20 కాసుల బంగారు ఆభరణాలు అపహరణ | Sakshi
Sakshi News home page

20 కాసుల బంగారు ఆభరణాలు అపహరణ

Published Mon, Sep 5 2016 2:06 AM

gold ornaments theft

భీమవరం అర్బన్‌: భీమవరం రూరల్‌ పోలీస్‌స్టేçÙన్‌ పరిధిలో ఓ కిరాణా దుకాణంలో దొంగలు చొరబడి 20 కాసుల బంగారు ఆభరణాలు అపహరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భీమవరం మండలంలోని దిరుసుమర్రు పాతూరుకి చెందిన పెంటపాటి సత్యనారాయణ తన నివాసం దగ్గరలో కిరాణ దుకాణం నిర్వహిస్తున్నారు. రోజూ ఉదయం దుకాణానికి వెళ్లి వ్యాపారం సాగించి సాయంత్రం ఇంటికి వస్తుంటారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం దుకాణానికి వెళ్లగా వెనుక తలుపు పగులగొట్టి ఉంది. దీంతో హుడావుడిగా లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. 20 కాసుల బంగారు ఆభరణాలు, మరికొన్ని వస్తువులు చోరీ జరిగినట్టు బాధితుడు ఫిర్యాదు మేరకు ఎస్సై ఎన్‌.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 

Advertisement
Advertisement