భార్యను హత్య చేసిన భర్త | Sakshi
Sakshi News home page

భార్యను హత్య చేసిన భర్త

Published Thu, Dec 1 2016 9:07 PM

husband kills wife in medchal district

మేడ్చల్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి భార్యను కిరాతకంగా నరికి చంపాడు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లాలోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం వెలుగుచూసింది. స్థానిక దమ్మాయిగూడ అయ్యప్పకాలనీకి చెందిన మాధవి(34)ని భర్త కత్తితో పొడిచి హత్య చేశాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. హత్య చేసిన అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. లొంగిపోయాడు. కుటుంబ కలహాల వల్లే హత్య చేశానని పోలీసులకు తెలిపాడు.

Advertisement
Advertisement