రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌కు గుడ్లూరు విద్యార్థులు | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌కు గుడ్లూరు విద్యార్థులు

Published Thu, Sep 1 2016 11:43 PM

athletics

గుడ్లూరు : రాష్ట్ర స్థాయిలో విజయవాడలో జరగనున్న అథ్లెటిక్స్‌ పోటీలకు గుడ్లూరు నుంచి నలుగురు క్రీడాకారులు ఎంపికైనట్లు జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం, పీడీలు కమల్‌కుమార్, జీవన్‌లు గురువారం తెలిపారు. జిల్లా స్థాయిలో ఒంగోలులో జరిగిన పోటీల్లో అండర్‌–16లో పూజిత 800,400, జ్యోతి 400,200, ఏసోబు 100,200 మీటర్లు పరుగు పందెలలో మొదటి స్థానాల్లో నిలిచినట్లు పీడీ తెలిపారు. అలాగే అండర్‌–18లో అపర్ణ 100,200 మీటర్లు పరుగు పందెంలో మొదటిస్థానంలో నిలిచిందన్నారు. వీరు ఈ నెల 15,16,17 తేదీల్లో విజయవాడలో జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. హెచ్‌ఎం, పీడీ, ఉపాధ్యాయులు అభినందించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement