- ఏలూరు సమీపంలో లారీని ఢీకొట్టిన వ్యాన్
- హైదరాబాద్కు చెందిన న్యాయవాది దంపతుల దుర్మరణం.. 15 మందికి గాయాలు
ఏలూరు అర్బన్: విహార యాత్ర విషాదంగా మారింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం దెందులూరు చెక్పోస్ట్ వద్ద శనివారం వేకువజామున చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్లో స్థిరపడిన న్యాయవాది కందుకూరి హరిప్రసాద్ (49), ఆయన భార్య గీతాభవాని (42) అక్కడిక్కడే మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్లో న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డ వరంగల్ జిల్లా జనగాంకి చెందిన కందుకూరి హరిప్రసాద్ తల్లి సావిత్రమ్మ, భార్య గీతాభవాని, కుమారులు హరిదీప్, రాహుల్ కలిసి శుక్రవారం హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరి జనగాంలో ఉంటున్న ఆయన తమ్ముడు నాగేశ్వరరావు ఇంటికి వెళ్లారు.
అక్కడి నుంచి నాగేశ్వరరావు, ఆయన భార్య విమల, వారి ముగ్గురు కుమార్తెలు కీర్తి, నిధి, సిరి, మేనమామ షణ్ముఖాచారి, కుమారుడు ఎం.శ్రీకాంత్, భార్య శ్రీలత, వారి పిల్లలు సూర్యతేజ, శివరామ్తేజ, వారి సమీప బంధువు అరుణతో కలిసి శుక్రవారం రాత్రి టాటా వింగర్ వ్యాన్లో అరకు లోయ బయలుదేరారు. శనివారం వేకువజామున ఏలూరులో దెందులూరులోని చెక్ పోస్ట్ ప్రాంతంలో ముందు వెళుతున్న లారీని వ్యాన్ డ్రైవర్ ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో వ్యాన్ అదుపుతప్పి లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముందు సీట్లో కూర్చున్న హరిప్రసాద్, ఆయన భార్య గీతా భవాని అక్కడికక్కడే మృత్యువాతపడగా, డ్రైవర్ గుడ్లపల్లి నరేష్ సహా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. నాగేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉంది.
విషాదం నింపిన విహార యాత్ర
Published Sun, May 29 2016 4:02 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మూకుమ్మడిగా సెలవు పెట్టిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఉద్యోగులు
Yashika Aannand: అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న యాషిక ఆనంద్ (ఫొటోలు)
Paris Olympics 2024: భారత రెజ్లర్లకు ఆఖరి అవకాశం
65 ఏళ్లలో 7.8 శాతం తగ్గిన హిందూ జనాభా
కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం
Mayawati: మేనత్త నిర్ణయంపై పెదవి విప్పిన ఆకాష్ ఆనంద్
ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం
జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
పచ్చ మద్యం స్వాధీనం..
SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- మా పిల్లల చదువులపై కుట్రలొద్దు బాబూ
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement