రాజ్యాంగవిరుద్ధం కాదు
►హైకోర్టులో ఆర్బీఐ కౌంటర్
►నకిలీ నోట్లు, నల్లధనాన్ని రూపుమాపేందుకే నిర్ణయం
► ఆర్బీఐ విధానాల్లో జోక్యం తగదని విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసులు చేసినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం ఉమ్మడి హైకోర్టుకు నివేదిం చింది. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశంలో ఆర్థిక సుస్థిరత నెలకొం టుందని వివరించింది. ‘‘వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలనే పరిగణనలోకి తీసుకోవాలి. సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే, నగదును ఎక్కువమంది డిపాజిట్దారులకు అందుబాటులో ఉంచేందుకే ఉపసంహ రణ విషయంలో పరిమితులు విధించాం. లెక్కల్లో చూపని డబ్బున్న వారికి మాత్రమే పెద్ద నోట్ల రద్దు ఇబ్బందిగా పరిణ మించింది. నిజాయితీపరులకు ఇది ఏమాత్రం ఇబ్బందిగా మారలేదు. పాత నోట్లను డిపాజిట్కు, మార్పిడికి తగిన ఏర్పాట్లు చేశాం. ఇక నోట్ల రద్దు నిర్ణయం ఎంత మాత్రం రాజ్యాంగ విరుద్ధం కాదు. చట్ట నిబంధనలకు లోబడి తీసుకున్నదే’’ అని పేర్కొంది. రూ.1000, రూ.500 నోట్ల రద్దుకు సంబంధించి కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరు తూ హైదరాబాద్కు చెందిన సుక్కా వెంకటేశ్వరరావు, న్యాయవాది కె.శ్రీనివాస్, నగదు ఉపసంహరణ పరిమితు లను సవాలు చేస్తూ మాజీ మంత్రి ఎం.వి.మైసూరారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ జరుపుతున్న హైకోర్టు, ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆర్బీఐని, కేంద్రాన్ని ఆదేశించడం తెలిసిందే.
ఈ మేరకు ఆర్బీఐ ఇష్యూ డిపార్ట్మెంట్ ఏజీఎం మనభంజన్ మిశ్రా కౌంటర్ దాఖలు చేశారు. ఆర్బీఐ చట్ట నిబంధనలను అనుసరించి, ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ సిఫారసుల మేరకే పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిం దని అందులో పేర్కొన్నారు. ‘‘ఇటీవలి కాలంలో నకిలీ నోట్ల చలామణి అధికమైంది. ఆర్థిక వ్యవస్థకు, దేశ భద్రతకు పెను ముప్పుగా పరిణమించిన ఈ బెడదను అడ్డుకునే చర్యలో భాగంగానే పెద్ద నోట్ల రద్దు సిఫార్సు జరిగింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు, ఉగ్రవాదానికి దేశ ఆర్థిక భద్రతను దెబ్బ తీసేందుకు నకిలీ నోట్లను అత్యధికంగా వినియోగిస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నోట్ల రద్దుపై ఆర్బీఐ సెంట్రల్ బోర్డు సిఫారసులను అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది.
ఈ నిర్ణయం వల్ల దేశ ద్రవ్యవ్యవస్థ గాడిన పడుతుంది. ఆర్థిక విధానాలకు సంబంధించి ఆర్బీఐ తీసుకునే నిర్ణయాలను సుప్రీంకోర్టు సమర్థించింది. నోట్ల రద్దుపై ముందస్తు సమాచారమిస్తే అసలు లక్ష్యం నెరవేరకుండా పోతుంది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బ్యాంకులు, పోస్టాఫీసులు తదితర చోట్ల నోట్ల మార్పిడికి, డిపాజిట్కు అవకాశం కల్పించాం. విస్తృత ప్రజా ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకున్నప్పుడు, వ్యక్తుల హక్కులకు, ప్రయోజనాలకు కలిగే ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోరాదు. ఇలాంటి వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటే తద్వారా ఎదురయ్యే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’’ అని కౌంటర్లో వివరించారు. ఈ దృష్ట్యా వ్యాజ్యాలన్నింటినీ భారీ జరిమానాలతో కొట్టేయాలని కోర్టును కోరారు. శుక్రవారం తదుపరి విచారణ జరుపుతామని ధర్మాసనం పేర్కొంది.
దేశ ప్రయోజనాల కోసమే ‘నోట్ల రద్దు’
Published Fri, Dec 16 2016 3:27 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 04-10)
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement