కరువులో రైతులను ఆదుకోవాలి | Sakshi
Sakshi News home page

కరువులో రైతులను ఆదుకోవాలి

Published Fri, Jul 29 2016 1:01 AM

Help Formers

 వంగూరు: తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల కరువులో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలని సీపీఐ డివిజన్‌ కార్యదర్శి డాక్టర్‌ శ్రీనివాసులు అన్నారు. గురువారం ఆయన చారగొండలో విలేకరులతో మాట్లాడుతూ రైతులు అనేక ఇబ్బందులు  పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రకారం రుణమాఫీని పూర్తి స్థాయిలో వర్తింపచేయాలని, గతేడాది నష్టపోయిన రైతులకు పంటనష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో రైతాంగ సమస్యలపై త్వరలో ఉద్యమ కార్యాచరణకు సిద్ధం కానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు సాయిలు, శంకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement