♦ చంద్రబాబు సర్కార్పై మిత్రపక్షం బీజేపీ ఆగ్రహావేశాలు
♦ సమస్యల పరిష్కారానికి ఒత్తిడి తేవాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కరువుతో అల్లాడే రాయలసీమపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మిత్రపక్షం బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రతీ విషయంలోనూ సీమకు అన్యాయం జరుగుతోందని అభిప్రాయానికొచ్చింది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కార్యచరణ సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా రెండ్రోజుల క్రితం హైదరాబాద్లో పార్టీ సీమ నేతలతో సమావేశం నిర్వహించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆర్ఎస్ఎస్ నేతలు కూడా పాల్గొన్నారు. ఇందులో సీమకు జరుగుతున్న అన్యాయాలపై చర్చించినట్లు సమాచారం.
శ్రీశైలంలో 100 టీఎంసీల మేర నీరున్నా సీమకు సాగునీరు ఇవ్వకుండా, తాగు నీటి అవసరాల పేరిట నీటి విడుదలకు ప్రభుత్వం పూనుకోవడాన్ని నేతలు తప్పుబట్టారు. నిబంధలను పక్కనబెట్టి పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టిన ప్రభుత్వం, సీమ ప్రాజెక్టుల విషయానికొచ్చేసరికి నిబంధనల పేరు చెప్పి మూలన పడేస్తున్నారని నేతలు అభిప్రాయానికొచ్చారు. సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. సీమకు కేంద్రం నుంచి ప్రత్యేకంగా నిధులు రాబట్టే చర్యలు చేపట్టాలని తీర్మానించారు. ఇక్కడి ప్రధాన సమస్యలపై ఒక నివేదిక రూపొందించి, కేంద్రం వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక ప్యాకేజీ అడగాలని నిర్ణయించారు.
సీమ మేధావుల ఉద్యమానికి దూరంగా..
రాయలసీమకు జరుగుతున్న అన్యాయాలపై ఆ ప్రాంత మేధావులు చేపట్టిన ఉద్యమానికి పార్టీ నేతలు దూరంగా ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. పార్టీనే కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించారు.
రాయలసీమపై ప్రభుత్వం నిర్లక్ష్యం
Published Tue, Nov 10 2015 1:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement