- జీఎస్టీకి వ్యతిరేకంగా మూతపడిన హోటళ్లు
- ఇబ్బందులు పడ్డ జనం
అనంతపురం కల్చరల్ : జీఎస్టీ విధానాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా హోటళ్ల నిర్వాహకులు మంగళవారం నిరసన తెలిపారు. సౌత్ ఇండియా హోటల్స్ అసోసియేషన్ పిలుపుమేరకు రెస్టారెంట్లు, డాబాలు, హోటళ్లు, వాటికి అనుబంధంగా ఉన్న లాడ్జీలు దాదాపు 80 వేల వరకు మూతపడ్డాయి. జీఎస్టీ విధానం అమలులోకి వస్తే తాము తీవ్రంగా నష్టపోతాయని, ఇతర రాష్ట్రాలలోని పన్ను విధానం మంచిది కాదని పలువురు హోటల్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. జిల్లా హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంజీ రాజు నేతృత్వంలో నగరవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. విపరీతంగా పెంచిన పన్ను విధానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీఎస్టీ (గూడ్స్ సర్వీస్ టాక్స్) ప్రకారం జూలై 1 నుండి అమలయ్యే పన్ను విధానం వల్ల తాము తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు.
దీని ప్రభావం కస్టమర్లపైనే ఎక్కువగా ఉంటుందనీ, సామాన్యుల నడ్డి విరిచే ఇటువంటి విధానాన్ని మార్చాలని డిమాండ్ చేశారు. న్యాయంగా పెరిగితే సమర్థించడానికి సిద్ధంగా ఉన్నామని కానీ ఏకంగా స్టార్ హోటల్స్, ఏసీ రెస్టారెంట్లపై 16 శాతం వరకు పన్ను పెంచడం దారుణమన్నారు. తమిళనాడులో 2 శాతం, కర్నాటకలో 4 శాతం, కేరళలో 0.5 శాతం పన్ను రేటుంటే ఏపీలో ఒక్కసారిగా ఇంత స్థాయిలో పెంచడం సబబు కాదనీ, పాలకులు దీనిని పట్టించుకోకుంటే రానున్న రోజుల్లో నిరవధిక బంద్కు సైతం వెనకాడబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో హోటల్ అసోసియేషన్ సభ్యులు రుద్రప్ప, రమణ, రఘురామ్, మోహన్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
తిండికి తిప్పలు
Published Tue, May 30 2017 11:41 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
గుడుంబా స్థావరాలపై ఎకై ్సజ్ దాడులు
వరంగల్
గాలివాన బీభత్సం
వడదెబ్బకు ఆరుగురు మృతి
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
వేసవి దుక్కులతో మేలు
ఈవీఎంల రెండో అదనపు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్
తప్పక చదవండి
Advertisement