రైతుల సమస్యలను విస్మరిస్తున్న ప్రభుత్వం | Sakshi
Sakshi News home page

రైతుల సమస్యలను విస్మరిస్తున్న ప్రభుత్వం

Published Fri, Jul 22 2016 6:02 PM

రైతుల సమస్యలను విస్మరిస్తున్న ప్రభుత్వం

కోదాడఅర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను పూర్తిగా విస్మరించి వారి సంక్షేమాన్ని మరచిపోయిందని లోక్‌సత్తా ఉద్యమ సంస్థ జిల్లా నాయకుడు రావెళ్ల రవికుమార్‌ విమర్శించారు. శుక్రవారం పట్టణంలో జరిగిన సంఘం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు రుణమాఫీని అమలు చేస్తామని, వారికి ఖరీఫ్‌ సీజన్‌లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని ప్రకటించిన ప్రభుత్వం దానిని అమలు చేయడంలో విఫలమైందన్నారు. కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు అందజేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు నరేంద్ర, అచ్యుతరావు, రామోజీ, పాషా తదితరులు పాల్గొన్నారు.


 

Advertisement
Advertisement