Sakshi News home page

'ఆ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది'

Published Sun, Jan 31 2016 1:24 PM

Gurunath reddy takes on JC Diwakar reddy and prabhakar chowdary

అనంతపురం: అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య ఆధిపత్య పోరు సాగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి ఆరోపించారు.

ఈ నేపథ్యంలో తాము తెచ్చిన ప్రాజెక్ట్లను పూర్తి చేయలేని దుస్థితిలో వారున్నారని విమర్శించారు. అవినీతి, అక్రమాలకు అనంతపురం నగరపాలక సంస్థ కేంద్ర బిందువుగా మారిందన్నారు. నగరపాలక సంస్థలో అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమని టీడీపీ నేతలకు గుర్నాథ్రెడ్డి సవాల్ విసిరారు.

Advertisement
Advertisement