జైలు నుంచి జీవిత ఖైదీ పరారీ | Sakshi
Sakshi News home page

జైలు నుంచి జీవిత ఖైదీ పరారీ

Published Wed, Oct 14 2015 11:01 AM

inmate absconded in medak district jail

మెదక్ : మెదక్ జిల్లా సంగారెడ్డి జైలులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న యాదగిరి తప్పించుకుని పరారైయ్యాడు.  పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం ఎప్పటిలాగే పోలీసు పహారాలో యాదగిరి జైల్లో గార్డెనింగ్ పనులు చేస్తున్నాడు. ఆ క్రమంలో పోలీసుల కళ్లుగప్పి యాదగిరి జైలు నుంచి పరారైయ్యాడు. ఆ విషయాన్ని ఆలస్యంగా పోలీసులు గుర్తించారు.

ఇంతలో తేరుకున్న పోలీసులు అతడి కోసం గాలించిన ప్రయోజనం లేకుండా పోయింది. యాదగిరి పరారైపై జైలు సిబ్బంది.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారులు... జైలు సిబ్బందిపై మండిపడ్డారు. అలాగే ఈ ఘటనపై జైలు అధికారుల నుంచి ఉన్నతాధికారులు వివరణ కోరారు. 10 మంది మహిళల హత్య కేసులో యాదగిరి సంగారెడ్డి జైల్లో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడని జైలు అధికారులు వెల్లడించారు.

Advertisement
Advertisement