యథేచ్ఛగా కొండ తవ్వకాలు | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా కొండ తవ్వకాలు

Published Thu, Aug 25 2016 11:49 PM

తవ్వకాలు జరుపుతున్న ప్రదేశం

కుదిపి(నెల్లిమర్ల రూరల్‌):మండలంలో కుదిపి సమీపంలో గల కొండను కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా తవ్వేస్తున్నారని కుదిపి, జగ్గరాజుపేటకు చెందిన గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల్లిమర్ల, కొత్తపేట తదితర గ్రామాలకు చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్లు గ్రావెల్‌ను పట్టుకెళ్తున్నట్టు వారు చెబుతున్నారు. ప్రధానంగా అధికారులకు ఆదివారం సెలవు కావడంతో శనివారం రాత్రినుంచే ఈ తవ్వకాలు విస్తతంగా సాగుతున్నాయని వారు పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి తక్షణమే తవ్వకాలు నిలుపుదల చేయాలని కోరుతున్నారు.
 

Advertisement
Advertisement