కదిరి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి గురువారం దారిపొడువునా అడుగడుగునా ఆత్మీయ స్వాగతం లభించింది. ఆయన బెంగుళూరు విమానాశ్రయంలో ఉదయం 9 గంటలకు దిగారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంగుండా పులివెందుల వెళ్లేందుకు బయలుదేరారు. జిల్లా పొలిమేరలోకి రాగానే టోల్గేట్ వద్ద వైఎస్సార్సీపీ చిలమత్తూరు కన్వీనర్ సదాశివరెడ్డితో పాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. కోడూరు తోపు సమీపంలో ముద్దప్పల్లి వద్ద పెనుకొండ నియోజకవర్గానికి చెందిన పలువురు రైతులు ఆ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, పార్టీ జిల్లా అధ్యక్షులు అయిన శంకర్నారాయణను వెంటబెట్టుకుని వచ్చి జగన్ను కలిశారు.
‘కియో కార్ల కంపెనీ కోసం ఈ ప్రభుత్వం తమ భూములను బలవంతంగా లాక్కుంటుందని మొరపెట్టుకున్నారు. ఆ కంపెనీకి భూములివ్వడానికి తమకు ఏమాత్రం ఇష్టం లేదని, అయితే బలవంతంగా సేకరిస్తున్నారని వారు ప్రతిపక్ష నేత దృష్టికి తెచ్చారు. కచ్చితంగా మీకు న్యాయం చేస్తామని జగన్ వారికి హామీ ఇచ్చారు. గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లి క్రాస్ వద్ద పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గంపల రామకృష్ణారెడ్డి, మహానేత వైఎస్కు సన్నితుడైన చలివెందుల లక్ష్మీనారాయణరెడ్డి, ఇంకా పలువురు నాయకులు, అభిమానులు, పలువురు మహిళలు జగన్కు ఘన స్వాగతం పలికారు. డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయామని ఓ మహిళ పేర్కొంది.
చంద్రబాబు మోసాలు ఇంకెంతో కాలం సాగవని చెబుతూ వారి నుంచి సెలవు తీసుకున్నారు. తర్వాత మండల కేంద్రం గోరంట్లలో మండల కన్వీనర్ ఫకృద్దీన్, డా.బాషా ఇంకా పలువురు పార్టీ అధినేతను కలిశారు. అక్కడికొచ్చిన జనానికి వాహనమెక్కి జగన్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం ఓడీ చెరువు మీదుగా కదిరి చేరుకున్నారు. జగన్ విచ్చేస్తున్న విషయం ముందే తెలుసుకున్న జనం వేమారెడ్డి కూడలిలో జనం పెద్ద సంఖ్యలో ముందే అక్కడికి చేరుకుని ఘన స్వాగతం పలికారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వజ్రభాస్కర్రెడ్డి, లీగల్సెల్ రాష్ట్ర కార్యదర్శి లింగాల లోకేశ్వరరెడ్డి, పట్టణాధ్యక్షులు బాహవుద్దీన్, కౌన్సిలర్లు, ఇంకా పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జగన్ను కలిశారు. ఆయనతో సెల్ఫీ దిగేందుకు యువకులు చాలామంది ఉత్సాహం కనబరిచారు.
అడుగడుగునా ఆత్మీయ స్వాగతం
Published Thu, Feb 2 2017 11:37 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement