విశాఖపట్నం : హోరాహోరీగా సాగిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు తుదిఘట్టానికి చేరుకున్నాయి. గురువారం జరిగే పోలింగ్ కోసం ఓ పక్క అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా మరోపక్క అభ్యర్థులు ఎవరికి వారు చివరి అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డా రు. బరిలో నిలిచిన అభ్యర్థులు తలరాతలు రాసేందుకు పట్టభద్రులు సిద్ధమవుతున్నారు.
వరుసగా రెండుసార్లు పీడీఎఫ్ పాగా
2007లో 20 మంది తలపడగా, 2011లో 31 మంది తలపడ్డారు. ఈ రెండుసార్లు కూడా పీడీఎప్ తరపున బరిలోకి దిగిన ఎంవీఎస్ శర్మ విజయకేతనం ఎగురవేశారు. ఈ రెండుసార్లు కూడా బీజేపీ, టీడీపీలు తమ మద్దుతుదారులను రంగంలోకి దింపి గెలిచేందుకు విఫలయత్నం చేశాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలతోపాటు మేధావుల్లో సైతం పట్టున్న వామపక్షాలు గత రెండు ఎన్నికల్లో ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా లెక్కచేయకుండా సిద్ధాతాలకు కట్టుబడి శర్మను గెలిపించుకున్నారు. ఈసారి శర్మ స్థానంలో మరో సీనియర్ వామపక్ష నాయకుడు అవధానుల అజాశర్మను బరిలోకి దింపారు. ఉద్యోగ, కార్మిక ఉద్యమాల్లో దశాబ్దాల పోరాట చరిత్ర కలిగిన అజాశర్మను పోటీకి దింపడంతో మొదటినుంచే వారి ప్రచారం ఊపందుకుంది. మరో వైపు అజాశర్మకు వైఎస్సార్సీపీ మద్దతు పలకడం మరింత బలం చేకూర్చింది. ఈసారి కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికవర్గాలన్నీ ఐక్యతను చాటేందుకు సన్నద్ధమవుతున్నాయి.
టీడీపీపై వ్యతిరేకతే శాపం
మరోవైపు టీడీపీ–బీజేపీ తమ ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ నేత పీవీఎన్ మాధవ్ను రంగంలోకి దించాయి. గతంలో విడివిడిగా పోటీ చేసి విపలమైన ఈ రెండు పార్టీలు ఈసారి ఉమ్మడిగా పోటీ చేయడం ద్వారా వామపక్షాల చేతుల్లో నుంచి ఈ స్థానాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని శాయశక్తులా ప్రయత్నించాయి. ప్రచారంలో చమటోడ్చాయి. చివరకు కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడుతో సహా ఉత్తరాంద్ర, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన టీడీపీ, బీజేపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా మాధవ్ కోసం అలుపెరగని రతిలో ప్రచారం చేశారు. ఓ పక్క మాధవ్ గెలిస్తే ఎక్కడ తమకు పక్కలో బల్లెంలా తయారవుతాడని ఆందోళన లోలన ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒత్తిడి మేరకు లోపల కత్తులు దూస్తూనే పైకి నవ్వుతూ ఫోటోలకు ఫోజులిస్తూనే ప్రచారం సాగించారు. మరోపక్క మాధవ్కు సొంత పార్టీ నుంచే సెగ తగిలింది.
ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు, ఆ పార్టీ నగరాధ్యక్షుడు నాగేంద్ర, çపృధ్వీరాజ్, రామకోటయ్య వంటి పార్టీ సీనియర్ నాయకులు ప్రచారంలో అంటిముట్టనట్టుగానే వ్యవహరించారు. ఎంపీ కే.హరిబాబు సైతం నామిషన్ సందర్భంలోనూ, కేంద్రమంత్రి వచ్చినప్పుడు తప్ప ఆ తర్వాత కన్పించలేదు. కాగా మాధవ్కు వ్యక్తిగతంగా మంచి పేరున్నా.. టీడీపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, విభజన చట్టంలోని హామీలు అమలుకాకపోవడం గుదిబండగా మారాయి. ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి మంగళవారం రాత్రి అమరావతిలో ఆఫ్ ది రికార్డుగా మాట్లాడుతూ మాధవ్ గెలిచే అవకాశం లేదని అన్నారంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
సవాల్ విసిరన స్వతంత్రుడు
ఇద్దరు బలమైన అభ్యర్థులను సవాల్ చేస్తూ మేధావులు, జర్నలిస్టు సంఘాల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సీనియర్ జర్నలిస్టు వీవీ రమణమూర్తి కూడా విజయంపై ధీమాతోనే ఉన్నారు. కానీ ఈయనకు మద్దతునిస్తున్న జర్నలిస్టు సంఘాలు కానీ, సామాజిక వర్గీయుల్లో కానీ ఎంతమంది ఓటుహక్కు కలిగి ఉన్నారన్నది ప్రశ్నార్థకంగా కన్పిస్తోంది. 2007లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి రెండో స్థానంతో సరిపెట్టుకున్న యడ్ల ఆదిరాజు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించకుంటున్నారు. మిగిలిన 26 మంది పోటీ నామమాత్రమే.
పట్టభద్రుల పీఠం ఎవరిదో?
Published Fri, Mar 10 2017 1:27 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement