రూ.250 కోట్లతో ప్రత్యేక పైప్‌లైన్‌ | Sakshi
Sakshi News home page

రూ.250 కోట్లతో ప్రత్యేక పైప్‌లైన్‌

Published Sun, Feb 26 2017 12:04 AM

gollapalli to hindupur pipeline

- గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి హిందూపురం వరకు
- ప్రభుత్వం నుంచి అనుమతులు : కమిషనర్‌ విశ్వనాథ్‌

హిందూపురం అర్బన్‌ : గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి హిందూపురం ప్రజల తాగునీటి కోసం 50 కిలోమీటర్ల మేర ప్రత్యేక పైప్‌లైన్‌ కోసం ప్రతిపాదించిన రూ.250 కోట్ల ప్యాకేజీకి ఈఎన్సీ అనుమతి ఇచ్చిందని మున్సిపల్‌ కమిషనర్‌ విశ్వనాథ్‌ చెప్పారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రత్యేక చొరవతో తాగునీటి ప్యాకేజీ ప్రాజెక్టుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు.

ఈ మేరకు త్వరలో తొలివిడత కింద రూ.160 కోట్లు, రెండోవిడతలో రూ.90 కోట్లు మంజూరు అవుతాయన్నారు. ప్రాజెక్టు పూర్తయితే పట్టణ ప్రజలకు నీటి కొరత శాశ్వతంగా తీరుతుందన్నారు. కాగా శ్రీనివాస వాటర్‌ ప్లాంట్‌ ట్యాంకర్‌ కాంట్రాక్టర్‌కు రూ.90 లక్షలు బకాయిలు ఉందని చెప్పడంలో వాస్తవం లేదన్నారు. అతడికి కేవలం రూ.45 లక్షలు మాత్రమే ఇవ్వాల్సి ఉందని చెప్పారు. సమావేశంలో మున్సిపల్‌ ఇంజనీర్‌ రమేష్, డిఇ వన్నూర్‌స్వామిలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement