ఖమ్మం కార్పొరేషన్, అచ్చంపేట మునిసిపాలిటీలకు కూడా..
♦ నేడు ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ల జారీ
♦ 15 రోజుల్లోనే ఎన్నికల నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 6న గ్రేటర్ వరంగల్, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్లు, మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు పురపాలికల ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్లను ఆదివారమే ప్రకటించనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మార్చి తొలి వారంలో రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే ఈ ఎన్నికలు ముగియనున్నాయి. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఎన్నికలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఆదివారం ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటిస్తే మార్చి 6న పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. పై మూడు పురపాలికల్లోని డివిజన్లు, వార్డులకు రిజర్వేషన్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడమే తరువాయి.
సిద్దిపేటకు తొలగని న్యాయ చిక్కులు
మంత్రి టి.హరీశ్రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట పట్టణానికి సైతం ఇదే విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు చివరి క్షణంలో విఫలమయ్యాయి. సిద్దిపేటలో ఆరు శివారు గ్రామ పంచాయతీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు హైకోర్టును ఆశ్రయించడంతో కొంత కాలంగా ఈ మునిసిపాలిటీ ఎన్నికలపై స్టే అమల్లో ఉంది. స్టే తొలగింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు వేచిచూస్తే ఎన్నికలను బడ్జెట్ సమావేశాల కంటే ముందు నిర్వహించలేమని ప్రభుత్వం భావిస్తోంది. న్యాయ చిక్కులు తొలగిన తర్వాత సిద్దిపేటతో పాటు దుబ్బాక, కొల్లాపూర్, మేడ్చెల్ మునిసిపాలిటీలకు మరో విడతలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి.
గ్రేటర్ వరంగల్ ఎన్నికలు మార్చి 6న!
Published Sun, Feb 21 2016 3:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించాలి
శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలి
అక్రమ కేసులు పెడుతున్నారు..
మూడు నియోజకవర్గాలకు అదనపు ఈవీఎంలు
బడి.. దందా!
పలుచోట్ల వడగళ్లు
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
‘దోస్త్’ సహాయ కేంద్రం ప్రారంభం
ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
మెరుగైన వైద్య సేవలందించాలి●
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement