- పెద్దనోట్ల రద్దు సమయంలో రూ.12.40 లక్షల అవినీతి
- ఇద్దరు అధికారుల మీద సీబీఐ కేసు నమోదు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నోట్ల రద్దు సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుచ్చిరెడ్డిపాళెం శాఖలో బంగారు రుణాల మంజూరు మాటున రూ.12.40 లక్షలు అవినీతి జరిగింది. ఈ విషయంపై అందిన ఫిర్యాదుతో బ్యాంకు సీనియర్ స్పెషల్ అసిస్టెంట్ ఎం.సుల్తాన్ మొహిద్దీన్, డిప్యూటీ మేనేజర్ (ఆపరేషన్) ఐ.జె.రాజశేఖర్మీద కేసు నమోదు చేసినట్లు సీబీఐ ఎస్పీ ఆర్.గోపాలకృష్ణారావు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.
పెద్ద నోట్ల రద్దు సమయంలో ఖాతాదారులకు, రుణగ్రహీతలకు కూడా నగదు చెల్లింపు విషయంలో రిజర్వ్ బ్యాంకు అనేక షరతులు విధించింది. దేశ వ్యాప్తంగా అనేక బ్యాంకుల్లో ఖాతాదారులు రూ.10 వేల నగదు కూడా ఉపసంహరించుకోలేక అవస్థలు పడ్డారు. బుచ్చిరెడ్డిపాళెం ఎస్బీఐలో పనిచేస్తున్న సుల్తాన్ మొహిద్దీన్, రాజశేఖర్ ఈ అవకాశాన్ని అనుకూలంగా మలుచుకుని అవినీతికి పాల్పడ్డారు. గత ఏడాది నవంబరు 15, 25 తేదీల్లో సుల్తాన్కు బినామీ పేర్ల మీద డిప్యూటీ మేనేజర్ రాజశేఖర్ నాలుగు బంగారు రుణాల కింద రూ.9.70 లక్షలు మంజూరు చేశారు. మరో మూడు బంగారు రుణాలు మంజూరు చేసి ఇందుకు సంబంధించి రూ.2.70 లక్షలు కొత్త రూ.500, రూ.2000 నోట్లు అందజేశారు.
ఇదే సమయంలో గత ఏడాది నవంబరు 21, నవంబరు 25వ తేదీల్లో రూ.500 పాత నోట్లు జమ చేసి సుల్తాన్కు మంజూరు చేసిన రెండు బినామీ రుణాలు క్లోజ్ చేశారు. ఈ విషయంపై ఫిర్యాదులు రావడంతో విశాఖపట్నం సీబీఐ అధికారులు రంగంలోకి దిగి విచారణ చేశారు. బ్యాంకు ఉన్నతాధికారులు సుల్తాన్ మొహిద్దీన్ను సస్పెండ్ చేశారు. సీబీఐ అధికారులు శని, ఆదివారాల్లో ఇందుకు సంబం«ధించి బ్యాంకు రికార్డులు తనిఖీ చేశారు. ఈ సంఘటన బుచ్చిరెడ్డిపాళెంలో సంచలనం కలిగించింది. లోతుగా జరిపిన విచారణలో రూ.12.40 లక్షలు గోల్ మాల్ జరిగిందని తేల్చారు. దీంతో సుల్తాన్, రాజశేఖర్ మీద ఐపీసీ సెక్షన్ 120 ృబి రెడ్విత్ 420, 409, 1988 పీసీ చట్టం లోని సెక్షన్ 13(2), రెడ్ విత్ 13(1)(డి) సెక్షన్ల కింద సోమవారం కేసు నమోదు చేశారు. కేసు విచారణ దశలో ఉందని ఎస్పీ గోపాలకృష్ణారావు తెలిపారు. అధికారులు ఇద్దరూ తమ చేతిలో అధికారాన్ని ఉపయోగించి అవినీతి పాల్పడ్డారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగం సంస్థలు, బీమా సంస్థల్లో అవినీతిపై ప్రజలు ఎస్పీ కార్యాలయం, సీబీఐ, విశాఖపట్నం చిరునామాకు నేరుగా గానీ, పోస్టు ద్వారా లేదా 1800 425 00100 టోల్ఫ్రీ నంబరుకు గానీ ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు.
బుచ్చి ఎస్బీఐలో గోల్డ్ లోన్ల గోల్మాల్
Published Tue, Mar 14 2017 11:36 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటీటీకి వచ్చేస్తోన్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘ప్రజ్వల్ రేవణ్ణ’ పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే!
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూంలో అలా!
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement