ఉత్తమ్, కోమటిరెడ్డి ఎందుకు అడ్డుకుంటున్నారు? | Sakshi
Sakshi News home page

ఉత్తమ్, కోమటిరెడ్డి ఎందుకు అడ్డుకుంటున్నారు?

Published Tue, Jun 28 2016 9:59 AM

gutha sukender reddy takes on T Congress leaders

నల్గొండ : తెలంగాణ న్యాయవాదుల సమస్యలపు వెంటనే పరిష్కరించాలని కేంద్రప్రభుత్వాన్ని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం నల్గొండలో ఎంపీ గుత్తా మాట్లాడుతూ... న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడిని సస్పెండ్ చేయడం బాధకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అంశంలో మరోసారి పునరాలోచన చేయాలని రాష్ట్ర హైకోర్టుకు ఈ సందర్భంగా గుత్తా సూచించారు.

నల్గొండ జిల్లాకు మల్లన్నసాగర్ ప్రాజెక్టు వరప్రదాయని అని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల నల్గొండ జిల్లాకు 2 లక్షల 50 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. తెలంగాణలో ఓ ఎకరా కూడా పారని పులిచింతలకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉత్తమ్, కోమటిరెడ్డిలు మల్లన్నసాగర్ ప్రాజెక్టును ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement