కుల మిగులు జలాల ను సముద్రంలోకి వదులుతున్నారు. ఎ గువన భద్రాచలంలో ఆదివారం సాయంత్రం  38.20 అడుగులున్న నీటిమట్టం సోమవారం సాయంత్రానికి 35.70 అడుగులకు తగ్గింది

Advertisement

తప్పక చదవండి

Advertisement