సంపాదనే ధ్యేయంగా పనిచేయడం తగదు: గవర్నర్
విజయవాడ(హెల్త్ యూనివర్సిటీ): సంపాదనే ధ్యేయంగా వైద్యం చేసే డాక్టర్లు తమ తీరు మార్చుకోవాలని గవర్నర్ నరసింహన్ హితవు పలికారు. విజయవాడలో బుధవారం జరిగిన డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 18వ, 19వ స్నాతకోత్సవానికి వర్సిటీ కులపతిగా గవర్నర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ... ఈతరం వైద్యులు కేవలం క్లినికల్ పరీక్షల ద్వారానే రోగాన్ని తెలుసుకునేందుకు పరిమిత మవుతున్నారన్నారు. ఇన్ఫెక్షన్ సోకుతుందనే నెపంతో వచ్చిన ప్రతి రోగినీ ఐసీయూల్లో చేర్చి, నెలల తరబడి ఉంచుతున్నారన్నారు. వారి గాలి వారే పీల్చుకునే పరిస్థితి ఉత్పన్నమైతే ఇన్ఫెక్షన్ సోకదా అని ప్రశ్నించారు.
వైద్య పరికరాల ఖర్చు రాబట్టుకునే ప్రయత్నంలో నైతిక విలువలు లేకుండా అధిక ఫీజులు వసూలు చేయడం తగదన్నారు. చనిపోయిన వ్యక్తికి ఈసీజీ తీసి బిల్లు వేసి మృతి చెందిన విషయాన్ని నిర్ధారించడం శోచనీయమన్నారు. వైద్య చికిత్సలకయ్యే ఖర్చులు వేర్వేరుగా ఉంటున్నాయని, అలా కాకుండా ప్రముఖ వైద్యులు చర్చించి, ఖర్చు పట్టికను రూపొందించి ప్రతి ఆసుపత్రి నోటీసు బోర్డులో ఉంచాలన్నారు. ప్రతి వైద్య విద్యార్థి గ్రామీణ ప్రాంతాల్లో పని చేయాలని సూచించారు. రోగిని వైద్యుడు ప్రేమతో తట్టే స్పర్శ చాలా శక్తివంతమైందన్నారు.
డాక్టర్ కె.ఎస్.చుగ్కు గౌరవ డాక్టరేట్
మూత్రపిండాల శాస్త్ర పితామహుడు డాక్టర్ కిరపాల్సింగ్ చుగ్(కె.ఎస్.చుగ్)కు గౌరవ డాక్టరేట్ను గవర్నర్, వర్సిటీ వీసీ టి.రవిరాజు అందజేశారు. కె.ఎస్.చుగ్ మాట్లాడుతూ.. 1955లో ఎంబీబీఎస్ పూర్తయిన అనంతరం 23 ఏళ్ల వయస్సులో పంజాబ్ యూనివర్సిటీలో ఎండీ(మెడిసిన్) కోర్సులో చేరానని, అప్పట్లో దేశంలో కిడ్నీ వ్యాధులకు సంబంధించి స్పెషాలిటీ కోర్సు ఎక్కడా లేదని తెలిపారు. అయినా కిడ్నీ వ్యాధులపై ప్రత్యేక సబ్జెక్టుగా ఎంచుకోగా వర్సిటీ యాజమాన్యం అనుమతి ఇవ్వలేదని, మ్యాడ్మ్యాన్ అన్నారన్నారు. అయినా పట్టువిడవకుండా ప్రయత్నం చేస్తే 9 నెలల తరువాత అనుమతి ఇచ్చారని, అలా కిడ్నీ స్పెషలిస్టు కావాలన్న తన కలను సాకారం చేసుకున్నానని వెల్లడించారు. స్నాతకోత్సవంలో 13 మందికి పీహెచ్డీ, 12 మందికి సూపర్ స్పెషాలిటీ, 97 మందికి స్వర్ణ, 46 మందికి రజత పతకాలు, 42 మందికి నగదు ప్రోత్సాహకాలు అందజేశారు.
డాక్టర్లు తీరు మార్చుకోవాలి
Published Thu, Mar 31 2016 1:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement