♦ సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమం
♦ ప్రత్యేక హోదాకు పోరాటం
♦ కలకలం రేపిన ‘కోటి’ ఆత్మబలిదానం
ముని కామకోటికి.. ఉద్యమాలే ఊపిరి. సమైక్యాంధ్రే ఆయన కల. కానీ ఆయన కలలు కల్లలయ్యాయి. రాష్ట్రం ముక్కలైపోయింది. ముఖంలో చిరునవ్వు చెదిరిపోయింది. ఒంటరి జీవితం అలవాటైంది. ప్రత్యేక హోదా కోసం పరితపిస్తున్న నేతలను చూసి నవ్వుకునేవాడు. ఈ నేపథ్యంలోనే శనివారం తిరుపతిలో నిర్వహించిన కాంగ్రెస్ పోరు సభకు వెళ్లాడు. నాయకుల ప్రసంగాలు వింటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ‘తెలుగు జాతి విడిపోయింది, సమైక్య ఉద్యమం చేసినా ఫలితం లేకపోయింది.. తెలుగు జాతి వర్ధిల్లాలి.. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలి..’ అంటూ కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
.
తిరుపతి సిటీ : నగరంలోని మంచాలవీధికి చెందిన కోటి(మునికామకోటి) ఉద్యమ నేత. ఉమ్మడి రాష్ట్రం కోసం ఆరాటపడ్డారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో తనదైన శైలిలో ఆందోళనలు నిర్వహించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నగర నేతగా, తాతయ్యగుంట గంగమ్మ ఆలయ కమిటీ సభ్యునిగా పనిచేశారు. మబ్బు చెంగారెడ్డికి విధేయుడిగా ఉండేవారు. రాష్ర్టం విడిపోయినప్పటి నుంచి స్నేహితులతో, స్థానికులతో కలివిడిగా ఉండడం మానుకున్నాడు. ఎప్పుడూ ముభావంగా ఉండేవాడు.
పెళ్లైనా.. ఒంటరిగానే..
వడమాలపేటకు చెందిన యువతిని 12 సంవత్సరాల కిందట బీఎంకె.కోటి వివాహం చేసుకున్నాడు. రెండేళ్ల పాటు వారి కాపురం సజావుగా సాగింది. వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో పదేళ్ల క్రితం విడిపోయారు. కోటి తండ్రి మునిరామయ్య, తల్లి ఇటీవల మృతిచెందారు. అప్పట్నుంచి మంచాల వీధిలో నివాసముంటున్న కోటి తన తమ్ముడు లగేజీ ఆటో డ్రైవర్ మురళి ఇంట్లోనే ఉంటున్నాడు.
ఇటీవల ఆరు నెలల కిందట తమ్ముడి ఇంట్లో ఉండడం ఇష్టంలేక అదే వీధిలో ఒక గదిని అద్దెకు తీసుకుని ఒంటరిగా జీవిస్తున్నాడు. మూడు నెలలుగా సోదరుడు మురళికి సహాయకుడిగా ఆటో నడిపేందుకు వెళుతుండేవాడు. శనివారం కాంగ్రెస్ పోరు సభకు వెళ్లాడు. సభ మధ్యలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ప్రత్యేక హోదా సాధించాలి.. అంటూ నిప్పంటించుకున్నాడు.
రాష్ట్రం విడిపోకూడదనే..
ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం విడిపోకూడదని చేపట్టిన సమైక్యాంధ్ర ఉద్యమాలు, ఆందోళన కార్యక్రమాల్లో మబ్బు చెంగారెడ్డితో పాటే కోటి చురుగ్గా పాల్గొనేవాడు. గతంలో కాంగ్రెస్ పార్టీ నగర ఉపాధ్యక్షుడిగా పనిచేసినట్లు స్నేహితులు చెబుతున్నారు. రాష్ట్రం విడిపోకూడదని నిరాహార దీక్ష చేశాడు. మంచాల వీధిలోని స్థానికులకు ఏ సమస్య వచ్చినా స్పందిచేవాడు. ఆ వీధిలోని వారందరితో కలసిపోయి తలలో నాలుకలా ఉండేవాడు.
రెండు మూడు రోజులుగా బంధువులు, స్నేహితులతో సరిగ్గా మాట్లాడేవాడు కాదు. రాష్ట్రం విడిపోయినా.. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా దక్కలేదని కుమిలిపోయేవాడు. ప్రత్యేక హోదా విషయమై స్థానికులతో ఎప్పుడూ చర్చిస్తుండేవాడు.
కాపాడబోయి..
కోటితోపాటు మంచాల వీధికే చెందిన శేషాద్రి శనివారం కాంగ్రెస్ పోరు సభకు వెళ్లారు. తన వీధికి చెందిన కోటి మంటల్లో కాలిపోవడం చూసి తట్టుకోలేకపోయాడు. కాపాడాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే కోటిని పట్టుకుని మంటలు ఆర్పబోయి గాయపడ్డాడు.
కన్నీళ్లు..ఆర్తనాదాలు
కోటి ప్రాణాలు కోల్పోయాడని తెలిసిన వెంటనే సోదరుడు మురళి, అతని భార్య కన్నీటిపర్యంతమయ్యారు. ఆర్తనాదాలు మిన్నంటాయి. స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు.
Related news
-
వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకును చీల్చడమే షర్మిల లక్ష్యం
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు చీల్చి, చంద్రబాబుకు మేలు చేకూర్చడమే లక్ష్యంగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు స్పష్టమైంది. పాడేరులో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి వంతల సుబ్బారావును విరమింపజేయడానికి షర్మిల చేసిన ప్రయత్నం షర్మిల ఎల్లో రాజకీయాన్ని తేటతెల్లం చేసింది. వైఎస్సార్సీపీ ఓట్లు కోసమే బుల్లిబాబుకి టికెట్ ఇచ్చామంటూ సుబ్బారావుతో షర్మిల మాట్లాడిన ఆడియో లీకవడంతో అడ్డంగా దొరికిపోయారు.పాడేరు కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల తొలుత వంతల సుబ్బారావును ఎంపిక చేశారు. ఇటీవల పాడేరులో జరిగిన సభలో కూడా సుబ్బారావే అభ్యర్థి అని ప్రకటించారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీ నుంచి బుల్లిబాబు కాంగ్రెస్లోకి రావడంతో షర్మిల ప్లేటు ఫిరాయించారు. సుబ్బారావును కాదని బుల్లిబాబుకు టికెట్ ఇచ్చారు. దీంతో వంతల సుబ్బారావు రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. దీంతో షర్మిల సుబ్బారావుతో ఫోన్లో మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చేందుకే బుల్లిబాబుకి టికెట్ ఇస్తున్నామనీ.. పోటీ నుంచి తప్పుకోవాలని కోరారు. రెబల్గా బరిలో ఉంటే పార్టీలోకి మళ్లీ రాలేరంటూ హెచ్చరించారు. మీ సభలకంటే నా సభలకే జనాలు ఎక్కువ మంది వస్తున్నారంటూ సుబ్బారావు కూడా ఘాటుగా సమాధానమిచ్చారు. సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్న ఆడియోలో ఏముందంటే..షర్మిల: నమస్తే అన్నా.. ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదన్నా. నెక్ట్స్ టైమ్ తప్పకుండా ఆపర్చ్యూనిటీ ఇస్తాం. పార్టీలో సముచితమైన స్థానం, గౌరవమిస్తాను. మీరు నా సొంత అన్న లెక్క అన్నా. అర్థం చేసుకోకపోతే ఎలా అన్నా. నేనైతే మీకియ్యాలనే అనుకున్నానన్నా. కానీ రఘువీరారెడ్డి గారు ఆల్రెడీ అరకు సీపీఎంకు ఇచ్చేశారు. ఈ సీటు బల్లిబాబుకు ఇమ్మన్నారు. మీకు అన్నీ తెలిసి మేమేదో డబ్బుల కోసమో.. నా టీమ్ ఏదో డబ్బుల కోసమో బుల్లిబాబుకి ఇచ్చామని ప్రచారం చెయ్యడం కూడా కరెక్ట్ కాదు కదా మీరు. అది వాస్తవం కాదు కదా అన్నా..సుబ్బారావు: నేనేమీ ప్రచారం చెయ్యలేదు. నేనైతే ఎక్కడా మీ గురించి కానీ, పార్టీ గురించి కానీ ప్రచారం చెయ్యలేదు.షర్మిల: సరే అన్నా.. ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదు. మీరు రెబల్ కావద్దు. నెక్ట్స్టైమ్ తప్పకుండా అవకాశం ఉంటుంది. కమ్ బ్యాక్.సుబ్బారావు: ఇంత అన్యాయం ఏంటి మేడం. ఏ రోజూ జెండా మోయని వాడికీ, పార్టీలో లేనివాడికీ ఇచ్చెయ్యడం వల్ల నాకు బాధ ఉంది. మరొక్క విషయం.. మీరు వేలాది మంది జనం ముందు ప్రకటన చెయ్యకపోయినా బాగుండేది. మీరు ప్రకటన చెయ్యడం వల్ల నేను డిసప్పాయింట్ అయ్యాను. మా వాళ్లు కూడా ఫీలయ్యారు.షర్మిల: అన్నా.. మీకు అన్నీ తెలుసు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు ముఖ్యం, మనకు వైసీపీ ఓటు బ్యాంకు కూడా ముఖ్యము. రెండూ కలిసొస్తాయనే కదా తీసుకుంది. నేను తీసుకుంది ఎందుకు? వైసీపీ ఓటు బ్యాంకు కోసమే కదా.సుబ్బారావు: నేనిప్పుడు చూశాను.. మీరు మాట్లాడింది, మీరు ప్రచారం చేసింది. మొన్న నా జనాల్ని చూస్తే.. మీకంటే ఐదు రెట్లు ఎక్కువ మంది వచ్చారు. రూపాయి ఖర్చు పెట్టకుండా. వీడియోలు పెట్టమంటే పెడతాను. చూడండి. నేను ఓటు బ్యాంకు ఉన్నవాడిని. కానీ.. గ్రౌండ్ లెవల్లో రిపోర్ట్ లేదు అని అన్నారు. నా రిపోర్ట్ ఏంటో ఎవరికెన్ని ఓట్లు వస్తాయో చూడండి. నేను కాంగ్రెస్లోనే ఉంటాను.షర్మిల: అన్నా.. మీరు ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఇంక కాంగ్రెస్ పార్టీ గురించి మర్చిపోండి.సుబ్బారావు: మర్చిపోవాలంటే.. మర్చిపోతానిక.షర్మిల: మర్చిపోండి.. మీకు ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది. మళ్లీ కుటుంబంలోకి రావడానికి. మీరు రెబల్గా పోటీ చేసినాక, కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేసినాక మళ్లా మీరు కాంగ్రెస్లోకి రాలేరు.సుబ్బారావు: నా భవిష్యత్తే డ్యామేజ్ అయ్యింది. నాకింకేముంది మరి.షర్మిల: అదే అన్నా.. ఇప్పుడు ఆలోచించుకోండి. మళ్లీ మీకు కాంగ్రెస్ పార్టీ అవసరము అని వెనక్కొస్తే మీకిక్కడ స్థానం ఉండదు.సుబ్బారావు: మంచిదే కదా. -
నల్లమల నాయకుడెవరు?
సాక్షి, నాగర్కర్నూల్: ఓవైపు నల్లమల అభయారణ్యం, మరోవైపు కృష్ణానది పరీవాహక ప్రాంతాన్ని పెనవేసుకొని ఉన్న నాగర్కర్నూల్ ఎంపీ సెగ్మెంట్లో ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన నాగర్కర్నూల్పై పట్టు సాధించేందుకు మూడు ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ బలమైన అభ్యర్థులను బరిలో నిలిపాయి. కాంగ్రెస్ నుంచి మల్లురవి, బీజేపీ నుంచి పోతుగంటి భరత్ప్రసాద్, బీఆర్ఎస్ తరఫున ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ పోటీలో ఉన్నారు. . 1952, 1957లలో ద్విసభ్య నియోజకవర్గంగా ఉండగా, 1962లో నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గంగా ఏర్పడింది. 8 సార్లు కాంగ్రెస్, ఐదుసార్లు టీడీపీ, ఒక్కోసారి తెలంగాణ ప్రజాసమితి, బీఆర్ఎస్ గెలిచాయి. 4.5 లక్షలకు పైగా ఉన్న ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఈ స్థానంలో గెలుపోటములపై ప్రభావం చూపనున్నారు. వీరిలో అగ్రభాగం మాదిగ సామాజికవర్గానికి చెందినవారే. ఈ ఎన్నికల్లో వారి ఓట్లే కీలకం కానున్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బీఆర్ఎస్సిట్టింగ్ స్థానంపై బీఆర్ఎస్ పట్టు సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు బీఆర్ఎస్ శ్రమిస్తోంది. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను రంగంలోకి దింపి తమ అభ్యర్థి గెలుపునకు వ్యూ హాత్మకంగా అడుగులు వేస్తోంది. నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని అలంపూర్కే చెందిన తాను విద్యావంతుడిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని, ఒకసారి తనకు అవకాశం కల్పించాలని ఆర్ఎస్.ప్రవీణ్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలకుగానూ 12స్థానాల్లో కాంగ్రెస్ గెలి చింది. అలంపూర్, గద్వాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోగా, ఈ రెండు నియోజకవర్గాలు నాగర్కర్నూల్ ఎంపీ పరిధిలోనే ఉన్నాయి. గత లోక్సభ ఎన్నికల ఫలితాలను పునరావృతం చేసి పట్టు నిలుపుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. పోతుగంటి భరత్ప్రసాద్ బీజేపీబలం పెంచుకున్న బీజేపీ.. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఈ స్థానంలో 13.03 శాతం ఓట్లను మాత్రమే సాధించింది. బీజేపీ అభ్యర్థి బంగారు శ్రుతికి 1,29,021 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్కు చెందిన సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములును తమ పార్టీలోకి చేర్చుకున్న బీజేపీ, ఆయన కొడుకుభరత్ప్రసాద్కు పార్టీ అభ్యర్థిత్వాన్ని కేటాయించింది. నియోజకవర్గంలోని కల్వకుర్తి, నాగర్క ర్నూల్, కొల్లాపూర్ మీదుగా ఏపీలోని నంద్యాల వరకు జాతీయ రహదారి నిర్మా ణం పనులు ఇప్పటికే మొదలయ్యాయి. రహదారి నిర్మాణ పను లు తమ పార్టీకి అనుకూలంగా మారుతుందని బీజేపీ ఆశిస్తోంది. ఇతర పార్టీల నేతలను చేర్చుకొని బ లాన్ని పెంచుకున్న బీజేపీ మోదీ చరిష్మాతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృతంగా ప్రచా రం నిర్వహించి ఈ స్థానంలో పాగా వేసేందుకు పట్టుదలతో ఉంది. మల్లు రవి కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్ ఇప్పటివరకు ఎనిమిదిసార్లు గెలిచింది. ప్రస్తుత ఎంపీ అభ్యర్థి మల్లు రవి 1991, 1998 ఎన్నికల్లో ఇక్కడి నుంచే రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. చివరిసారిగా 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నంది ఎల్లయ్య ఇక్కడి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఈసారి ఎన్నికల్లో తమ అభ్యర్థిగా మల్లు రవిని మరోసారి బరిలోకి దింపిన కాంగ్రెస్ గెలుపుపై ఆశలు పెట్టుకుంది. సీఎం రేవంత్రెడ్డి స్వస్థలం నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి కాగా, నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం ఆయన సొంత నియోజకవర్గం కావడంతో ఈ స్థానంలో కాంగ్రెస్ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇవీ ప్రభావితం చూపే అంశాలుసాగునీటి కోసం చేపట్టిన పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసి నీరందించాలన్న డిమాండ్ ఉంది. పరిశ్రమలు స్థాపించి స్థానికంగా ఉన్న వారికి ఉపాధి కల్పించాలి.గద్వాల నుంచి ఏపీలోని మాచర్ల వరకు నూతన రైల్వేలేన్ ప్రతిపాదనలకు 20 ఏళ్లుగా మోక్షం కలగడం లేదు. నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గవ్యాప్తంగా ఇప్పటికీ విద్యారంగంలో వెనుకబాటే కన్పిస్తోంది. కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటు ఇప్పటికీ కలగానే మారింది. నల్లమలలోని చెంచులు, గిరిజనులకు ఉపాధి అవకాశాలు లేవు. వీరి జీవనోపాధికి పరిశ్రమలు స్థాపించాలన్న డిమాండ్ నెరవేరడం లేదు.నల్లమల అటవీప్రాంతం, కృష్ణాతీర ప్రాంతాలు ఉన్నా పర్యా టకంగా అభివృద్ధి లేదు. పర్యాటకాభివృద్ధి ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలన్న డిమాండ్ ఉంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు వచ్చిన ఓట్లుటీఆర్ఎస్: పోతుగంటి రాములుఓట్లు: 4,99,672 – 50.48 శాతంకాంగ్రెస్: మల్లు రవిఓట్లు: 3,09,924 – 31.31 శాతంబీజేపీ: బంగారు శ్రుతిఓట్లు: 1,29,021 – 13.03 శాతం -
Lok sabha elections 2024: సీట్లు రెండే... పోటీ సయ్యారే !
సాగర తీర పర్యాటకానికి ప్రపంచవ్యాప్తంగా పేరొందిన గోవాలో రాజకీయాలు అనిశి్చతిమయం. నేతల పార్టీ ఫిరాయింపులు ఇక్కడ పరిపాటి. దేశానికి 1947లోనే స్వాతంత్య్రం వచి్చనా గోవా మాత్రం 1961 దాకా పోర్చుగీసు పాలనలో ఉంది. కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగి 1987లో రాష్ట్ర హోదా పొందింది. దేశంలోనే అతి చిన్న రాష్ట్రమైనా కొత్త కూటములు, కొత్త పార్టీలు, పదేపదే సీఎంల మార్పుకు మారుపేరుగా మారింది. కొందరు రెండు మూడు విడతలు పాలించగా, మరికొందరు నెల రోజులు కూడా సీఎంగా కొనసాగలేదు. ఇక్కడ పోరు జాతీయ పార్టీల చుట్టూనే తిరుగుతున్నా ప్రాంతీయ పారీ్టలూ చక్రం తిప్పుతున్నాయి... గోవాలో రెండు లోక్సభ సీట్లే ఉన్నా ఈ రాష్ట్రాన్ని పారీ్టలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గతంలో కాంగ్రెస్కు బాగా పట్టున్న ఈ రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ ఆధిపత్యం నడుస్తోంది. 2014 లోక్సభ ఎన్నికల్లో కాషాయదళం ఇక్కడి రెండు సీట్లనూ దక్కించుకుని సత్తా చాటింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అతి పెద్ద పారీ్టగా నిలిచినా బీజేపీ నాటకీయంగా అధికారం దక్కించుకుంది. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ), కొత్తగా పుట్టుకొచ్చిన గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్పీ), కాంగ్రెస్ నుంచి జంప్ చేసిన ఎమ్మెల్యే మద్దతుతో మనోహర్ పారికర్ సీఎంగా పగ్గాలు చేపట్టారు. 2019లో పారికర్ మరణానంతరం ప్రమోద్ సావంత్ సీఎం అయ్యారు. తర్వాత కూడా బీజేపీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేల వలస కొనసాగింది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ చెరో సీటు దక్కించుకున్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకైక పెద్ద పారీ్టగా నిలిచిన బీజేపీ ప్రాంతీయ పారీ్టలతో కలిసి అధికారాన్ని నిలబెట్టుకుంది. కాంగ్రెస్లో ముసలం పుట్టి 11 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు బీజేపీలోకి జంప్ చేశారు. ఉత్తర గోవా లోక్సభ స్థానం బీజేపీకి, దక్షిణ గోవా కాంగ్రెస్కు కంచుకోటలుగా మారాయి. లోకల్ ఎఫెక్ట్ ‘ఇండియా’ కూటమి దన్నుతో కాంగ్రెస్ బరిలోకి దిగింది. రెండు సీట్లలోనూ పోటీ చేస్తోంది. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత, నిరుద్యోగం, ధరల పెరుగుదల తదితరాలను ప్రచారాస్త్రాలుగా సంధిస్తోంది. బీజేపీ మోదీ, అభివృద్ధి, అయోధ్య రామ మందిరం, హిందుత్వ నినాదాలతో బరిలోకి దిగుతోంది. సౌత్ గోవాలో బీజేపీ నుంచి పల్లవి డెంపో, కాంగ్రెస్ నుంచి మాజీ నేవీ అధికారి విరియాటో ఫెర్నాండెజ్ పోటీ చేస్తున్నారు. ఉత్తర గోవాలో సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున రమాకాంత్ ఖలప్ తలపడుతున్నారు. ఇండియా కూటమి భాగస్వామి గోవా ఫార్వర్డ్ పార్టీ కాంగ్రెస్కు దన్నుగా ఉంది. ఎంజీపీ వంటి పారీ్టలు కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరి అవకాశాలకు గండి కొడతాయనేది ఆసక్తికరంగా మారింది.సర్వేలు ఏమంటున్నాయి... గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా కాంగ్రెస్, బీజేపీ చెరో సీటు గెలుచుకోవచ్చని మెజారిటీ సర్వేలు అంచనా వేస్తున్నాయి.ఈవీఎంలపై అనుమానాలు రేకెత్తించిన కాంగ్రెస్కు సుప్రీంకోర్టు తాజా తీర్పు చెంపపెట్టు. ప్రజలకు ఆ పార్టీ క్షమాపణ చెప్పాలి. అభివృద్ధికి పెద్దపీట వేసి, ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న ఎన్డీఏ కూటమి ఒకవైపు... అవినీతి, వారసత్వ రాజకీయాలు, సొంత ప్రయోజనాలే పరమావధిగా ఉన్న ఇండియా కూటమి మరోవైపున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలను గోవా సంతృప్త స్థాయిలో అమలు చేస్తోంది. నిజమైన సెక్యులరిజం, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలుస్తోంది. – గోవా ఎన్నికల సభలో ప్రధాని మోదీఅధికారంలోకి వస్తే గోవాలో మైనింగ్ కార్యకలాపాలను మూడు నెలల్లో ప్రారంభిస్తామని 2014లో మోదీ హామీ ఇచ్చారు. దాన్ని నెరవేర్చనందుకు గోవా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నదుల అనుసంధానం పేరుతో మా నదులపై కేంద్రం పెత్తనం చేస్తోంది. వాటి పేర్లు మార్చేస్తోంది. గోవా గుర్తింపు, సంస్కృతిని నావనం చేస్తోంది. – ఎన్నికల ర్యాలీలో గోవా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అమిత్ పాట్కర్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
తప్పుడు ప్రచారంతో బురదచల్లే ప్రయత్నం
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎన్ని దాడులు చేసినా, తప్పుడు ప్రచారాలతో బురదజల్లే ప్రయత్నం చేసినా, మాకు కవచం తెలంగాణ ప్రజలే. నరేంద్రమోదీ నాయకత్వం పట్ల తెలంగాణ ప్రజలకు అభిమానం ఉంది. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణగడ్డపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను పాతరేయడం ఖాయం’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. బుధవా రం పార్టీ కార్యాలయంలో వరంగల్ తూర్పు నియోజకవ ర్గానికి చెందిన బీఆర్ఎస్ కార్పొరేటర్ కల్పన, డివిజన్ అధ్యక్షులు, ఇతర నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లా డారు.‘బీజేపీ, బీఆర్ఎస్ వ్యవహారాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. రాహుల్గాంధీ నాయకత్వం అవసరం లేదని ప్రజలు తిరస్కరిస్తున్నారు. మోదీ మాత్రమే సమగ్రమైన, సుస్థిర మైన, సమర్థవంతమైన పాలన ఇవ్వగలరనే ఉద్దేశంతో తెలంగాణవ్యాప్తంగా ప్రజలంతా ఆదరిస్తున్నారు. దీంతో, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బెంబేలెత్తిపోయి బీజేపీపై ముప్పేట దాడికి ప్రయత్నిస్తున్నాయి. ఓటుకు నోట్లు కేసులో బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్కు సపోర్ట్ చేసినట్టుగానే.. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవి నీతి కేసుల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తోంది.బీజేపీని గెలవనీయొద్దనే దుర్మార్గపు ఆలోచనతో కాంగ్రెస్–బీఆర్ఎస్ డూ ప్ ఫైట్ చేస్తున్నాయి. బీఆర్ఎస్–కాంగ్రెస్ రాజకీయ డ్రామా కార్య క్రమాలు సమాంతరంగా నడుస్తున్నాయి. వారంరోజులుగా సీఎం వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరంగా ఉంది. పూర్తిగా అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న రేవంత్రెడ్డి నిజస్వరూపాన్ని రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటున్నారు. ఎన్నికల వేళ తలపై గాడిద గుడ్డు పెట్టుకొని ఊరేగుతున్నడు. ఆ గుడ్లు తలపై పెట్టుకొని 5 నెలల పాలనలో తాను ప్రజలకిచ్చే ది ఇదేనంటూ ప్రజలకు వివ రిస్తున్నడు. ఆస్థాయికి దిగజా రిండు. ఎన్నికలకు వెళ్లేటప్పు డు ఏ పార్టీ అయినా ప్రజలకు చేసిన పనులు చేయాల్సిన పనులను వివరిస్తుంది. కానీ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను గాలికొది లేసింది. మళ్లీ ఆగస్టు 15న రుణమాఫీ అంటూ ఊదరగొడుతున్నా రు. మిగతా గ్యారంటీల గురించి మాట్లాడటం లేదు’ అని కిషన్రెడ్డి మండిపడ్డారు.కాంగ్రెస్ది దిగజారుడుతనం‘రాష్ట్రంలో మోదీ, బీజేపీకి ఆదరణ, మద్దతు పెరుగుతోంది. దీనిని తట్టుకోలేక మార్ఫింగ్ వీడియోలతో బీజేపీపై బురదజల్లుతూ కాంగ్రెస్ అత్యంత దిగజారుడు చర్యలకు పాల్పడటం సిగ్గుచేటు. టెలిఫోన్ ట్యాపింగ్తోపాటు హోంమంత్రి వీడియో మార్ఫింగ్ అంశాలు రెండు నేరమే. రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్ అబద్ధా లు చెబుతుంటే, హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ ఫేక్ వీడియోలు సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిదే. ఈ విషయంలో మొదటి ముద్దాయి సీఎం. మార్ఫింగ్ వీడియోలు సృష్టించిన వారిలో ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తేలేదు. అందులో ఏ వ్యక్తి ప్రమేయమున్నా జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదు. రేవంత్రెడ్డికి దమ్మూధైర్యం ఉంటే పదేళ్ల యూపీఏ హయాంలో, తొమ్మి దిన్నరేళ్ల మోదీ ప్రభుత్వ పాలనలో తెలంగాణకు ఎన్ని నిధులిచ్చా రనే దానిపై చర్చకు సిద్ధం కావాలి. ప్రెస్క్లబ్లో లేదా తెలంగాణ అమరవీరుల స్థూపంలేదా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం..ఏ చోటనైనా రేవంత్రెడ్డితో చర్చకు నేను సిద్ధం. గాడిద గుడ్లు నెత్తిన పెట్టుకోవడం కాదు.. తెలంగాణకు ఇచ్చిన నిధులపై చర్చకు రావాలి’ అని కిషన్రెడ్డి డిమాండ్ చేశారు.రేవంత్రెడ్డి.. ఏరోజైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవా..? ‘పార్లమెంటు ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తామంటూ మాట్లాడిన రేవంత్రెడ్డి.. ఈరోజు తన కాళ్లకింద భూమి కదిలిపోతుంటే ఏమీ చేయలేని స్థితిలో రోజుకో విధంగా మాట్లాడుతున్నాడు. గుజరాత్ పెత్తనానికి.. తెలంగాణ పౌరుషానికి పోటీ అని రేవంత్రెడ్డి అంటున్నడు. రేవంత్రెడ్డి అసలు ఏరోజైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవా? టీడీపీలో ఉండి ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి రేవంత్రెడ్డి. ఇక్కడుండే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ బీజేపీ పౌరుషం చాలు. మీ ఇటలీ పౌరుషానికి, అవినీతి పౌరుషానికి వ్యతిరేకంగా తెలంగాణ బీజేపీ పౌరుషం చాలు. గుజరాత్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏనే ఇటలీది. ఐఎన్సీ అంటేనే ఇటలీ నేషనల్ కాంగ్రెస్. ఒకరికొకరం తోడు అంటూ కేసీఆర్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ బీజేపీపై దుష్ప్రచారం చేస్తోంది. తెలంగాణ ప్రజల సొమ్మును కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ బాసులకు తాకట్టు పెడుతున్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో ఢిల్లీకి సూట్ కేసులు పంపుతున్నరు’ అని కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. -
బీజేపీ, బీఆర్ఎస్ను డకౌట్ చేస్తాం
సాక్షిప్రతినిధి,కరీంనగర్/శేరిలింగంపల్లి/ మూసాపేట: మే 13న తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్లను డకౌట్ చేస్తామని ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి అన్నారు. శేరిలింగంపల్లి తారానగర్లోని తుల్జాభవానీ మాత ఆల యం ముందున్న ప్రధానరోడ్డులో బుధ వారం రాత్రి కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 3న సెమీ ఫైనల్ క్రికెట్ మ్యాచ్లో బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ను తొడగొట్టి చిత్తు చేసి ఓడించాం..మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని చిత్తు చేయడం ఖాయమని చెప్పా రు. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డిని లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. పదేళ్ల కాలంలో ప్రధాని మోదీ ఇచ్చింది ఏమీ లేదని.. ఏపీకి పాచి పోయిన రెండు లడ్లు, కర్ణాటకకు చెంబు, తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారని విమ ర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఐటీఐఆర్ ప్రకటించిందని, ఐఐఎం, ఐఐటీ, సెంట్రల్ యూనివర్సిటీ, ఐటీ సంస్థలు, ఫార్మా కంపెనీల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. సునీతారెడ్డికి ఓటు వేస్తే నాకు వేసినట్టే మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి పట్నం సునీతా∙మహేందర్రెడ్డికి వేసే ప్రతి ఓటు తనకు వేసి నట్టే అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. కూక ట్పల్లి నియోజకవర్గపరిధిలోని మూసాపేట లో జరిగిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ఎంపీగా సునీతమ్మను గెలిపిస్తే తనను గెలిపించినట్టే అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ దొర పాలనను తుంగలో తొక్కి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చారని చెప్పారు. అర్ధరాత్రి పోలీసులతో తలుపులు కొట్టించి అరెస్టు చేయించి కొడంగల్లో ఓడించాడని, సోనియమ్మ ఆశీస్సులతో మల్కాజ్గిరి ఎంపీగా నిలబడితే ఇక్కడి ప్రజలే ప్రశ్నించే గొంతుక ఉండాలని తనను గెలిపించారని చెప్పారు. దేశాన్ని కార్పొరేట్లకు అమ్మే కుట్ర..రాజ్యాంగాన్ని మార్చి, దళితులు, బీసీల రిజర్వేషన్లు తొలగించి మొత్తం దేశాన్నే అంబానీ, అదానీలాంటి కార్పొరేట్ కంపెనీలకు అమ్మేసే కుట్ర జరుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. బుధవారం మధ్యా హ్నం జగిత్యాల జిల్లా కోరుట్లలో నిజామా బాద్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డికి మద్దతుగా ‘కోరుట్ల జనజాతర’ పేరిట ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని బీజేపీ, ప్రధాని మోదీ విధానాలపై విరుచుకుపడ్డారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు తదితరులు పాల్గొన్న ఈ సభలో రేవంత్ ఏమన్నారంటే.. ‘ముందుగా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్, ఆటో రిక్షా కార్మికులు, సకల జనుల సమ్మెలో పోరాడితేనే తెలంగాణ కల సాకారమైంది. ఈసారి దేశంలో జరుగుతున్న ఎన్నికలు ఆషామాషీ కావు. 400 సీట్లు గెలవడం ద్వారా రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయి. ఈడీ, సీబీఐ తరహాలో ఢిల్లీ పోలీసులతో కేసులు పెట్టిస్తే నేను, కాంగ్రెస్ కార్యకర్తలు భయపడం. ఇలాగే పదేళ్లు కేసులు పెట్టి కాంగ్రెస్ కార్యకర్తలను వేధించిన కేసీఆర్ను మొన్న ఎన్నికల్లో ప్రజలు నడుం విరగ్గొట్టి మూలకు కూర్చోబెట్టారు. కొమురంభీం, చాకలి ఐలమ్మలు పుట్టిన గడ్డ అని మర్చిపోవద్దు. ఇక్కడ ప్రజలను అణచాలని చూసిన నిజాం, రజాకార్లకు ఏం గతిపట్టిందో తెలుసుకుంటే బీజేపీకే మంచిది’ అని వ్యాఖ్యానించారు.75 ఏళ్లు అవుతున్నా మార్పురాలేదు ‘అంబేడ్కర్లాంటి మహనీయుల చొరవతో సమాజంలో వెనకబడ్డ దళితులు, బీసీల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు కల్పించింది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా దళిత, గిరిజన, బలహీన వర్గాల జీవితాల్లో పూర్తిస్థాయిలో మార్పు రాలేదు. 150 రోజులు 4000 కి.మీ భారత్ జోడో పేరిట పాదయాత్ర చేసిన సమయంలో బలహీనవర్గాలకు చెందిన డాక్టర్లు, ఇంజినీర్లు ఇతర మేధావులు రాహుల్గాంధీని కలిసి ఈ దేశంలో 52శాతం ఉన్న తమకు జనాభా దామాషా ప్రకారం రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించాలని కోరారు. ఇచ్చిన మాట ప్రకారం బీసీ గణనకు కేబినెట్ తీర్మానం చేశాం. ఉమ్మడి రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా కాంగ్రెస్దే.మామిడి పరిశోధన కేంద్రం మంజూరు చేస్తాజీవన్రెడ్డి.. 43 ఏళ్లుగా ఆరుసార్లు ఎమ్మెల్యే, మంత్రి, ఎమ్మెల్సీగా నిర్వ హించిన ప్రతీ పదవికీ వన్నె తెచ్చారు. జగిత్యాలకు జీవన్రెడ్డి అడిగిన మామి డి పరిశోధన కేంద్రాన్ని నేను మంజూ రు చేస్తా, కానీ, కోరుట్ల, జగిత్యాలలో ఆయనకు లక్ష మెజారిటీ ఇవ్వాలి’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
Related News by category
-
‘ఆరణి’ అక్రమాలు..!
చిత్తూరు అర్బన్ : ప్రజలకు చిత్తశుద్ధితో సేవ చేయాల్సిన పదవిని ‘ఆరణి’ తన స్వార్థానికి వినియోగించుకున్నారు. వందల ఎకరాల ప్రభుత్వ భూమిని చెరపట్టారు. ఆయన అడుగు జాడల్లోనే వారి అన్న కుమారుడు సైతం భూ దందాలు చేస్తూ రూ.కోట్లకు పడగెత్తాడు. వీరి ఆగడాలను అడ్డుకోవడం ఎవరి తరం కాలేదు. చిత్తూరు ‘శ్రీనివాసుడి’ అక్రమాలు ఓవైపు .. అబ్బాయ్ క్రిమినల్ ఆలోచనలు చూసి ప్రజలు ‘శివ’ శివా..! అనుకుంటున్నారు. వీళ్లకు ప్రభుత్వ భూములా...? ప్రైవేటు భూములా అనే తేడాలేదు. తమకు నచ్చిదంటే కబ్జాచేసి కంచెలు వేసేస్తారు. చిత్తూరు బాబాయ్ ‘ఆరణి’.. అబ్బాయ్ ‘శివ’ అవినీతి పర్వంలో కొన్ని.. ఫోర్జరీ మాయలు..! ● కరోనా సమయంలో చిత్తూరు మార్కెట్గేటు తన బినామీల పేరిట సొంతం చేసుకున్న ‘ఆరణి’.. చిన్నా,చితకా వ్యాపారుల ముక్కుపిండి రూ.కోట్లు వసూలు చేశారు. అయినప్పటికీ కరోనా సమయంలో తాము ఆశించిన నగదు వసూలు కాలేదని, ఈ మొత్తాన్ని మాఫీ చేయాలని అధికారులను అడ్డుపెట్టుకుని కౌన్సిల్లో తీర్మానం చేయించారు. ఫలితంగా కార్పొరేషన్ ఖజానాకు రూ.52 లక్షల నష్టం వాటిల్లింది. ● బూత్బంగ్లాను తలపించే శ్రీఆరణిశ్రీ ఇంట్లో, తన కంపెనీల్లో పనిచేయడానికి కొత్త స్కెచ్ వేశారు. తమ వద్ద పనిచేసే 27 మందిని మున్సిపల్ కార్పొరేషన్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా చేర్పించారు. సొంత పనులకు వీళ్లను వాడుకుని, కార్పొరేషన్ నుంచి నెలకు రూ.18 వేల చొప్పున వేతనాలు ఇచ్చేలా చక్రం తిప్పారు. ఇలా 27 మందికి 58 నెలల పాటు రూ.2.81 కోట్లను వేతనాల రూపంలో కొల్లగొట్టారు. ● ఇక 2017లో బెంగళూరు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఓ టెండర్లో పాల్గొనేందుకు ‘ఆరణి’ కంపెనీకి ఏదైనా కార్పొరేషన్లో రూ.వంద కోట్లకు పనులు చేసినట్లు ద్రువీకరణ పత్రం కావాల్సి వచ్చింది. దీనికోసం చిత్తూరులోని ఇరువారం నుంచి గంగినేనిచెరువు వరకు కాలువ పనులు, చెరువుకట్టపై అభివృద్ధి పనులను చేసినట్లు ఓ సర్టిఫికెట్ను బెంగళూరు మహానగర పాలక (బీబీఎంపీ) అధికారులకు అందజేశారు. రూ.280 కోట్ల విలువైన ఈ పనుల్లో తాము తొలివిడతగా రూ.19.35 కోట్ల పనులు పూర్తి చేసినట్లు, దీనికి చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ బిల్లులు కూడా ఇచ్చేసిందని అందులో పేర్కొన్నారు. చిత్తూరు మున్సిపల్ కమిషనర్, ఇంజినీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ సంతకాలను ఫోర్జరీ చేసి బీబీఎంపీ టెండర్లలో పాల్గొన్నారు. బెంగళూరు అధికారులకు అనుమానం వచ్చి, దీనిపై చిత్తూరు మున్సిపల్ అధికారులకు లేఖ రాశారు. దీన్ని శ్రీఆరణిశ్రీ తొక్కిపెట్టడంతో ఏకంగా బీబీఎంపీ అధికారులు చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయానికి నేరుగా వచ్చి ఇక్కడి అధికారులను సంప్రదించారు. ధ్రువీకరణ పత్రంలోని సంతకాలు తమవి కాదని, అవి ఫోర్జరీ సంతకాలని తేల్చిచెప్పారు. దీంతో ‘ఆరణి’ కంపెనీపై బీబీఎంపీ అనర్హత వేటువేసింది. అయితే ఇది ఎవరి కంటాపడకుండా ‘ఆరణి’ వాస్తవాలను తొక్కపెట్టేశారు. ఇన్నాళ్లకు పాపం పండడంతో నిజం వెలుగుచూసింది. ● చిత్తూరు మండలంలో ‘ఆరణి’ చేసిన ఇసుక దందా అంతా ఇంతాకాదు. తన కంపెనీకు చెందిన భారీ యంత్రాలతో యథేచ్ఛగా ఇసుకను తవ్వేసి ఇతర ప్రాంతాలకు తరలించి అమ్మేశారు. ఇలా మూడేళ్ల పాటు సుమారు రూ.3.24 కోట్ల విలువైన ఇసుక అక్రమాలకు పాల్పడ్డారు. భూ బకాసురుడు..! చిత్తూరులో ఆరణి చేసిన భూ దందాలనే ఆదర్శంగా తీసుకున్న శివ అక్రమాలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. చిత్తూరు భూ బకాసురుడిగా పేరుతెచ్చుకున్న తన బాబాయ్ ‘ఆరణి’ చేసిన అక్రమాల్లో శివ తనవంతు పాత్రను పోషించాడు. గుడిపాల మండలంలోని పానాటూరు వద్ద 22 ఎకరాల ప్రభుత్వ భూమిని తన బంధువుల పేరిట పట్టా ఇప్పించుకున్నాడు. దీనికి ప్రస్తుతం గేటు ఏర్పాటుచేసి పంటలు పండిస్తున్నారు. చిత్తూరు–బెంగళూరు బైపాస్ రోడ్డులో సీతమ్స్ కళాశాల సమీపంలో 74–తిమ్మసముద్రం రెవెన్యూ భూముల వద్ద ఓ అనామకుడి నుంచి రూ.కోటి విలువ చేసే భూములను బలవంతంగా లాక్కున్నారు. అసలు పట్టాదారులపై దౌర్జన్యం చేసి మరీ 2,800 అడుగుల భూమిని కబ్జా చేశారు. భూమికి సొంతవాళ్లు ఏర్పాటు చేసుకున్న ఫెన్సింగ్ను తొలగించి కొత్తగా కూసాలను నాటించేశారు. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని తన అడ్డాగా మార్చుకున్న ‘ఆరణి’ అన్నకొడుకు.. ఉద్యోగుల సంఘ గౌరవాధ్యక్షుడిగా తనుకు తానే ఓ పదవిని సృష్టించుకున్నాడు. పట్టణ ప్రణాళిక విభాగం నుంచి రూ.5 లక్షలు, రెవెన్యూ విభాగం నుంచి రూ.2 లక్షలు, ప్రజారోగ్య విభాగం నుంచి రూ.50 వేలు చొప్పున ప్రతీ నెలా మున్సిపల్ అధికారుల నుంచి మామూళ్లను ముక్కుపిండి మరీ వసూలు చేశాడు. ఇన్ని అక్రమాలుచేసిన ‘ఆరణి’ తన అన్నకొడుకుతో కలిసి తిరుపతికి మకాం మార్చారు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీచేస్తున్న ‘ఆరణి’ గురించి నిజాలు తెలిసిన తిరుపతి వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇంతటి ఘనుడిని అందలం ఎక్కిస్తే తిరుమల శ్రీనివాసుడికే నామాలు పెట్టడం ఖాయమని భయపడుతున్నట్లు సమాచారం. అవినీతిలో బాబాయ్.. అబ్బాయ్ పోటాపోటీ ఇసుక దందాలో రూ.3 కోట్లకు పైగా స్వాహా తమ సిబ్బందికి సైతం ప్రభుత్వ ఖజానా నుంచి రూ.2.81 కోట్ల వేతనాలు కోవిడ్ కాలంలో మార్కెట్ గేటుకు రూ.52లక్షల ఎగవేత పోర్టరజీ సంతకాలతో టెండర్ల భాగోతం చిత్తూరును సాంతం దిగమింగి.. తిరుపతికి పాకిన అనకొండలు ప్రజాధనానికి జవాబుదారీగా వ్యవహరించాల్సిన ఎమ్మెల్యే అయినప్పటికీ ఎక్కడ అవకాశముంటే అక్కడ అవినీతికి తెరతీసేస్తారు.. కంచే చేను మేసినట్టు ఖాళీ భూమి కనిపిస్తే కబ్జా చేసేస్తారు.. అధికారుల సంతకాలను పోర్జరీ చేసి ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టేస్తారు.. బాబాయ్ పదవిని అడ్డుపెట్టుకుని అబ్బాయ్ అక్రమాలకు పాల్పడతారు.. అన్న కుమారుడి క్రిమినల్ ఆలోచనలను సదరు ప్రజాప్రతినిధి తూచా తప్పకుండా అమలు చేసేస్తారు.. జేబులోని రూపాయి తీయరు.. యథేచ్ఛగా ఊరి మీద పడి దోచుకున్నారు.. ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేశారు.. చివరకు చిత్తూరును సాంతం దిగమింగేశారు.. తమ అక్రమా ర్జనను కొనసాగించేందుకు కొత్తగా తిరుపతిని ఎంచుకున్నారు. దీంతో తిరునగరి వాసులు అప్రమత్తంగా ఉండాలని బాధితులు హెచ్చరిస్తున్నారు. -
సంక్షేమ పాలనను ఆశీర్వదించండి
పెద్దపంజాణి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పాలనను ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని ఎంపీ అభ్యర్థి రెడ్డెప్ప కోరారు. సోమవారం మండలంలోని మాదనపల్లెలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రెడ్డెప్ప మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించిన జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వేకువనే సామాజిక పింఛన్లు అందాలన్నా.. పేద బిడ్డలకు ఉన్నత చదువులు అందుబాటులోకి రావాలన్నా.. పేదలకు ఖరీదైన వైద్యం అందాలన్నా రెండు ఓట్లను ఫ్యాను గుర్తుపై వేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేగా వెంకటేగౌడను, ఎంపీగా తను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డెప్ప, పార్టీ మండల కన్వీనర్ బాగా రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు సుష్మకీర్తి, వైస్ ఎంపీపీలు జీడీ బాబు, ఆంజమ్మ తదితరులు పాల్గొన్నారు. -
Kuppam: బాబుకు ఓటమి భయం!
కుప్పం కోటపై చంద్రబాబుకు నమ్మకం సడలుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి భయం వెంటాడుతోంది. ఇన్నేళ్లుగా మోసిన జనం ఇప్పుడు ముఖం చాటేస్తుండడంపై ఆందోళన పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే టీడీపీ అధినేతకు తెలుగు తమ్ముళ్ల సమర్థతపై అనుమానం మొదలైంది. అందుకే ఇతర ప్రాంతాల నుంచి సొంత మనుషులను కుప్పానికి తరలిస్తున్నారు. ఎలక్షన్ మేనేజర్ల పేరిట నేతల ఇళ్లలో తిష్ట వేయిస్తున్నారు. ప్రచారం నుంచి తాయిలాల పంపిణీ వరకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేలా చర్యలు చేపడుతున్నారు. బాబు వ్యవహారిశైలికపై స్థానిక నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన తమను విశ్వసించకుండా బయటి వారిని తెచ్చిపెట్టడంపై లోలోపల రగిలిపోతున్నారు. శాంతిపురం : కుప్పం నియోజకవర్గంలోని టీడీపీ నాయకులను నమ్మకుండా ప్రకాశం జిల్లా నుంచి తన సామాజికి వర్గానికి చెందిన కంచెర్ల శ్రీకాంత్కు చంద్రబాబు పెద్దపీట వేశారు. నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఎన్నికల వేళ సైతం గ్రామ స్థాయిలోని పార్టీ కార్యకర్తలు, నాయకులపై కూడా అపనమ్మకంతో సొంత మనుషులతో నిఘా ఏర్పాట్లు చేస్తున్నారు. వంద మంది మేనేజర్లు కుప్పంలో ఎన్నికల పర్యవేక్షణకు బయటి ప్రాంతాల నుంచి తన సొంత మనుషులు వందమందిని చంద్రబాబు మోహరిస్తున్నట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ప్రతి 3 పోలింగ్ కేంద్రాలకు ఒకరి చొప్పున ఎలక్షన్ మేనేజర్ల పేరుతో ఇక్కడికి తీసుకువస్తున్నారు. బెంగళూరులోని టీడీపీ ఐటీ ఫోరమ్ ద్వారా బెంగళూరు, హైదరాబాదులో గుర్తించిన దాదాపు వంద మందిని తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం కుప్పానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి దాదాపుగా రోజూ బెంగళూరు–కుప్పం మద్య చక్కర్లు కొడుతున్నారు. ఆయా మేనేజర్లు తమ పోలింగ్ కేంద్రాల పరిధిలోని టీడీపీ నాయకుల బంధువులుగా చెప్పుకుని వారి ఇళ్లలోనే బస చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా వచ్చే వారి బసకు ఇబ్బంది లేకుండా వసతులు ఉన్న నాయకుల ఇళ్లను ఇప్పటికే గుర్తించారు. ఈ నెల 26 నుంచి మే 12వ తేదీ రాత్రి వరకూ బయటి వ్యక్తులు స్థానికంగా మకాం వేసి పార్టీ వ్యవహారాలను నడపనున్నారు. ప్రచారం సాగాల్సిన తీరును పర్యవేక్షిస్తూ కింది స్థాయి నాయకులు, కార్యకర్తలను వారు సమన్వయం చేయనున్నారు. తమపై పరిశీలకుల కన్ను ఉంటే పార్టీ క్యాడర్ రాజీ పడకుండా పనిచేస్తారని ఈ ఏర్పాటుకు చంద్రబాబు ఆలోచన చేసినట్లు తెలిసింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు జరిపే పంపకాలు కూడా వీరి ద్వారానే నిర్వహించి, పోలింగ్ ముందు రోజు రాత్రి వారంతా స్వస్థలాలకు వెళ్లి ఓటు వేసేలా వ్యూహరచన చేసుకున్నారు. కానీ ఇంత కాలం పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసిన తమను ఎన్నికల వేళ నమ్మకుండా అవమానిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు కుమిలిపోతున్నారు. అలవి కాని హామీలు ఇచ్చి, వాటిని అమలు చేయకపోగా కాలకేయుల్లాంటి నాయకులను ప్రోత్సహించిన తమ అధినేత, ఇప్పుడు తమను చేతకాని వాళ్లుగా నిలబెడుతున్నారని ఓ సీనియర్ కార్యకర్త వాపోయారు. చివరకు ఎన్నికలకు ముందే చంద్రబాబు ఓటమి భయం రుచిచూస్తున్నారని వెల్లడించారు. తగ్గిన జనాదరణ కుప్పం నుంచి తొలుత 1989 ఎన్నికల్లో చంద్రబాబు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పుడు 52.65 శాతం ఓట్లు సాధించారు. తర్వాత ప్రత్యర్థి పార్టీల నాయకులను ప్రలోభ పెట్టి తన దారికి తెచుకోవడం ద్వారా నియోజకవర్గంపై క్రమంగా పట్టు బిగించారు. 1994లో గరిష్టంగా 75.49 శాతం ఓట్లు సాధించారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రస్థానం ప్రారంభమైన తర్వాత కుప్పంలో కూడా బాబు ప్రభ తగ్గడం మొదలైంది. 2014లో 62.59 శాతం ఓట్లు రాగా, 2019లో 55.18 శాతం ఓట్లు మాత్రమే సాధించారు. అనంతరం వివక్ష లేని సుపరిపాలనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అశేష ప్రజాదరణ సొంతం చేసుకున్నారు. కుప్పం ప్రజల మనసును గెలుచుకున్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం ప్రజలు సైతం వైఎస్సార్సీపీకే జైకొట్టారు. దీంతో అసలు సంగతి చంద్రబాబుకు బోధపడింది. ఇక కల్లబొల్లి కబుర్లును కుప్పం వాసులు నమ్మరని అర్థమైంది. అందుకే తరచూ కుప్పంలో పర్యటనలు ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో సైతం తన సతీమణి నారా భువనేశ్వరి చేతులమీదుగా నామినేషన్ వేయించారు. ఆమె కూడా కుప్పంలోనే మూడు రోజులపాటు తిష్ట వేసి నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. -
పుంగనూరులో నల్లారి ప్లాప్ షో
● కూటమి అభ్యర్థుల సభకు జనం కరువు ● తెలుగుదేశం నేతల కోడ్ ఉల్లంఘన ● బాణసంచా హోరు ● జనాలకు మద్యంగంటల కొద్దీ జనం కోసం.. టీడీపీ అభ్యర్థి చల్లాబాబు బాలాజీ థియేటర్ వద్ద నుంచి పట్టణంలోని ప్రధాన రహదారి ఎంబీటీ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు నానాతంటాలు పడ్డారు. పలువురు శాపనార్థాలు పెట్టడం కనిపించింది. ర్యాలీకి జనం రాకపోవడంతో ముందుగా బాణసంచా భారీ ఎత్తున కాల్చారు. అలాగే డీజే పాటలు, డ్యాన్స్లతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగించారు. ర్యాలీకి వచ్చిన అద్దె జనానికి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద షామియానాలు వేసి భోజనాలు ఏర్పాటు చేశారు. మండుటెండలో తాగునీరు లేక, భోజనం రుచిగా లేకపోవడంతో ప్రజలు తినకుండా అక్కడే పడేసి వెళ్లడం కనిపించింది.పుంగనూరు: కూటమి అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారు. సోమవారం రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి, పుంగనూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లారామచంద్రారెడ్డి పట్టణంలోని గోకుల్ సర్కిల్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. బాణసంచా పెద్ద ఎత్తున కాల్చా రు. డీజేపాటలు పెట్టి డ్యాన్సులు చేశారు. మద్యాన్ని విచ్చలవిడిగా తాగించారు. ఆపై భోజనం రుచిగా లేదంటూ అద్దెజనం అక్కడి నుంచి వెళ్లిపోయారు. కట్టుకథల కిరణ్ కూటమి అభ్యర్థుల సభ జనం లేక వెలవెలబోయింది. తొలుత చల్లా రామచంద్రారెడ్డి ప్రసంగిస్తుండగా జనం వెళ్లి పోతుండడంతో కిరణ్కుమార్రెడ్డి మైకు అందుకుని మాట్లాడారు. మంత్రి పెద్దిరెడ్డిపై ఆయన పలు విమర్శలు చేశారు. పాల దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై పలువురు విస్మయం వ్యక్తం చేశారు. ఇదేంటి కిరణ్ ఇలా మాట్లాడుతున్నారంటూ గుసగుసలాడడం కనిపించింది. రూ.300, క్వార్టర్ అద్దె జనానికి భారీగా నగదు, మద్యం పంపిణీ చేసినట్టు ఆయా పార్టీల కార్యకర్తలే చెబుతున్నారు. ఒక్కొక్కరికి రూ.300, క్వార్టర్ బాటిల్, బిరియానీ అందజేశారు. మద్యం షాపుల వద్ద టీడీపీ జెండాలు చేతబట్టిన కార్యకర్తలు కిక్కిరిసిపోయారు. -
వైఎస్సార్సీపీలోకి వలసల వెల్లువ
జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి పెద్దసంఖ్యలో నేతలు, కార్యకర్తలు చేరారు.వైఎస్సార్సీపీ గెలుపు తథ్యం పెనుమూరు మండలంలో ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మితో కలిసి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం ప్రచారం చేపట్టారు.మంగళవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2024ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలు ఉత్తమ ఫలితాలను అందించాయి.. విద్యావ్యవస్థలో తీసుకువచ్చిన మార్పులు పిల్లల భవిష్యత్కు బంగారు బాటలు వేశాయి.. సర్కారు బడుల్లో కల్పించిన సౌకర్యాలు విద్యార్థులు ప్రశాంతంగా చదువుకునే వెసులుబాటు కల్పించాయి.. ప్రభుత్వ చిత్తశుద్ధిని పదో తరగతి ఫలితాలు రుజువు చేశాయి. సరైన ప్రోత్సాహం అందిస్తే పేద బిడ్డలు సైతం కార్పొరేట్కు ధీటుగా మార్కులు సాధించగలరని చాటి చెప్పారు. జిల్లాను రాష్ట్రంలోనే ఆరో స్థానంలో నిలబెట్టారు. ప్రైవేటు స్కూళ్ల కంటే అత్యుత్తమంగా రాణించి సత్తా చూపించారు.జిల్లాలో పదో తరగతి ఫలితాలు విడుదల చేస్తున్న డీఈఓ దేవరాజుప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించినవారు● బైరెడ్డిపల్లె మండలంలోని ఏపీరెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థి సి.తన్మయి 592 మార్కులు సాధించి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ● సదుం మండలంలోని బీసీ వెల్ఫేర్ పాఠశాలలో చదివిన మణి, రామకుప్పం మండలం విజలాపురం జెడ్పీ హైస్కూల్లో చదివిన అఫ్షాన్ 589 మార్కులు సాధించి రెండో స్థానం దక్కించుకున్నారు. ● చిత్తూరులోని కణ్ణన్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని సంతోషి, కార్వేటినగరంలోని ప్రభుత్వ పాఠశాలకు చెంది న యశ్వంత్, బైరెడ్డిపల్లె మండలం కమ్మనపల్లె మోడ ల్ స్కూల్ విద్యార్థిని మంజుల, గుడుపల్లె మండలం సోదిగానిపల్లె జెడ్పీ పాఠశాల విద్యార్థిని కావ్యశ్రీ, ఐరా ల మండలం ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థిని బిందుసా యి, బైరెడ్డిపల్లి మండలం కడపనత్తం జెడ్పీ హైస్కూల్ విద్యార్థి కిరణ్కుమార్ 587 మార్కులు సాధించారు.మెరుగైన ఫలితాలు ప్రైవేట్, కార్పొరేట్ బడులకు ధీటుగా జిల్లాలో సర్కారు బడుల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఎవ్వరికీ తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారు. ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నారు. ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, డీవైఈఓలు, ఎంఈఓల సమష్టి కృషితోనే ఇది సాధ్యమైంది. – దేవరాజు, డీఈఓ, చిత్తూరు మెరుగైన విద్య మాది నగరి మున్సి పాలిటీ సత్రవాడ, మా ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన మెరుగు పడింది. నేతపై ఆధారపడి జీవించే కుటుంబం మాది. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనే మా కుమార్తె కార్తీకను చదివించాం. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఈ బడిలో వసతులను కల్పించారు. నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. పాఠ్యపుస్తకాలు, బ్యాగు, విద్యా సామగ్రి అంతా ప్రభుత్వమే ఇస్తోంది. పదోతరగతికి ప్రత్యేక తరగతులు తీసుకొని బోధించారు. దీంతో మా కుమార్తె అత్యుత్తమ ప్రతిభను కనబరచింది. 580 మార్కులు సాధించి మండలంలో మొదటి స్థానంలో నిలిచింది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. – జగన్నాథన్, సుమిత సత్తా చాటిన కవలలు మా నాన్న సుధాకర్ బంగారు షాపులో పని చేస్తూంటారు. అమ్మ స్వప్న గృహిణి. మాది మధ్య తరగతి కుటుంబం. మేము కవల పిల్లలం. ఐరాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివాం. బీణసాయికి 565 మార్కులు వచ్చాయి. మా ఇద్దరి కల సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావాలనుంది. 587 మార్కులతో ప్రభుత్వ పాఠశాలల విభాగంలో మండల టాపర్గా నిలిచా. మా స్కూల్ ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు ప్రభుత్వం కల్పించిన వసతులను ఉపయోగించుకుని ఈ మార్కులు సాధించాం. అమ్మ ఒడి పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించడంతో బాగా చదువుకున్నాం. – బిందు సాయి, బీణ సాయి, ఐరాల వందశాతం ఉత్తీర్ణత పదోతరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడం గర్వంగా ఉందని స్థానిక ఏంజేపీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందని, వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ఎప్పటికప్పుడు వారి సామర్థ్యాలు మెరుగు పరి చేలా చర్యలు తీసుకోవడమే ఉత్తమ ఫలితాలకు కారణమైందని వివరించారు. – శ్రీనివాసులురెడ్డి నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణపుంగనూరు : జిల్లాలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్పీ మణికంఠ తెలిపారు. సోమవారం పట్టణంలో నామినేషన్ల కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. ఆర్ఓ కేంద్రాన్ని తనిఖీ చేశారు. టీడీపీ ర్యాలీ సందర్భంగా ట్రాఫిక్ ఇక్కట్లను స్వయంగా తొలగించి, రాకపోకలను క్రమబద్ధీకరించారు. అనంతరం విలేకర్లతో ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పుంగనూరులో ప్రత్యేక దళాల బందోబస్తు నడుమ పోలింగ్ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. అనుమానితులు, రౌడీ షీటర్లు, తీవ్రమైన నేర చరిత్ర గలవారిని బైండోవర్ చేశామన్నారు. ఎన్నికలలో సామాన్యులు ధైర్యంగా ఓటు వేసేలా అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. సమావేశంలో ఏఆర్ఓ నరసింహప్రసాద్ పాల్గొన్నారు. ఎన్నికలకు వేతనంతో కూడిన సెలవుచిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో కార్మికులుగా పనిచేస్తున్న కర్ణాటక ఓటర్లకు ఈ నెల 26 , మే 7వ తేదీన సెలవు ఇవ్వాలని జిల్లా కార్మికశాఖాధికారి ఓంకార్రావు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ కర్ణాటకలో రెండు దశలుగా లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నందున ఆయా రోజుల్లో కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలన్నారు. ఈ మేరకు కార్మిక కమిషనర్ శేషగిరిబాబు, జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే మే 13వ తేదీన రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా దుకాణాలు, వివిధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు సైతం వేతనం కూడిన సెలవు మంజూరు చేయాలని ఆదేశించారు. సంబంధిత యజమానులు ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాతోపాటు శిక్షార్హులవుతారని స్పష్టం చేశారు. ఏనుగుల దాడిలో పంటల ధ్వంసం రామకుప్పం: మండలంలోని ఎస్.గొల్లపల్లె సమీపంలో పంటపొలాలపై ఏనుగుల గుంపు ఆదివారం రాత్రి దాడి చేసింది. పలువరు రైతులకు చెందిన వేరుశనగ, బీన్స్, రాగి, అరటి పంటలతోపాటు గంట్లప్ప అనే రైతుకు చెందిన డ్రిప్ పరికరాలను నాశనం చేసింది. ఇప్పటికై నా అటవీ అధికారులు స్పందించి ఏనుగులను కట్టడి చేయాలని బాధితులు కోరారు.చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సర్కారు బడులు ఉత్తమ ఫలితాలు సాధించాయి. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా రాష్ట్ర స్థాయిలో 6వ స్థానంలో నిలిచింది. ప్రైవేట్ యాజమాన్యాలను అధిగమించి ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు ఉత్తమంగా రాణించారు. గత టీడీపీ పాలనలో కార్పొరేట్ వ్యవస్థకు రెడ్ కార్పెట్ వేయడంతో ప్రైవేట్ స్కూళ్లతే ఆధిపత్యం ఉండేది. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మారులు తీసుకువచ్చింది. సర్కారు ప్రోత్సాహాన్ని విద్యార్థులు అందిపుచ్చుకుని అద్భుతంగా ఫలితాలు సాధించారు. ప్రైవేట్ వెనుక ‘బడి’..! జిల్లా వ్యాప్తంగా ఈ విద్యాసంవత్సరంలో అన్ని యాజమాన్యాల నుంచి 20,399 మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 19,113 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పది ఫలితాల్లో ప్రైవేట్ బడులు వెనుకబడ్డాయి. జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ బడులలో 4,756 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే జిల్లా వ్యాప్తంగా వివిధ యాజమాన్యాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాల నుంచి పది పరీక్షలు రాసిన విద్యార్థుల్లో 14,357 మంది ఉత్తీర్ణత సాధించారు 17 నుంచి ఆరోస్థానంలోకి పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో చిత్తూరు జిల్లా ఆరో స్థానంలో నిలిచింది. సోమవారం రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ పది ఫలితాలను విడుదల చేశారు. అనంతరం జిల్లా ఫలితాలను డీఈఓ కార్యాలయంలో డీఈఓ దేవరాజు విడుదల చేసి వివరాలు వెల్లడించారు. గత ఏడాది జిల్లా రాష్ట్రంలో 17వ స్థానంలో నిలవగా, ప్రస్తుతం 6 స్థానం దక్కించుకున్నట్లు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే 20.27 శాతం ఫలితాలు పెరగడం విశేషం. బాలికలదే హవా పది పరీక్షలకు 10,793 మంది బాలురు హాజరుకాగా 9596 మంది ఉత్తీర్ణత చెందారు. అలాగే 10,146 మంది బాలికలు పరీక్షలు రాయగా 9517 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 88.91 శాతం, బాలికలు 93.8 మొత్తం 91.28 ఉత్తీర్ణత శాతం నమోదైంది. మొదటి డివిజన్లో 15,463 మంది జిల్లావ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో 15,463 మంది మొదటి డివిజన్లో ఉత్తీర్ణత సాధించారు. రెండో డివిజన్లో 2593 మంది, మూడో డివిజన్లో 1057 మంది మొత్తం 19,113 మంది ఉత్తమ ఫలితాలు సాధించారు. కేజీబీవీ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు జిల్లా వ్యాప్తంగా కేజీబీవీ పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం అధునాతనంగా తీర్చిదిద్దింది. ఈ పాఠశాలల్లో చదువుతున్న బాలికల చదువుకు పేదరికం ఏ మాత్రం అడ్డుకాకుడదని సకల సౌకర్యాలనుకల్పించింది. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకున్న బాలికలు పది ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత శాతం సాధించారు. జిల్లాలోని 8 కేజీబీవీ పాఠశాలల్లో 5 బడులు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. రామకుప్పం కేజీబీవీలో చదివిన నేత్ర 600 మార్కులకు 569, గుడుపల్లె కేజీబీవీలో పుష్పలత 565, బైరెడ్డిపల్లి, శాంతిపురం కేజీబీవీల్లోని మాధవి, మహేశ్వరి 552 మార్కులను సాధించి శభాష్ అనిపించుకున్నారు. – 8లో– 8లో– 8లోన్యూస్రీల్ పదోతరగతి ఉత్తీర్ణతలో జిల్లాకు 6వ స్థానం 20,939 మందికి గాను 19,113 మంది పాస్ సత్తా చాటిన సర్కారు బడుల విద్యార్థులు 93.80శాతంతో పైచేయి సాధించిన బాలికలు ప్రైవేట్ స్కూళ్లలో 4,756 మంది.. ప్రభుత్వ పాఠశాలల్లో 14,357 మంది ఉత్తీర్ణులు కేటగిరీ ఫస్ట్క్లాస్లో ఉత్తీర్ణులు పాస్ అయినవారు ఉత్తీర్ణత శాతం ఎయిడెడ్ 139 194 95.57 బీసీ వెల్ఫేర్ 116 121 100.00 ప్రభుత్వ 708 1078 79.38 కేజీబీవీ 258 290 95.71 మున్సిపల్ 423 630 78.36 ఆదర్శ పాఠశాలలు 430 458 98.49 ప్రైవేట్ స్కూళ్లు 4,439 4,756 97.40 ఏపీ రెసిడెన్షియల్ 111 112 100.00 ఏపీ సోషల్వెల్ఫేర్ 442 472 98.74 ఏపీ ట్రైబల్వెల్ఫేర్ 61 82 91.11 జిల్లా పరిషత్ 8,336 10,920 88.39 మొత్తం 15,463 19,113 90.28 మే 24 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పదోవ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి జూన్ 3 వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 23 నుంచి 30 వ తేదీ లోగా అపరాధ రుసుం లేకుండా సంబంధిత పాఠశాలల హెచ్ఎంలకు పరీక్ష ఫీజు చెల్లించాలి. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ అప్లికేషన్లను www.bse. ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రీ కౌంటింగ్ కు దరఖాస్తు చేసుకునే వారు ఒక్కో సబ్జెక్టుకు రూ.500, రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకునే వారు సబ్జెక్టుకు రూ.1000 చొప్పున సీఎఫ్ఎంఎస్ చలానా ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు నేతపై ఆధారపడి జీవించే కుటుంబం కావడంతో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనే మా కుమారుడు సంతోష్ను చదివించాం. అయితే విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాఠశాల మెరుగుపడింది. టాయిలెట్లు, తాగునీటి సౌకర్యం, ప్రతి గదికి వెలుతురు, గాలి బాగా ఉందేలా లైట్లు, ఫ్యాన్లు అమర్చారు. గ్రీన్ బోర్డు పెట్టారు. ప్రైవేటు పాఠశాల కంటే ప్రభుత్వ బడి మెరుగుపడింది. మా కుమారుడు మంచి పాఠశాలలో చదువుతున్నాడన్న ఆనందం మాకూ కలిగింది. ప్రస్తుతం పదవ తరగతి పరీక్షల్లో 600 మార్కులకు 577 మార్కులు సాధించి మండలంలో రెండవ స్థానంలో నిలిచాడు. మాకు ఎంతో ఆనందంగా ఉంది. – బాలాజీ, హేమావతి అందరూ శభాష్ అంటున్నారు ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలంటే అందరికీ చులకనగా ఉండేది. నేడు ఆ పరిస్థితి లేదు. పాఠశాలలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద పెట్టడంతో అవి కూడా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మారిపోయాయి. ఇక్కడే మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారు. ఇంగ్లిషు మీడియం అందుబాటులో ఉంది. ఇంగ్లిష్ ల్యాబ్ ఉంది. చదువుతో పాటు ఆడుకునేందుకు కూడా పరికరాలు అందిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఆరోగ్యంగా చదువుకుంటున్నారు. ఇలాగే మా కుమారుడు తమిళ్సెల్వన్ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే బాగా చదువుకుని 577 మార్కులు సాధించి మండలంలో రెండో స్థానంలో నిలిచాడు. అందరూ శబాష్ అంటున్నారు. మాకు గర్వంగా ఉంది. – విశ్వనాథన్, తేన్మొళివసతి గృహాల్లో 88.41 శాతం జిల్లా వ్యాప్తంగా 37 సాంఘిక సంక్షేమ వసతి గృహాలున్నాయి. ఇక్కడి విద్యార్థులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించింది. ఈ వసతి గృహాల నుంచి 302 మంది విద్యార్థులు పది పరీక్షలు రాశారు. ఇందులో 267 మంది పరీక్షలు ఉత్తీర్ణత పొందారు. 88.41 శాతం ఉత్తీర్ణతతో సత్తీ చాటారు.
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
Lok sabha elections 2024: బారామతి నుంచి మెయిన్పురి దాకా...హోరాహోరీ
బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దే..: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
Photos
View allVideo
View allతప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement