సాదా బైనామా అర్హులను పకడ్బందీగా గుర్తించాలి
Identify qualified armored plain bainama
సాదా బైనామా, అర్హులను, పకడ్బందీగా గుర్తించాలి
ఐటీడీఏ పీఓ రాజీవ్ గాంధీ హన్మంతు
భద్రాచలం :ప్రభుత్వం సాదాబైనామా ద్వారా రైతుల భూములను రిజిస్ట్రేషన్ చేయడానికి అర్హులను పకడ్బందీగా గుర్తించాలని ఐటీడీఏ పీఓ రాజీవ్ గాంధీ హన్మంతు అన్నారు.శనివారం సబ్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన భద్రాచలం, పాల్వంచ డివిజనల్లోనితహసీల్దార్,వీఆర్వోల అవగాహన సమావేశంలో పీఓ మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా భూమి హక్కు పత్రాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నా సన్న, చిన్న కారు రైతులకు సాదాబైనామాలు ఇవ్వడం కోసం చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఐదెకరాలలోపు భూమి ఉన్న పేద రైతులకు స్టాంపు ఫీజు లేకుండా ఉచితంగా సాదాబైనామాలు చేయనున్నట్లు తెలిపారు. 2014 జూన్ 2వ తేదీకి ముందు గిరిజనులే ,గిరిజనులకు భూములు అమ్మిన, కొన్న చట్టం ప్రకారంగా పరిశీలించాలన్నారు.
రికార్డులను నిశితంగా పరిశీలించాలి..
ఏజెన్సీలో పోడుభూములపై ఎక్కువగా సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున క్షేత్రస్థాయిలో నిశితంగా రికార్డులు పరిశీలించి పూర్తి స్థాయిలో గిరిజన రైతులను గుర్తించాలన్నారు. క్షేత్ర స్థాయిలో వీఆర్వోలు విచారణ చేసేటప్పుడు తహసీల్దార్లు కూడా వెళ్లి దరఖాస్తుదారులు సాగులో ఉన్నారా లేదా అనేది మొదటిగా పరిశీలించాలన్నారు.
వారంలోపే విచారణ పూర్తి చేయాలి..
ఫారం 11,12ల ద్వారా నోటీసులు జారీ చేసేటప్పుడు సంతకం చేసి తప్పనిసరిగా తేదీ వేయాలని, వారం రోజులలో విచారణ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తుదారుడు స్థానికంగా లేనప్పుడు సంబంధించిన స్థలం వద్దనే నోటీస్ పెట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్ర స్ధాయిలో విచారణ చేసిన వివరాలను కంప్యూటర్లో ఆన్లైన్ చేయాలని వివరించారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రాజ్, రిటైర్డ్ డీఆర్ఓ రాజారావు, ప్రోగ్రామ్ మేనేజర్ ప్రభాకర్రావు, డి. రమేష్, భద్రాచలం, పాల్వంచ డివిజన్ల డీఏఓలు, రామకృష్ణ, స్వర్ణ, తహసీల్దార్లు, వీఆర్వోలు పాల్గొన్నారు.
సాదా బైనామా అర్హులను పకడ్బందీగా గుర్తించాలి
Published Sat, Aug 6 2016 10:30 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement