♦ వర్షాల ధాటికి భారీగా దెబ్బతిన్న పంటలు
♦ రైతన్నలకు రూ.వందల కోట్ల నష్టం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రైతులకు రూ.వందల కోట్ల నష్టం వాటిల్లింది. రహదారులు దెబ్బతినడంతో రోడ్లు, భవనాల శాఖ రూ.కోట్లలో నష్టపోయింది. వైఎస్సార్ జిల్లాలో పంటలు, రోడ్డు దెబ్బతినడంలో రూ.20 కోట్లకుపైగా నష్టం సంభవించినట్లు అంచనా.
కుండపోత వర్షాలతో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అతలాకుతలమైంది. జిల్లాలో విద్యుదాఘాతానికి గురై ముగ్గురు, వరదలో కొట్టుకుపోయి ఇద్దరు మృతి చెందారు. 500 గొర్రెలు, మేకలు నీటిలో గల్లంతయ్యాయి. వరదలో చిక్కుకున్న నలుగురు వ్యక్తులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి చొరవతో క్షేమంగా బయటపడ్డారు. చిట్వేలు-రాపూరు మధ్యలో బుధవారం రాజుబండి చెరువుకు గండిపడటంతో ట్రాన్స్కో సీఈ నంద కుమార్ ప్రయాణిస్తున్న వాహనం కొట్టుకుపోయింది. ఆయనతోపాటు డ్రైవర్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వర్షాల ధాటికి వైఎస్సార్ జిల్లాలో ఆరుతడి, ఉద్యాన పంటలకు రూ.10 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు రూ.10 కోట్ల నష్టం వాటిల్లింది. అనంతపురం జిల్లాలో వేరుశనగ దెబ్బతింది.
చిత్తూరు జిల్లాలో ఏడుగురు బలి: చిత్తూరు జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షాల ధాటికి ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా ఏడుగురు మరణించారు.
పంట నష్టం వివరాలు సేకరించండి :సీఎం
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల కలిగిన పంట నష్టంపై త్వరగా నివేదికలు పంపాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఆయన ఉండవల్లిలోని తన నివాసంలో బుధవారం నెల్లూరు, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాల వల్ల కలిగిన పంట నష్టం, ఉపశమన చర్యలపై ఆరా తీశారు.
కన్నీరే మిగిలింది!
Published Fri, Nov 13 2015 2:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement