తుర్కపల్లి : ప్రజల కిచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ మంత్రి, తెలుగుదేశం పోలిట్బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని జేఎం పంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అయన మాట్లాడుతూ ప్రభుత్వం మూడేళ్లు గడుస్తున్న రైతులకు రుణమాఫీ చేయలేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ది ఉంటే ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. హరితహారం పేరుతో రూ. కోట్లు ఖర్చు చేస్తూ రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. మొక్కలు నాటడంలో చూపుతున్న శ్రద్ధ వాటిని రక్షించడంలో చూపడం లేదని తెలిపారు. పేదలకు డబుల్ బెడ్రూంల ఇళ్లు, దళితులకు మూడెకరాలు, కేజీ టు పీజీ విద్య, ఇంటికో ఉద్యోగం, కరెంట్ సబ్సీడీ, వంటి పథకాల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. తుర్కపల్లి మండలంలో విలువైన ప్రభుత్వ భూమి కబ్జాలకు గురవుతుందని ఆ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, తెలంగాణ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరి రామచంద్రారెడ్డి, జిల్లా నాయకులు వనందాస్ పాపయ్య, కళాశికం అమరేందర్, రఘు, సంజీవ, అమర్నా«ద్ తదితరులు పాల్గొన్నారు.
అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలం: మోత్కుపల్లి
Published Sun, Jul 24 2016 12:40 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement