♦ కోలమూరులో యువతి హత్య కేసును శోధించిన పోలీసులు
♦ ప్రధాన నిందితుడు రాజస్థాన్ వాసి ∙ఆర్థికపరమైన ఇబ్బందులే కారణం
రాజానగరం : ప్రేమ పేరుతో ఆ యువతీయువకులు దగ్గరయ్యారు. సహజీవనం చేస్తున్నారు. అయితే ఆర్థికపరమైన లావాదేవీల కారణంగా ఆ యువకుడు యువతిని హత్యచేశాడు. గుట్టుచప్పుడు కాకుండా ఆమె మృతదేహాన్ని బావిలో పడేసి తప్పించుకుందామనుకున్నాడు. పోలీసుల నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు. రాజానగరం పోలీసు స్టేషన్ పరిధి కోలమూరులో జరిగిన ఈ సంఘటనలో అరెస్టయిన ముద్దాయిల వివరాలను బుధవారం రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి స్థానిక పోలీసు స్టేషన్ వద్ద విలేకర్లకు వెల్లడించారు.
సిద్ధాంతిలా వచ్చి..
రాజస్థాన్కి చెందిన 29 ఏళ్ల యువకుడు మూడేళ్ల క్రితం సిద్ధాంతి మాదిరిగా తయారై కోలమూరు వచ్చాడు. అక్కడ చుండ్రు సత్యనారాయణ దంపతులతో పరిచయం పెంచుకుని, వారికి అబ్బాయిలు లేకపోవడంతో వారికి కొడుకుగా మారి, వారి ఇంటి పేరు, అడ్రసుతో ఆధార్ కార్డును పొందాడు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన కొడుకుగా భావించిన ఆ దంపతులు అతడు చెప్పిన విక్రమాదిత్య పేరును నమ్మి ముద్దుగా ఆదిత్య అని పిలుచుకుంటున్నారు. సిద్ధాంతి వేషాన్ని తీసేసి స్థానికంగా దొరికే చిల్లరమల్లర పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్న ఆదిత్య రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న రంపచోడవరానికి చెందిన పళ్లాల పద్మ(25)కు చేసిన రాంగ్ కాల్తో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడడం, అది క్రమేపీ ప్రేమగా మారడంతో ఎనిమిది నెలల క్రితం కోలమూరులోనే ఒక ఇల్లు తీసుకుని సహజీవనం చేయడం ప్రారంభించారు. ఇదే విషయాన్ని ఆమె ఆరు నెలల క్రితం ఆమె కుటుంబసభ్యులకు తెలిపింది.
ఆర్థికపరమైన తగాదాతో చంపేశాడు
సహజీవనం సాగిస్తున్న ఆదిత్య, పద్మల మధ్య తరచూ ఆర్థికపరమైన సమస్యలు వస్తుండేవి. ఈ క్రమంలో పద్మ అభద్రతాభానికిలోనై పెళ్లి విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చేది. దీంతో ఆమె తన చెప్పుచేతల్లో ఉండడం లేదని భావించిన ఆదిత్య ఈనెల 10న అదే ప్రాంతంలోని బొమ్మన కాలనీకి ఆమెతో సహా మరో ఇంటికి మకాం మార్చాడు. అయినా వారి మధ్య ఆర్థికపరమైన గొడవలు తొలగిపోలేదు. ఈనెల 16వ తేదీ సాయంత్రం కూడా అదేవిధంగా గొడవ పడిన సమయంలో ఆదిత్య కోపంతో పద్మను కొట్టడం, ఆమె సృహ తప్పిపడిపోవడం, వెంటనే ఆమె మెడలో ఉన్న చున్నీని తీసి, గొంతుకు బిగించాడు. చనిపోయిందని గ్రహించి, తన తండ్రిగా ఉన్న చుండ్రు సత్యనారాయణ సహయంతో ఆ మృతదేహాన్ని ఒక గోనె సంచెలో కట్టి, బొమ్మన కాలనీలోని పోతురాజు బావిలో విరిగిపోయిన సిమెంటు దిమ్మలు కట్టి పడేశాడు.
ఐదు రోజులకు (ఈనెల 21) ఆ సంచె పైకి తేలడంతోపాటు దుర్వాసన రావడంతో వీఆర్వో నిర్మలకుమారి ద్వారా విషయం తెలుసుకున్న రాజానగరం పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి, బావిలో సంచిలో కట్టి పడవేసిన యువతి మృతదేహాన్ని బయటకు తీశారు. గుర్తు తెలియని యువతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు పత్రికల్లో వచ్చిన వార్తలను ఆమె తల్లిదండ్రులు గుర్తించడంతో పరారీలో ఉన్న నిందితులు ఆదిత్య, సత్యనారాయణలను బుధవారం అరెస్టు చేసి, కోర్టు హాజరుపరిచామని అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి తెలిపారు.
ఆదిత్య పుట్టపూర్వోత్తరాలపై ఆరా..
ఈ హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న విక్రమాదిత్య రాజస్థాన్ నుంచి ఇక్కడికి రావడానికి గల కారణాలు, చుండ్రు సత్యనారాయణ దంపతులను తల్లిదండ్రులుగా చెప్పుకుంటూ వారి అబ్బాయిగానే ఆధార్ కార్డుతోపాటు ఇతర సదుపాయాలు పొందడంలో ఉన్న మతలబుపై ఆరా తీస్తున్నామని అర్బన్ జిల్లా ఎస్పీ తెలిపారు. రాజస్థాన్కు తమ సిబ్బందిని పంపిస్తామన్నారు. ఈ కేసును శోధించి, నిందితులను పట్టుకోవడంలో అత్యంత చురుకుగా వ్యవహరించిన డీఎస్సీ కె.రమేష్బాబు, సీఐ వరప్రసాద్, రాజానగరం పోలీసులను ఆమె అభినందించారు.
ప్రియుడే యముడు..
Published Thu, Aug 31 2017 2:56 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మూడో దశలో 63.53% పోలింగ్
ఒక్కో నియోజకవర్గంలో 20 వేలపైనే..
నల్లమలలోగుప్తనిధుల వేట
10న ప్రధాని మోదీ రాక
సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం
లక్ష్యం.. బహుదూరం
ఒక్కో నియోజకవర్గంలో 20 వేలపైనే..
జూనియర్ ఏషియన్విజేతకు సన్మానం
ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
వంశీచంద్ అభ్యర్థి కాదు.. రేవంత్ షాడో
తప్పక చదవండి
- బ్లూచిప్స్కు అమ్మకాల షాక్
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement