‘విమోచన దినాన్ని నిర్వహించాలి’ | Sakshi
Sakshi News home page

‘విమోచన దినాన్ని నిర్వహించాలి’

Published Fri, Aug 12 2016 9:15 PM

Govt should celebrate SEP 17th

చిన్నచింతకుంట: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని శుక్రవారం చిన్నచింతకుంట బీజేవైఎం మండల శాఖ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రధాన వీదుల్లో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జండాలు చేత పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం మండలాధ్యక్షుడు నరేందర్‌జీ మాట్లాడుతూ ఎన్నికల ముందు తెలంగాణ విమోచన దినోత్సవం గూర్చి ఎన్నో పర్యాయాలుగా ప్రస్తవించిన సీఎం గద్దెనెక్కిన తరువాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని విస్మరించడం సిగ్గుచేటని పేర్కొన్నారు.

సెప్టెంబర్‌ 17న జాతీయ జెండాలను తమ పార్టీ ఆధ్వర్యంలో ఎగురవేస్తామని ఆయన హెచ్చరించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీæతహసీల్దార్‌ విష్ణురాంకు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు పోర్ల వెంకటేశ్, ఎస్‌ మల్లెష్, రాజేష్, లక్ష్మణ్, లక్ష్మీనర్సింహ, బోగంరాజు, శివకుమార్, మహేందర్, గట్టన్న, బాలరాజ్, రమేష్, రాములుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement