ద్రాక్షవల్లి..పైడితల్లి | Sakshi
Sakshi News home page

ద్రాక్షవల్లి..పైడితల్లి

Published Tue, Sep 20 2016 10:24 PM

అమ్మవారికి ద్రాక్షపండ్లతో అలంకరణ

 
విజయనగరం టౌన్‌:  కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి , ఉత్తరాంధ్రుల ఆరాధ్యదేవత  పైడితల్లి అమ్మవారికి మంగళవారం ఆలయ అధికారులు గులాబీలతో సర్వాంగ సుందరంగా అలంకరణ చేశారు. అనంతరం అమ్మవారికి ద్రాక్షగుత్తులు నివేదన చేశారు. స్థానిక మూడులాంతర్లు వద్ద ఉన్న చదురుగుడిలో వేకువజామునుంచి పైడితల్లి అమ్మవారికి సిరిమాను పూజారి తాళ్లపూడి భాస్కరరావు , మూలా పాపారావు, రమణ, వెంకటరావులు విశేష పూజలు నిర్వహించారు. అదేవిధంగా రైల్వేస్టేషన్‌ వద్ద ఉన్న వనంగుడిలో కొలువైన పైడితల్లికి అర్చకులు రవిప్రసాద్, ధనుంజయ్‌లు పూజలు నిర్వహించారు.  మహిళలు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని పసుపు,కుంకుమలతో మొక్కుబడులు చెల్లించుకున్నారు.  కార్యక్రమాలను ఆలయ సూపరింటెండెంట్‌  సత్యనారాయణ, సూపర్‌వైజర్లు అప్పలనాయుడు, పెనుమత్స శ్రీనివాసరాజులు పర్యవేక్షించారు.
 
 

Advertisement
Advertisement