వేల్పూరు (తణుకు) : ఖమ్మంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు వైఎస్సార్ సీపీ బాసటగా నిలిచింది. ఆ కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటామని వైఎస్సార్ సీపీ నేతలు ధైర్యం చెప్పారు. ఈ ప్రమాదంలో మరణించిన తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన కొప్పాడ జ్ఞానసుందర్సాయి కుటుంబాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం పరామర్శించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు పరామర్శించారు. సాయి తల్లి మంగామణి, సోదరి తేజశ్రీలను ఓదార్చారు. తమ వంతుగా రూ.50వేల సాయం అందజేశారు. సుందర్సాయి ఉద్యోగం సంపాదించి వచ్చిన మొదటి జీతం తీసుకుని తల్లి వద్దకు వచ్చే క్రమంలో ఈ ఘోరం జరగడం కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తాము వచ్చామని, సాయి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సుమంత్సాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ములగాల శ్రీనివాసు, గౌరవాధ్యక్షుడు ఎస్.ఎస్.రెడ్డి, నాయకులు బలగం సీతారాం, నార్గన సత్యనారాయణ, బోడపాటి వీర్రాజు, గుణ్ణం నారాయణరావు, ఆకుల సోమరాజు, మాసిన నరేంద్ర, కర్రి కాశీరెడ్డి, బూసి వినీత, పెన్మత్స రామరాజు, గుర్రాల నాగేంద్ర, రెడ్డి భగవాన్లు, గుణ్ణం వెంకటరామన్న, చుండ్రు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
బాధితులకు బాసటగా..
Published Thu, Aug 25 2016 1:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement