- ‘కియా’ కోసం మరో 2 వేల ఎకరాలను సేకరించనున్న ప్రభుత్వం ?
పెనుకొండ : కియా కార్ల పరిశ్రమకు ప్రస్తుతం 600 ఎకరాల భూమిని సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం మరో 2 వేల ఎకరాల భూమిని సేకరించడానికి రంగం సిద్ధమైందన్న వార్తలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మొదటి విడతలో సేకరించిన భూమిలో ఇప్పటికే రూ. 177 కోట్లతో భూమి చదును పనులు ప్రారంభం కాగా ఆ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతుకు ఎకరాకు రూ.10.50 లక్షలు పరిహారంగా ఇచ్చిన ప్రభుత్వం చదునుకు మాత్రం ఎకరాకు దాదాపుగా రూ. 30 లక్షలు మంజూరు చేసింది. ఇందులో కూడా భారీ కుంభకోణం దాగి ఉందనే విమర్శలున్నాయి.
అయితే దీనిని ఏ మాత్రం పట్టించుకోని ప్రభుత్వం మరోసారి 2 వేల ఎకరాల భూమిని సేకరించడానికి రంగం సిద్ధమైందని రైతులు చెబుతున్నారు. మూడు ప్రాంతాల్లో ఈ భూములను సేకరించి కియా కార్ల సంస్థకు అనుగుణంగా భూమి దగ్గర ప్రాంతంలో ఉండేలా కేటాయించాలని అధికారులు నిర్ణయించారని అంటున్నారు. ఈ ప్రాంతంలో భూములు కొన్న పలువురు ఔత్సాహికులు సైతం ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎకరా భూమిని ఏకంగా కోటి రూపాయలకు దరిదాపుల్లో అగ్రిమెంట్లు కుదుర్చుకున్న బెంగళూరు,. చెన్నై వ్యాపారవేత్తలు ప్రస్తుతం ఆ భూములను అమ్ముకుంటే చాలన్న అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం.
దుద్దేబండ రహదారి ప్రక్కన, రైల్వే ట్రాక్ సమీపంలో, ఎర్రమంచి, హరిపురం, వెంకటగిరిపాళ్యం గ్రామాల సమీపంలో ఈ భూసేకరణ ఉంటుందన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆరంభంలోనే ప్రభుత్వం 2500 ఎకరాల భూమిని సేకరించడానికి ప్రయత్నించగా వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి రైతులకు మద్దతుగా అమ్మవారుపల్లి వద్ద సమావేశం కూడా నిర్వహించి ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండించారు. రైతుల కోసం రిజర్వాయర్ నిర్మిస్తే దానిని పారిశ్రామిక వేత్తలకు దారాదత్తం చేసినట్లు అవుతోందని విమర్శించారు. దీంతో అప్పట్లో ప్రభుత్వం వెనకడుగు వేసింది. పనులు ప్రారంభం కాగానే మళ్లీ భూసేకరణ పై ఊహాగానాలు జోరందుకోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
రికార్డులు సేకరిస్తున్నాము - ఆర్డీఓ రామమూర్తి
ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండో విడతలో 600 ఎకరాలకు రైతుల నుంచి రికార్డులు సేకరిస్తున్నాము. పూర్తి నివేదికను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపుతాము. ఇప్పటికే పలువురు రైతులు తమ భూములకు సంబంధించిన రికార్డులు అందించారు.
మళ్లీ భూ సేకరణ !
Published Fri, Jun 30 2017 11:49 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
లక్షణాలిలా..
IPL 2024: ప్లే ఆఫ్స్ రేసు ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్..
Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్లో తెలుగు నటి (ఫోటోలు)
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్కు ఎస్ఆర్హెచ్
యాక్షన్ ఎంటర్టైనర్గా లారీ చాప్టర్-1.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
World Hypertension Day 2024 : సైలెంట్ కిల్లర్..పట్టించుకోకపోతే ముప్పే!
విరాట్ కోహ్లి తక్కువ అంచనా వేస్తే.. పాక్కు చుక్కలే: మిస్బా
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
ఐడియా అదిరింది
యాక్టర్స్గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement